Home » West Bengal
టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ భద్రతను పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తగ్గించింది. దాదాకు గతంలో ఉన్న జెడ్ కేటగిరీ భద్రతను వై కేటగిరికి కుదిస్తూ బెంగాల్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
కోల్కతాలోని ఓ కాలేజ్ యూనియన్ రూములో చెదలు పట్టిన నోట్ల కట్టలు వెలుగుచూశాయి. రెండు సూట్ కేసుల్లో దాచిన 100, 500 నోట్ల కట్టలను పనివారు గుర్తించారు.
పార్టీ ఎంపీలు అభిషేక్ బెనర్జీ, కల్యాణ్ బెనర్జీపై దాడులకు నిరసనగా మమతా బెనర్జీ కోల్కతాలో ధర్నా చేపట్టారు. అయితే ఇంత పెద్ద కార్యక్రమానికి ఆరుగురు ఎమ్మెల్యేలు, ఐదుగురు ఎంపీలు మాత్రమే హాజరుకావడం తాజాగా చర్చనీయాంశమవుతోంది.
తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అభిషేక్ బెనర్జీ, కల్యాణ్ బెనర్జీపై దాడులకు నిరసనగా ఆ పార్టీ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోల్కతాలో మంగళవారంనాడు బైఠాయింపు దీక్షకు దిగారు.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత టీఎంసీ పార్టీ పరిస్థితి దారుణంగా తయారైంది. పార్టీ తీవ్ర అంతర్గత సంక్షోభంలో చిక్కుకుంది. టీఎంసీలో కీలక నేతల తిరుగుబాటు మొదలైంది.
పశ్చిమబెంగాల్లో పదిహేనేళ్ల తృణమూల్ కాంగ్రెస్ పాలన ఎన్నో అవినీతి ఆరోపణలను మూటగట్టుకుంది. ముఖ్యంగా సామాన్య ప్రజల నుంచి తృణమూల్ నేతలు, కార్యకర్తలు 'కట్ మనీ' పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఎప్పట్నుంచో ఉన్నాయి.
టీఎంసీ సీనియర్ నేతలపై జరిగిన దాడులపై నిరసన తెలిపేందుకు తమ పార్టీకి పోలీసులు అనుమతి నిరాకరించినట్టు ఆ పార్టీ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు. పశ్చిమబెంగాల్లో 'పోలీస్ రాజ్యం' నడుస్తోందని ఆరోపించారు.
మమతాబెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సోమవారంనాడు ఇద్దరు ఎమ్మెల్యేలపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. పార్టీ ఎమ్మెల్యేలు సందీపన్ సహా, రితబ్రత బెనర్జీలను పార్టీ నుంచి బహిష్కరించింది. పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేసింది.
పశ్చిమ బెంగాల్లో ముఖ్యమంత్రి సువేందు అధికారి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం మంత్రివర్గాన్ని విస్తరించింది. ఈ రోజు (సోమవారం) 35మంది బీజేపీ ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.
పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం కేబినెట్ను విస్తరించనుంది. ఈరోజు (సోమవారం) సుమారు 35 మంది బీజేపీ ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. కోల్కతాలోని లోక్ భవన్లో గవర్నర్ ఆర్.ఎన్.రవి కొత్త మంత్రులతో ప్రమాణం చేయించనున్నారు.