Home » West Godavari
పాలకొల్లు నియోజకవర్గంలో రూ 5.61 కోట్లతో పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలు అమలు చేసి మాట నిలబెట్టుకున్నామని తెలిపారు.
పశ్చిమగోదావరి జిల్లా అత్తిలి మండలం ఈడూరు గ్రామంలో తండ్రి చేతిలో కుమారుడు దారుణ హత్యకు గురయ్యాడు. మద్యం మత్తులో తండ్రి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.
ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలం కోర్సవారిగూడెంలో ఆర్ఎంపీ చేసిన వైద్యం వికటించి ఎనిమిదేళ్ల బాలిక మృతి చెందింది. బాలికకు జ్వరం రావడంతో తల్లిదండ్రులు తొలుత దొరమామిడి పీహెచ్సీకి తరలించగా సాధారణ జ్వరమని వైద్యులు చికిత్స అందజేశారు.
వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు పోలీస్ కస్టడీ ముగిసింది. ఈరోజు వైద్య పరీక్షల నిమిత్తం ఎమ్మెల్సీని జీజీహెచ్ ఆస్పత్రికి పోలీసులు తీసుకొచ్చారు.
పశ్చిమగోదావరి జిల్లాలోని ఆకివీడులో రామాలయం నిర్మాణానికి అధికారులు అనుమతులు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. గత 80 సంవత్సరాలుగా అక్కడ రామాలయం ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతోందని హైకోర్టు వ్యాఖ్యానించింది.
చాట్రాయి మండలంలోని పోలవరం సెంటర్లో గల గాంధీజీ విగ్రహాన్ని గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు పాక్షికంగా ధ్వంసం చేశారు. విగ్రహం కాళ్లు పెచ్చులూడి ఊచలు బయటకు వచ్చాయి.
ఆకివీడు రామాలయం నిర్మాణాన్ని నిలిపివేయాలంటూ హైకోర్టులో వేసిన పిటిషన్లను పిటిషనర్లు ఉపసంహరించుకున్నారు. రామాలయం నిర్మాణానికి అన్ని అనుమతులు ఉన్నాయని ప్రభుత్వ తరఫు న్యాయవాదులు కోర్టుకు వివరించారు.
చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు అందించే పౌష్టికాహారంలో ఎలాంటి అవకతవకలకూ పాల్పడొద్దని రాష్ట్ర బాలల హక్కుల సంఘం సభ్యుడు వి.గాంధీబాబు హెచ్చరించారు.
ప్రేమ వివాహం చేసుకున్న జంటపై యువతి తల్లిదండ్రులు దాడి చేశారు. ఆపై యువతిని బలవంతంగా తీసుకెళ్లారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.
ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రాజెక్ట్ పరిసర ప్రాంతాల్లో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. పాత చేగొండపల్లి గ్రామం వద్ద ఆవుపై పులి దాడి చేసి చంపేసింది.