Home » West Bengal
పశ్చిమబెంగాల్ ఎన్నికల ప్రచారం మధ్యలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక చోట ఆగి 'ఝుల్మురి' కొనుక్కు తినడాన్ని ఒక 'డ్రామా'గా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ కొట్టివేశారు. ఎలాంటి ముందస్తు ప్రణాళిక లేకుండా ఇదంతా జరిగిందా అని ప్రశ్నించారు.
పశ్చిమబెంగాల్లో దశాబ్దానికి పైగా టీఎంసీ అధికారంలో ఉన్నప్పటికీ రాష్ట్రం అభివృద్ధికి నోచుకోలేదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ మార్పును తీసుకురావాలని ఓటర్లను కోరారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పశ్చిమబెంగాల్లో ఆదివారంనాడు సుడిగాలి ప్రచారం సాగించారు. పురూలియా, ఝార్గ్రామ్, మేదినీపూర్, బిష్ణుపూర్లలో వరుస ర్యాలీల్లో పాల్గొన్నారు. ప్రచారానంతరం ఝూర్గ్రామ్లోని ఒక చిన్న దుకాణంలో రుచిరకమైన మరమరాలు (ఝుల్మురిని) తింటూ కొద్దిసేపు అక్కడి స్థానికులతో మమేకమయ్యారు.
మహిళలకు హక్కులు దక్కకుండా కాంగ్రెస్తో టీఎంసీ కుమ్మక్కై బిల్లును అడ్డుకుందంటూ ప్రధాని బెంగాల్ ఎన్నికల ప్రచారంలో తాజాగా విమర్శించగా, మహిళలకు ప్రాతనిధ్యం కల్పించడంలో టీఎంసీ ఛాంపియన్ అని మమతా బెనర్జీ తిప్పికొట్టారు.
లోక్సభలో మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లు వీగిపోవడంతో విపక్షాలపై మోదీ విమర్శల దాడిని కొనసాగించారు. కాంగ్రెస్ పార్టీతో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సారథ్యంలోని టీఎంసీ కుమ్మక్కై దిగువసభలో మహిళా రిజర్వేషన్ బిల్లును ఓడించారని, ఇందువల్ల మహిళలకు జరగాల్సిన న్యాయం జరగలేదని విమర్శించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం రాత్రి 8.30 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనుండటంపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ స్పందించారు. మరోసారి తన 'కట్టుకథల'తో నమ్మించేందుకే జాతినుద్దేశించి ఆయన ప్రసంగించనున్నారని అన్నారు.
ఓ యువకుడు ప్రాణాలకు తెగించాడు. ఏకంగా తన బైకుతో రైలును లాగడానికి ప్రయత్నించాడు. ఈ సంఘటన పశ్చిమ బెంగాల్లో చోటుచేసుకుంది.
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆసక్తికర ఘట్టం చోటుచేసుకుంది. కాంతి పార్లమెంటరీ నియోజకవర్గంలో ప్రచారానికి వచ్చిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు బెంగాల్ బీజేపీ నేత సువేందు అధికారి పాదాభివందనం చేశారు.
ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ మునిమనుమడు చంద్ర కుమార్ బోస్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆయన టీఎంసీలో చేరడం ప్రాధాన్యం సంతరించుకుంది.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. నియోజకవర్గాల పునర్విజన ద్వారా బెంగాల్ను మూడు ముక్కలు చేయాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆలోచనగా ఉందని ఆరోపించారు.