Home » West Indies Cricketers
వెస్టిండీస్లో పర్యటిస్తున్న శ్రీలంక మహిళల క్రికెట్ జట్టు తిరుగులేని విజయాలను సాధించింది. ఇప్పటికే 2-1 తేడాతో వన్డే సిరీస్ను కైవసం చేసుకున్న లంక జట్టు.. తాజాగా టీ20 సిరీస్ను కూడా 2-0తో చేజిక్కించుకుంది.
టీ20 వరల్డ్ కప్ 2026లో వెస్టిండీస్ తరపున అత్యుత్తమ బ్యాటర్గా నిలుస్తున్న షిమ్రోన్ హెట్మయెర్ మరో ఘనత సాధించాడు. ఆదివారం భారత్తో జరిగిన మ్యాచ్లో ఈ ఎడమచేతి బ్యాటర్ పాకిస్థాన్ ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ రికార్డును బ్రేక్ చేశాడు.
భారత జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ సంజు శాంసన్పై ప్రశంసలు కురిపించాడు. అతడొక వరల్డ్క్లాస్ ప్లేయర్ అంటూ ఆకాశానికెత్తాడు. నిన్న వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో సంజు అద్భుతంగా ఆడి.. టీమిండియాను గెలిపించిన సంగతి తెలిసిందే.
టీమిండియా హిట్టర్ రింకు సింగ్ ఇంట విషాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. నిన్న అతడి తండ్రి ఖచంద్ర సింగ్ కన్నుమూశారు. అంతటి విషాదంలో కూడా రింకు సింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు.
టీ20 ప్రపంచ కప్ 2026లో నిన్న దక్షిణాఫ్రికా, వెస్టిండీస్కు మధ్య జరిగిన మ్యాచ్ను తన తండ్రి దర్శన్తో కలిసి టీవీలో వీక్షించినట్లు టీమిండియా ప్లేయర్ అర్ష్దీప్ సింగ్ తెలిపాడు. ఆ సమయంలో వెస్టిండీస్ బ్యాటర్లు బౌండరీలు కొడుతుంటే... తన తండ్రి అరిచాడని, వారిని శపించాడని వివరించాడు.
సెమీస్ ఆశలు సజీవంగా నిలవాలంటే.. తప్పక గెలవాల్సిన మ్యాచ్లో టీమిండియా ఘన విజయం సాధించింది. టీ20 ప్రపంచ కప్2026 సూపర్-8లో భాగంగా ఫిబ్రవరి 26న భారత్, జింబాబ్వే మధ్య కీలక మ్యాచ్ జరిగింది. చెన్నై వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో భారత్ 72 పరుగుల తేడాతో విజయం సాధించింది.
టీ20 ప్రపంచ కప్ సూపర్ 8లో భాగంగా సౌతాఫ్రికా-వెస్టిండీస్ జట్లు తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన వెస్టిండీస్ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. సౌతాఫ్రికాకు 177 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
టీ20 ప్రపంచ కప్2026 సూపర్-8లో భాగంగా ఇవాళ దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ఫలితం చివర్లో భారత్పై ప్రభావం చూపించే అవకాశం ఉంది. సరిగ్గా చెప్పాలంటే ఇక్కడ దక్షిణాఫ్రికా గెలవాలని భారత్ కోరుకోవాలి.
టీ20 ప్రపంచ కప్ 2026 సూపర్ 8 దశలో జింబాబ్వేపై వెస్టిండీస్ 107 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే విండీస్ సాధించిన ఈ భారీ గెలుపు కారణంగా టీమిండియా సెమీఫైనల్ ఆశలు సంక్లిష్టమయ్యాయి.
టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా నిన్న జరిగిన సూపర్-8 మ్యాచ్లో జింబాబ్వేపై వెస్టిండీస్ 107 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో జింబాబ్వే ఓడినా.. ఆ జట్టు ప్లేయర్లు అరుదైన రికార్డును క్రియేట్ చేశారు.