Home » Weather
ఎండలు దంచికొడుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ ప్రజలకు కీలక సూచనలు చేసింది. వడదెబ్బలు తగిలే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. దీంతో జనాలు ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదై జనాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
అక్షయ తృతీయ రోజున బంగారు, వెండి ఆభరణాల కొనుగోలు చేస్తే మంచి జరుగుతుందనే నమ్మకంతో జనం పసిడి దుకాణాలకు క్యూ కడుతున్నారు.
ఈ ఏడాది తెలుగు రాష్ట్రాల్లో సాధారణ వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ రెండు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత పెరుగుతుందని తెలిపింది.
తెలుగు రాష్ట్రాల్లో ఎండ తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. తెలంగాణ నిజామాబాద్ జిల్లా భీంగల్, మల్కాపూర్లలో 41.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న రెండు రోజులు ఎండలు, వడగాల్పుల తీవ్రత అధికంగా ఉండనుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఎండ, వడగాలుల దృష్ట్యా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
తెలంగాణలో వేసవి తీవ్రత మొదలైంది. అన్ని జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా పగటిపూట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రేపటి నుంచి ఎండ తీవ్రత మరింత పెరగనున్నట్లు వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో..
ఆంధ్రప్రదేశ్లో ద్రోణి ప్రభావంతో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఈ మేరకు ఎండ తీవ్రత, పిడుగులతో కూడిన అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు.
కాకినాడ జిల్లాలో ఎండల తీవ్రతతో అల్లాడిపోతున్న ప్రజలకు వాతావరణం ఒక్కసారిగా చల్లబడి భారీ ఊరటనిచ్చింది. తుని పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.
రాబోయే మూడు గంటల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో వాతావరణం మారే అవకాశం ఉన్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.