Home » Warangal
సామాజిక కార్యకర్త గాదె ఇన్నయ్యకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో చంచల్గూడ జైలులో ఉన్న ఆయన విడుదల కానున్నారు.
కోడిమాంసం దరలు రోజురోజుకు పెరుగుతుండడంతో.. సామాన్యులు చికెన్ కొని వండుకొని తినే పరిస్థితి లేకుండా పోతోంది. ప్రస్తుతం చికెన్ రేట్లు మాంసంతో పోటీపడుతున్నాయి. పనిలోపనిగా మరోపక్క మేడారం మహాజాతర కూడా రావడంతో ఇక కోళ్ల రేట్లు ఒక్కసారిగా పెరిగిపోయాయి.
మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతరకు ఏర్పాట్లను శరవేగంగా జరుగుతున్నాయి. ఈనెల 28 నుంచి 31వరకు జాతర జరగనుంది. అయితే.. పెద్దఎత్తున భక్తులు విచ్చేయనుండడంతో భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది.
సమ్మక్క-సారలమ్మ మహా జాతరకు ఇంకా 15 రోజుల గడువు ఉన్నప్పటికీ ప్రస్తుతం మేడారంలో భక్తులు ముందస్తు మొక్కులు సమర్పించుకుంటున్నారు. నిన్న ఒక్కరోజే దాదాపు 30 వేల మంది వరకు భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారని అంచనా.
జనగామ జిల్లాను రద్దు చేస్తే.. అగ్నిగుండమే.. అని బీఆర్ఎస్ నాయకుడు. స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. ఆయన మాట్లాడుతూ.. అసలు రాష్ట్రంలో రేవంత్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందన్నారు.
మేడారం సమ్మక్క- సారలమ్మ మహాజాతరకు ఇంకా సమయం ఉన్నప్పటికీ భక్తులు ముందుగానే వెళుతుండడంతో ఆర్టీసీ బస్టాండ్ కిటకిటలాడుతోంది. జాతర కోసం ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేసింది. కాగా.. జాతర సమయంలో భక్తలు పెద్దసంఖ్యలో విచ్చేయనుండడంతో.. ముందుగానే వెళుతున్న భక్తులు అమ్మవార్ల దర్శనానికి వెళుతున్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఐలోని మల్లన్న జాతర మంగళవారం నుంచి ప్రారంభంకానుంది. ఈ జాతరకు ఉమ్మడి జిల్లా నుంచేగాక చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు విచ్చేస్తుంటారు. కాగా.. జాతరను పురష్కరించుకుని అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
హనుమకొండలో భారీ సంఖ్యలో వీధి కుక్కలను హతమార్చిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామ పంచాయతీ సిబ్బందే స్వయంగా ఈ దారుణానికి ఒడిగట్టడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. మూగజీవాల పట్ల ఇంతటి క్రూరత్వమా అని జంతు ప్రేమికులు మండిపడుతున్నారు.
సమ్మక్క, సారలమ్మ జాతర తెలంగాణ రాష్ట్రంలో జరుపుకునే అతి పెద్ద వనదేవతల జాతర. దేశ వ్యాప్తంగా సమ్మక్క-సారలమ్మ వనదేవతలను దర్శించుకోవడానికి లక్షల మంది భక్తజనం తరలి వస్తుంటారు.
మహబూబాబాద్ ప్రభుత్వాస్పత్రిలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఓ సైకో వీరంగంతో ఆస్పత్రిలో రోగులు భయభ్రాంతులకు గురయ్యారు.