Home » Visakhapatnam
Yoga Day: విశాఖ నగరంలో ఈ నెల 21న (శనివారం) జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవానికి అన్నీ ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి సవిత తెలిపారు. ఈ కార్యక్రమానికి కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలు, విద్యార్థిని, విద్యార్థులు, ప్రజలందరూ పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపిచ్చారు.
Sunny Bhayya: నెల రోజుల క్రితం చెన్నై ఎయిర్పోర్టులో యూట్యూబర్ సన్నీ భయ్యా కనిపించకుండా పోయాడు. చెన్నై ఎయిర్పోర్టులో దిగగానే ఎన్ఐఏ అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి.
Yoga Event: హోంమంత్రి వంగలపూడి అనిత ఆధ్వర్యంలో రేవు పోలవరం తీరంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ పర్యాటక ప్రాంతమైన రేవు పోలవరం తీరంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ప్రజల ఆరోగ్యం కోసం ఆలోచించిన నాయకులు ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు అని అన్నారు.
Encounter: మావోయిస్టు పార్టీ కేంద్రకమిటీ సభ్యుల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. 21 ఏళ్ల క్రితం పార్టీ ఆవిర్భావం సమయంలో 42 మంది ఉండేవారు. ఎన్కౌంటర్లు, లొంగుబాట్లతో సభ్యుల సంఖ్య తగ్గింది. ఈ ఏడాదే ఎన్కౌంటర్లలో నలుగురు మృతి చెందారు. మిగిలిన 16 మందిలో 11 మంది తెలుగువారే కావడం గమనార్హం.
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖ బీచ్ రోడ్డుపై ఐదు లక్షల మందితో యోగాసనాల కార్యక్రమం నిర్వహించి గిన్నీస్ రికార్డు సాధించడానికి విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి.
సుమారు 19 రోజులపాటు నిలిచిపోయిన నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు పుంజుకున్నాయి. మధ్య, ఉత్తర అరేబియా సముద్రం, గుజరాత్, విదర్భ, ఛత్తీస్గఢ్ ఒడిశాలో పలు ప్రాంతాలు.. కొంకణ్, మధ్య మహారాష్ట్ర, తెలంగాణలో మిగిలిన ప్రాంతాలకు విస్తరించాయి.
విశాఖను టూరిజం హబ్గా, ఆకాశమే హద్దుగా అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. పాఠశాలలు తెరిచే లోపు...తల్లికి వందనం ఇస్తామని చెప్పామని అలాగే మాట నిలబెట్టుకున్నామని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు.
ఏపీ సీఎం చంద్రబాబు వినియోగించే హెలీకాప్టర్లో తరచుగా సమస్యలు వస్తున్నాయి. ఇవాళ మరోసారి సాంకేతిక సమస్యలతో నిలిచిపోయింది. కేంద్రమంత్రి పీయూష్ గోయల్కి ఈ హెలీకాప్టర్ని ఏపీ పర్యటన నిమిత్తం కేటాయించారు. కేంద్రమంత్రి కృష్ణపట్నం పోర్టుకి వెళ్లడానికి హెలికాప్టర్ ఎక్కిన సమయంలో మొరాయించడంతో తన పర్యటనను వాయిదా వేసుకున్నారు.
విశాఖపట్నంలో ఐదు లక్షల మందితో యోగా కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. ఒక్కచోటే మూడు లక్షల మందితో యోగా చేసేలా ఏర్పాట్లు చేశామని అన్నారు. ఏపీవ్యాప్తంగా రెండు కోట్ల మంది యోగా డేలో పాల్గొంటారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
Visakha Visit: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం విశాఖ పర్యటనకు వెళ్లనున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం ఏర్పాట్లు పరిశీలిస్తారు. సాయంత్రం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఇంటికి చేరుకుని ఆయన కుటుంబసభ్యులను పరామర్శిస్తారు.