Home » Warangal
గిరిజన విద్యార్థుల భవిష్యత్కు బంగారు బాటలు వేయడానికి.. వారికి ఉత్తమవిద్యను, క్రమశిక్షణతో కూడిన విలువైన జీవితాన్ని అందించడానికి, సైనిక ఉద్యోగాలు సాధించడానికి చక్కని వేదిక వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్నగర్ గిరిజన సైనిక్స్కూల్.
వరంగల్ జిల్లా ఖిలావరంగల్ మండలం బొల్లికుంటలో తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతోంది. బొల్లికుంట చౌరస్తాలో అర్ధరాత్రి శివాజీ విగ్రహం ఏర్పాటు వివాదానికి దారి తీసింది.
నేటినుంచి ఈనెల 20వ తేదీ వరకు ఉమ్మడి వరంగల్ జిల్లా అంతటా గంటకు 30నుంచి 40కిలోమీటర్ల వేగంతో బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశముందని వాతావరణ శాఖ ప్రకటించింది.
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో పసుపు గరిష్ఠ ధర రికార్డు స్థాయిలో క్వింటాకు రూ.16,159గా నమోదైంది.
వరంగల్ విమానాశ్రయం ఆకృతిలో కాకతీయ సంస్కృతికి పెద్ద పీట వేస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు.
తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య వివాదం ముదురుతోంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ను కలిసి మంత్రి సురేఖ ఫిర్యాదు కూడా చేశారు. ఈ వివాదంపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మంత్రి కొండా తాజాగా మాట్లాడారు.
వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో ఘోర ప్రమాదం జరిగింది. ముత్తోజిపేట దగ్గర మినీ ట్రక్కు బోల్తాపడి ఒకరు మృతి చెందగా, 15 మందికి గాయాలు అయ్యాయి.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమాని హనుమకొండ హనుమాన్ నగర్కు చెందిన 17 ఏళ్ల నిరంజన్ మృతి చెందాడు. నిరంజన్ ప్రాణాంతకమైన వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి నిరంజన్ ప్రాణాలు కోల్పోయాడు.
జనగామ జిల్లాలో రిటైర్డ్ ఉపాధ్యాయుడి ఆత్మహత్య తీవ్ర కలకలం రేపుతోంది. జనగామ పట్టణంలోని పూర్ణిమ కాలనీకి చెందిన పగిడిపల్లి మల్లయ్య అనే రిటైర్డ్ టీచర్ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. వరంగల్ జిల్లా వ్యవహారాల్లో కడియం శ్రీహరి జోక్యం చేసుకుంటున్నారంటూ మంత్రి సురేఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.