Home » West Godavari
నరసాపురం సిటింగ్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఈసారి టీడీపీ నుంచి పోటీ చేయబోతున్నారు. మంగళవారం రాత్రి ఆయన హైదరాబాద్లో చంద్రబాబుతో భేటీ సందర్భంగా ఈ నిర్ణయం జరిగినట్లు సమాచారం..
వైసీపీ(YCP)లో వర్గ విబేధాలు బయటపడుతున్నాయి. సొంత పార్టీలో నాయకులే కొట్టు కుంటున్నారు. ఇటీవల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీలో అసంతృప్త నేతలు తమ గళం విప్పుతున్నారు. తాజాగా ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం వైసీపీలో లుకలుకలు బయటపడ్డాయి.
తాజాగా తెలుగు రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి ఆన్లైన్లో కరెంట్ బిల్లుకు సంబంధించిన స్కామ్ లో చిక్కుకుని ఏకంగా రూ. 1.85 లక్షలు మోసపోయాడు.
పశ్చిమ గోదావరి జిల్లా: సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా పాలకొల్లు నియోజవర్గ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి నిమ్మల రామానాయుడు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. సోమవారం పాలకొల్లు మండలం వెలివెలి గ్రామంలో ప్రచారం నిర్వహిస్తున్న రామానాయుడుకు ప్రజలు అడుగడుగున నీరాజనం పలుకుతున్నారు.
నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామరాజుకు బీజేపీ టికెట్ ఇవ్వని నేపథ్యంలో ఆయనకు తామే అవకాశమివ్వాలని టీడీపీ నాయకత్వం దాదాపు నిర్ణయానికి వచ్చింది.
Andhrapradesh: ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకాతిరుమల చిన్న వెంకన్న ఆలయంలో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. నేడు స్వామివారికి ప్రీతికరమైన రోజు శనివారం కావడంతో స్వామిని దర్శించేందుకు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. అయితే ఒక్కసారిగా దేవస్థానం టికెట్ల కౌంటర్ల సర్వర్లు పనిచేయలేదు. సాంకేతిక లోపం కారణంగా టికెట్ కౌంటర్ల సర్వర్లు పనిచేయని పరిస్థితి.
Andhrapradesh: వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు టీడీపీ తరపున టికెట్ ఆశించిన భంగపడ్డ మాజీ మంత్రి పీతల సుజాత పార్టీ అధిష్టానాన్ని ఉద్దేశించి శుక్రవారం సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. అధిష్టానం టికెట్ ఇవ్వకపోవడం చాలా బాధ కలిగించిందని వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు.
Andhrapradesh: జనసేన అధినేత పవన్ వ్యాఖ్యలు చూస్తుంటే గురివింద గింజ సామెత గుర్తుకు వస్తుందని భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... ప్రజా రాజ్యం పార్టీ నాటి నుంచి పవన్ భాష ఏ రకంగా ఉందో అందరికీ తెలుసన్నారు.
Andhrapradesh: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పాలకొల్లులోని క్షీరా రామలింగేశ్వర స్వామి ఆలయానికి వేకువజాము నుంచి భక్తులు పోటెత్తారు. హర హర మహాదేవ శంభో శంకర అంటూ క్యూలైన్లో స్వామి వారి దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. శివరాత్రి సందర్భంగా పంచారామ క్షేత్రాల దర్శనార్థం వచ్చే భక్తుల కోసం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు.
Andhrapradesh: ఉండి టీడీపీ అసెంబ్లీ టికెట్ వివాదంపై పార్టీ అధిష్టానం దృష్టిసారించింది. ఉండి టికెట్ను సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకి హైకమాండ్ కేటాయించింది. అయితే అధిష్టానం తీరుపై మాజీ ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. టికెట్ ఆశిస్తున్న తనకు కనీసం సమాచారం ఇవ్వకుండానే రామరాజుకి టికెట్ ఇచ్చారంటూ మండిపడ్డారు.