Home » Visakhapatnam
ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీల్లో భాగంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ఏపీ వ్యాప్తంగా ఈరోజు చేపట్టామని తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. గత జగన్ ప్రభుత్వంలో రేషన్ కార్డుపై ఆ నాయకుడు బొమ్మలు వేసుకున్నారని ధ్వజమెత్తారు.
విశాఖపట్నం రామకృష్ణ బీచ్లో మరో ప్రమాదం చోటు చేసుకుంది. సముద్ర స్నానానికి వచ్చిన ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. దీంతో భయాందోళనలు నెలకొన్నాయి.
Major Wedding Theft Case: భారీ దొంగతనం కేసును గాజువాక క్రైమ్ పోలీసులు ఛేదించారు. షీలా నగర్ పెళ్లి ఇంటిలో దొంగతనం చేసిన ముగ్గురు నిందితులను పట్టుకున్నారు. నిందుతులు నాగేశ్వరరావు, అర్జున్ జ్ఞాన్ ప్రకాష్, రాంబాబులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
విశాఖపట్నంలో కాల్పులు కలకలం రేపాయి. పాత కక్షల కారణంగా నాటు తుపాకీతో కాల్చడంతో రాజేష్ అనే వ్యక్తి తీవ్ర గాయాలపాలయ్యాడు. కాల్పుల జరిపిన వ్యక్తి సస్పెన్షన్లో ఉన్న కానిస్టేబుల్గా పోలీసులు గుర్తించారు.
ఇప్పటికే రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కొడుతున్న వానలకు చాల జిల్లాలు జలమయం అయ్యాయి. జన సంచారం స్థంబించిపోయింది. రవాణా వ్యవస్థ డీలా పడింది.
అన్ని దానాల్లోకి అన్నదానం మేలు అన్న ఆర్యోక్తిని సింహాచలంలోని వరాహలక్ష్మీనృసింహస్వామి దేవస్థానం ఉద్యోగులు 36 ఏళ్ల కిందట నిజం చేశారు. రూ.50 వేలను విరాళంగా సమర్పించి పెద్దమనసుతో నిత్యాన్న ప్రసాద పథకానికి అంకురార్పణ చేశారు.
సృష్టి ఫెర్టిలిటీ స్కాం కేసులో కీలక సూత్రధారి డాక్టర్ నమ్రతకు ఉచ్చు బిగిస్తోంది. డాక్టర్ నమ్రత బ్యాంక్ అకౌంట్లు, బినామీ అకౌంట్లు, ఆస్తులపై దర్యాప్తు బృందం రంగంలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ పేరుతో అక్రమ సరోగసీ, ఐవీఎఫ్, శిశువుల అక్రమ రవాణా చేసి కోట్లాది రూపాయలను డాక్టర్ నమ్రత సంపాదించినట్లు సమాచారం.
సింహాచలం స్వామి వారి ఆభరణాల తనిఖీకి దేవదాయశాఖ ప్రాంతీయ సంయుక్త కమిషనర్ కె.సుబ్బారావు విచారణకు ఆదేశించారు. ఈ మేరకు దేవదాయశాఖ జ్యువలరీ వెరిఫికేషన్ ఆఫీసర్ పల్లం రాజు ఈ ఏడాది జనవరి 17, 18 తేదీల్లో రికార్డులను పరిశీలించారు.
సృష్టి ఫెర్టిలిటీ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. విశాఖ కేంద్రంగా జరిగిన ఈ స్కాంలో ఇప్పటి వరకూ ఆరుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.
విశాఖపట్నంలో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (APL) సీజన్-4 ఈ రోజు సాయంత్రం 5:30 గంటల నుంచి ప్రారంభం కానుంది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ACA) ఆధ్వర్యంలో జరిగే ఈ క్రీడా వేడుకలు క్రీడాభిమానులను అలరించనున్నాయి.