Home » YCP
తెలంగాణలో త్వరలో మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ పోటీకి సంబంధించి విజయనగరం ఎంపీ అప్పలనాయుడు క్లారిటీ ఇచ్చారు.
మాజీ సీఎం జగన్పై మంత్రి పార్థసారథి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 2024 ఎన్నికల్లో ప్రజల కోపానికి గురైన వైసీపీకి అమరావతి పాపమే శాపమైందని.. కేవలం 11 సీట్లకే పరిమితమైందని వ్యాఖ్యానించారు.
తునిలో వైసీపీ నేతలు రెచ్చిపోయారు. ఓ బర్త్డే పార్టీకి వెళ్లి వస్తున్న టీడీపీ నేతలపై కత్తులతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
రాష్ట్రంలో అధికారం కోల్పోయినా.. వైసీపీ కార్యకర్తల బరితెగింపు రాజకీయాలు ఆగడం లేదు. అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై వైసీపీ వర్గీయు దాడులకు పాల్పడ్డారు. ఇప్పటికే రప్పా.. రప్పా.. అంటూ వీరంగం చేసిన ఆ పార్టీ కార్యకర్తలలు తాజాగా టీడీపీ కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారు. వివరాలిలా ఉన్నాయి.
వైసీపీపై భానుప్రకాశ్ రెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. గోశాల నుంచి గోవిందుడి వరకు వైసీపీ నాయకులు ఆధారాలు సృష్టించి తమపై అపచారం మోపుతున్నారని ఆయన ఆరోపించారు.
త్వరలో కృష్ణమ్మ వెంకన్న పాదాలను తాకనుంది. నీవా బ్రాంచ్ కెనాల్ నుంచి హంద్రీనీవా జలాలను కల్యాణ్డ్యాంకు నింపేందుకు అడుగు ముందుకు పడింది.
లబ్ధిదారులకు ఇకపై మెటీరియల్కు బదులుగా నగదు రూపంలో బిల్లులు చెల్లించాలని కేంద్రప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ఆదేశాలతో లబ్ధిదారులకు, గృహనిర్మాణ శాఖ అఽఽధికారులకు కూడా ఊరట కలిగింది.
వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై మంత్రి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ రాజధాని అమరావతి అని తమకు పూర్తి క్లారిటీ ఉందని.. రాజధానిపై వైసీపీ కూడా స్పష్టత ఇవ్వాలని అన్నారు.
మాజీ సీఎం జగన్పై మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కమీషన్ల కోసమే జగన్ ప్రాజెక్టుల డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు..
దమ్ముంటే అసెంబ్లీకి వెళ్లండి.. అక్కడ మాట్లాడండి.. అంటూ తెలుగుదేశం పార్టీ పొలిట్బ్యూరో సభ్యుడు ఆర్.శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సమస్యను జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశంలో వైసీపీ నాయకులు లేవనెత్తడం విడ్డూరంగా ఉందన్నారు.