Home » West Bengal
పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ పార్టీ ఎంపీ అభిషేక్ బెనర్జీపై దాడి ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. శనివారం సోనాపూర్లో స్థానికులు అభిషేక్పై విచక్షణా రహితంగా దాడి చేశారు.
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీపై పశ్చిమ బెంగాల్లోని సోనాపూర్లో స్థానికులు దాడి చేసిన సంగతి తెలిసిందే. మేనల్లుడిపై దాడి జరిగిన సంగతి తెలియగానే మమతా బెనర్జీ హుటాహుటిన ఆస్పత్రి దగ్గరకు వెళ్లారు. మేనల్లుడిని పరామర్శించారు.
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీపై దాడి జరగడంపై ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. 'పాలకులు హంతకులుగా మారుతున్నారు. బీజేపీకి ఇది సిగ్గుచేటు' అంటూ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో మండిపడ్డారు.
పశ్చిమబెంగాల్లోని సోనార్పూర్లో శనివారం టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీపై జరిగిన దాడిని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఖండించారు. ఈ ఘటన వెనుక కుట్ర కోణం కనిపిస్తోందని సమాజ్వాదీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ వ్యాఖ్యానించారు.
సోనార్పూర్ పర్యటనకు వెళ్లిన టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీపై కొందరు రాళ్లు, కోడి గుడ్లతో దాడి చేశారు. దీంతో, భద్రతా సిబ్బంది ఆయనను వెంటనే అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లారు.
పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బంగ్లాదేశీ అక్రమ వలసదారుల కంటిమీద కునుకు లేకుండా పోయింది. అరెస్ట్ల భయంతో అక్రమ వలసదారులు అల్లాడిపోతున్నారు.
పశ్చిమ బెంగాల్ పోలీసులు క్రిమినల్స్కు చుక్కలు చూపిస్తున్నారు. క్రిమినల్స్ను అర్ధనగ్నంగా నడిరోడ్లపై తిప్పుతున్నారు. పశ్చిమ బెంగాల్లో అధికారం మారిన నాటి నుంచి పోలీసులు క్రిమినల్స్ విషయంలో దూకుడుగా వ్యవహరిస్తున్నారు.
భారత-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో చొరబాట్లను అరికట్టడానికి, జాతీయ భద్రతను మరింత పటిష్టం చేయడానికి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. సరిహద్దు భద్రతా దళానికి అదనపు భూమిని బదిలీ చేసింది.
పశ్చిమబెంగాల్లో సుదీర్ఘ పాలనకు తెరపడటంతో చిక్కుల్లో పడిన మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి మరిన్ని చిక్కులు తప్పలే కనిపించడం లేదు. ఆ పార్టీకి చెందిన సుమారు 20 మంది ఎంపీలు, 50 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు బీజేపీతో సంప్రదింపులు జరుపుతున్నట్టు బీజేపీ ఎంపీ సౌమిత్రా ఖాన్ తాజాగా బాంబు పేల్చారు.
పశ్చిమబెంగాల్లోని ఉంటున్న బంగ్లాదేశ్ అక్రమవలసదారులపై చర్యలను సువేందు అధికారి ప్రభుత్వం ముమ్మరం చేసింది. ప్రభుత్వం చర్యలు తీసుకోకముందే పారిపోండి అంటూ ముఖ్యమంత్రి తాజాగా వారిని హెచ్చరించారు.