Home » West Godavari
గోశాల నుంచి గోపూజ కోసం సప్త గోకులం వద్దకు ఆవులను సిబ్బంది తీసుకెళ్లారు. సప్త గోకులాన్ని శుభ్రం చేస్తుండగా పక్కనే ఉన్న గడ్డిని ఆవులు మేస్తున్నాయి. ఈ సమయంలో ఆవులను త్రాచుపాములు కాటు వేశాయి.
మొంథా తుపాను నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం అయింది. ఈ నేపథ్యంలో తుపాను ప్రభావం ఎక్కువగా ఉన్న జిల్లాల్లో పాఠశాలలనూ మూసివేయాలని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా మూడు రోజులుగా ఎడతెరపిలేని వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి పశ్చిమ జిల్లాలోని పలు ప్రాంతాల్లోని రోడ్లు గజానికో గొయ్యి మాదిరిగా తయారయ్యాయి.
డీఎస్పీ జయసూర్యపై వచ్చిన ఫిర్యాదుల విషయాన్ని ప్రస్తావించి అతడి వ్యవహారశైలిపై నివేదిక పంపించాలని పవన్ ఆదేశాలు జారీ చేశారు.
పెళ్లైన తరువాత వచ్చే పండుగలకు కొత్త అల్లుళ్లకు అత్తింటి వారు జరిపే మర్యాదలు అంతా ఇంతా కాదు. సాధారణంగా సంక్రాంతి పండుగ సందర్భంగా కొత్త అల్లుళ్లకు కొత్త రకాల వంటకాలను రుచి చూపించడం జరుగుతుంది.
గత వైసీపీ ప్రభుత్వంలో మున్సిపాలిటీల నిధులను సైతం దారి మళ్లించారని మంత్రి రామానాయుడు ఆరోపించారు. పట్టణాలను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు.
పాలకొల్లు పట్టణానికి చెందిన పప్పుల దుర్గామల్లేశ్వరరావు కళ్లకు గంతలు కట్టుకుని బైక్ నడుపుతాడు.. బాణం వేస్తాడు.. అతని ప్రదర్శన చూస్తే కళ్లకు గంతలు కట్టినా చూస్తాడు అనిపిస్తుంది. అంత కచ్చితత్వంతో సాగే అతని ప్రదర్శన చూసేవారు ఊపిరి బిగబట్టాల్సిందే.
మార్కెట్పై జీఎస్టీ తగ్గింపు ప్రభావం స్పష్టగా కనిపిస్తుంది. ఈనెల 22నుంచి పలు వస్తువులుపై జీఎస్టీ తగ్గుతుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఉమ్మడి పశ్చిమ జిల్లాలోని అన్ని ప్రాంతాల్లోని మార్కెట్లపై ప్రభావం పడింది.
నూజివీడు ట్రిపుల్ ఐటీలో దారుణం చోటుచేసుకుంది. ఎగ్జామ్ హాల్లోకి అనుమతించలేదని అధ్యాపకుడిపై విద్యార్థి అతి దారుణంగా దాడి చేశాడు.
భర్త దుబాయ్ నుంచి తిరిగొచ్చేశాడని భార్య కోపం!. భార్య తనతో కాపురం చేయడం లేదని భర్త గొడవ. దీనిపై న్యాయం చెప్పండని భర్త పెద్దల వద్ద పంచాయితీ పెట్టాడు.