Home » Vizianagaram
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శనివారం జాతికి అంకితం కానున్న వేళ.... విమానయాన సంస్థలు తమ షెడ్యూల్స్ ప్రకటిస్తున్నాయి. మొదట ఎయిర్ ఇండియా స్పందించింది. ఆగస్టు 17 నుంచి తమ సేవలు అందిస్తామని శుక్రవారం ప్రకటించింది.
ఉత్తరాంధ్రకు కొత్త రెక్కలు తెచ్చిన అద్భుతం... భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ ఘట్టానికి సర్వం సిద్ధమైంది.
భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రదర్శించిన థింసా నృత్యం గిన్నిస్ రికార్డు సృష్టించింది. ఏకకాలంలో 16 వేల మంది ఆదివాసీ బాలికలతో థింసా నృత్యాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. థింసా నృత్యంలో మంత్రి సంధ్యారాణి పాల్గొన్నారు.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంపై జగన్ది ఆది నుంచీ అడ్డుపుల్ల వేసే ధోరణే! అసలు కొత్త ఎయిర్పోర్టు అవసరమా? ‘విశాఖలో ఒకటి ఉందికదా! ఎర్రబస్సు రాని ఊర్లో ఎయిర్పోర్టు కడతారా?’... అంటూ ఎద్దేవా చేశారు. కోర్టుకు పోతాం, కేసులు వేస్తాం! అని బహిరంగ సభల్లో ప్రకటించారు.
భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ‘రెక్కలు’ విచ్చుకొనే సమయం ఆసన్నమైంది. ఈ నూతన ఎయిర్పోర్టు ద్వారా ప్రపంచ దేశాలతో అనుసంధానం పెరగనుంది.
గిరిజన సంప్రదాయ నృత్యం థింసా.. బృంద గానంలాంటింది! పది నుంచి పాతికమంది జట్టుకట్టి లయబద్ధంగా నృత్యం చేయడం దీని ప్రత్యేకత! చూపరులను ఎంతోగానో ఆకట్టుకుంటుందీ నృత్యం! అలాంటిది పదులూ వందలూ కాదు.. ఏకంగా పద్నాలుగు వేల మంది ఒకేసారి థింసా నృత్యం చేస్తే..! అద్భుతం కదూ!! ఆగస్టు 1న ప్రధాని మోదీ ప్రారంభించనున్న భోగాపురం విమానాశ్రయం ఆవరణలో ఈ అద్భుత ఆవిష్కరణ జరగనుంది.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం రెడీ అయ్యింది. ఇక ప్రారంభోత్సవమే తరువాయి. విశాఖ నగరంతోపాటు అటు ఉత్తరాంధ్ర, ఇటు విజయవాడ, తూర్పు గోదావరి జిల్లాల ప్రజలకు భోగాపురం విమానాశ్రయం సేవలు అందించనుంది. ఆయా ప్రాంతాల నుంచి భోగాపురం చేరుకునే మార్గాలివి...
భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో 13 వేలమంది గిరిజనులతో థింసా నృత్య ప్రదర్శన నిర్వహించనున్నట్టు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు.
భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు జరుగుతున్నాయి.
విజయనగరం జిల్లా భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం ఆగస్టు 1న ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్ర పౌర విమానయాన శాఖ కీలక గెజిట్ విడుదల చేసింది.