Home » Warangal
సమ్మక్క-సారలమ్మ మహా జాతరకు ఇంకా 15 రోజుల గడువు ఉన్నప్పటికీ ప్రస్తుతం మేడారంలో భక్తులు ముందస్తు మొక్కులు సమర్పించుకుంటున్నారు. నిన్న ఒక్కరోజే దాదాపు 30 వేల మంది వరకు భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారని అంచనా.
జనగామ జిల్లాను రద్దు చేస్తే.. అగ్నిగుండమే.. అని బీఆర్ఎస్ నాయకుడు. స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. ఆయన మాట్లాడుతూ.. అసలు రాష్ట్రంలో రేవంత్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందన్నారు.
మేడారం సమ్మక్క- సారలమ్మ మహాజాతరకు ఇంకా సమయం ఉన్నప్పటికీ భక్తులు ముందుగానే వెళుతుండడంతో ఆర్టీసీ బస్టాండ్ కిటకిటలాడుతోంది. జాతర కోసం ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేసింది. కాగా.. జాతర సమయంలో భక్తలు పెద్దసంఖ్యలో విచ్చేయనుండడంతో.. ముందుగానే వెళుతున్న భక్తులు అమ్మవార్ల దర్శనానికి వెళుతున్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఐలోని మల్లన్న జాతర మంగళవారం నుంచి ప్రారంభంకానుంది. ఈ జాతరకు ఉమ్మడి జిల్లా నుంచేగాక చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు విచ్చేస్తుంటారు. కాగా.. జాతరను పురష్కరించుకుని అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
హనుమకొండలో భారీ సంఖ్యలో వీధి కుక్కలను హతమార్చిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామ పంచాయతీ సిబ్బందే స్వయంగా ఈ దారుణానికి ఒడిగట్టడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. మూగజీవాల పట్ల ఇంతటి క్రూరత్వమా అని జంతు ప్రేమికులు మండిపడుతున్నారు.
సమ్మక్క, సారలమ్మ జాతర తెలంగాణ రాష్ట్రంలో జరుపుకునే అతి పెద్ద వనదేవతల జాతర. దేశ వ్యాప్తంగా సమ్మక్క-సారలమ్మ వనదేవతలను దర్శించుకోవడానికి లక్షల మంది భక్తజనం తరలి వస్తుంటారు.
మహబూబాబాద్ ప్రభుత్వాస్పత్రిలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఓ సైకో వీరంగంతో ఆస్పత్రిలో రోగులు భయభ్రాంతులకు గురయ్యారు.
నూతన సంవత్సర వేడుకలను హనుమకొండ కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు ఒకరికొకరూ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. అనంతరం అవినీతి నిర్మూలన కోసం జ్వాలా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో హనుమకొండ కలెక్టరేట్లో జరిగిన వినూత్న కార్యక్రమంలో అధికారులు పాలుపంచుకున్నారు.
బాలికల హాస్టల్లో ఓ ఆగంతకుడు హల్చల్ చేశాడు. హాస్టల్లోకి చొరబడ్డ ఆ వ్యక్తి.. అతడి స్నేహితులను కూడా అక్కడకు పిలిపించుకున్నాడు. దీంతో బాలికలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
వరంగల్ జిల్లా జాఫర్ఘడ్లో మాజీ మావోయిస్ట్, సామాజిక కార్యకర్త గాదె ఇన్నయ్యకు చెందిన మా ఇల్లు అనాథాశ్రమంలో NIA అధికారులు సోదాలు నిర్వహించారు. మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో ఆయనపై కేసు నమోదు చేశారు. ఇన్నయ్యను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.