Home » West Bengal
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్కు ప్రచారం సోమవారం సాయంత్రం 6 గంటలతో ముగుస్తోంది. బీజేపీ ప్రభుత్వాన్ని రాష్ట్రంలో తొలిసారి అధికారంలోకి తీసుకురావాలనే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చివరినిమిషంలో సుడిగాలి ప్రచారం సాగించారు.
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో 'మా-మాటి-మనుష్' (తల్లి, నేల, ప్రజలు) విజయం ఖాయమని ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) అన్నారు. బెంగాల్ సంస్కృతి, వారసత్వాన్ని రక్షించుకోవాలని, విభజన శక్తులను తిప్పికొట్టాలని ఓటర్లను కోరారు.
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత ప్రచారానికి మరి కొద్ది గంటల్లోనే తెరపడనుంది. ర్యాలీలు, రోడ్షోలతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత ప్రచారం సాగించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. సోమవారం నాడు బరాక్పూర్లో జరిగిన ప్రచార ర్యాలీలో పాల్గొన్నారు.
ఇప్పుడు పశ్చిమ బెంగాల్ రాజకీయాలు 'మరమరాల మిక్చర్' ప్రధానాంశంగా నడుస్తున్నాయి. మోదీ, మమతా బెనర్జీ మధ్య ఒకప్పుడు కేవలం ఆహారం, ఆరోగ్యం గురించి ఇదే మిక్చర్ మీద జరిగిన చర్చ, ఇప్పుడు ఇద్దరు అగ్రనేతల మధ్య ప్రధాన విమర్శనాస్త్రంగా మారింది.
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ తన సొంత నియోజవర్గమైన భవానీపూర్లో ఆదివారంనాడు పాదయాత్ర జరిపారు. స్థానికులను కలుస్తూ ముందుకు కదిలారు. ఈ పాదయాత్రలో వేలాది మంది మద్దతుదారులు పాల్గొన్నారు.
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. టీఎంసీ ఎన్నికల ప్రచారానికి మద్దతుగా బేలేఘాటాలో ఆదివారంనాడు జరిగిన ఎన్నికల సభలో ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని 'బలహీన ప్రధాని'గా అభివర్ణించారు.
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకుంటోంది. రెండో విడత పోలింగ్కు సోమవారంతో ప్రచారం ముగియనుండటంతో ప్రధాన పార్టీలన్నీ బహిరంగ సభలు, రోడ్షోలతో ఊదరగొడుతున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారంనాడు వరుస బహిరంగ సభలు, రోడ్షోలతో ప్రచారం సాగించారు.
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి పూర్తి అనుకూల పవనాలు వీస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తొలి విడత పోలింగ్లో భారీ ఓటింగ్తో టీఎంసీకి గట్టి దెబ్బ తగిలిందని, తుది విడత ముగిసేసరికి బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు.
పశ్చిమబెంగాల్లో కీలకమైన రెండో విడత పోలింగ్కు భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సౌత్ 24 పరగణాల జిల్లాలోని భాంగర్లోని ఓ ఇంటి నుంచి సుమారు 100 నాటు బాంబులను పోలీసులు ఆదివారంనాడు స్వాధీనం చేసుకున్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇద్దరూ అధికారం కోసం ఆరాటపడుతూ పేదలను పట్టించుకోరని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. దేశ సంపదను ధనికులకు దోచుపెడుతున్నారంటూ విమర్శించారు.