Home » Visakhapatnam
క్రిప్టో కరెన్సీ పేరిట అధిక లాభాల ఆశ చూపి సుమారు 50 మంది నుంచి రూ.10 కోట్లు వసూలు చేసి మోసానికి పాల్పడ్డ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. బిర్లా జంక్షన్ను కేంద్రంగా చేసుకుని ‘పంక్ పాండా’, ‘ఐటీసీ గ్లోబల్’, ‘కేగుష్’ అనే పేర్లతో వెబ్సైట్లు, అప్లికేషన్లను ఆజీమ్ సృష్టించాడు.
ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ఫేమ్ డ్యాన్స్ మాస్టర్ పండుకు రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. విశాఖపట్నం జిల్లా ఆనందపురం సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
విశాఖ జోన్ కోసం పార్లమెంట్లో అనేక పర్యాయాలు పోరాడానని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. రైల్వే జోన్ సాధన కోసం ఆ రోజుల్లో ఇచ్ఛాపురం రైల్వే స్టేషన్లో దీక్ష చేపట్టినట్లు గుర్తుచేశారు.
అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో హోం మంత్రి వంగలపూడి అనిత పర్యటన కొనసాగుతోంది. సత్యవరం గ్రామానికి చేరుకున్న హోం మంత్రికి గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు.
విధి నిర్వహణలో ఉన్న పోలీసుపై దాడి జరగడం దురదృష్టకరమని హోంమంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. హోంగార్డ్ వెంకటరమణపై కొంతమంది కత్తితో దాడి చేశారని పేర్కొన్నారు.
దేశంలోనే తొలిసారిగా PM-SETU పథకం అమలు చేసే రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. విశాఖపట్నం ఐటీఐ క్లస్టర్ అభివృద్ధికి కేంద్రం ఆమోదం తెలిపింది.
విశాఖపట్నం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ పథకాలు కీలకంగా మారుతున్నాయని విశాఖ ఎంపీ శ్రీభరత్ అన్నారు. దిశ సమావేశంలో 33 విభాగాల అధికారులతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు.
భరోసా పార్టీ అధినేత, క్రైస్తవమత ప్రచారకుడు అభినయ్ దర్శన్ నర్సీపట్నం సబ్జైల్ నుంచి విడుదలయ్యారు. పోలీసులు, జైలు సిబ్బంది తనను చాలా గౌరవంగా చూసుకున్నారని అభినయ్ తెలిపారు.
వడదెబ్బ బాధితుల కోసం విశాఖపట్నం కేజీహెచ్లో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశామని కేజీహెచ్ సూపరింటెండెంట్, డాక్డర్ వాణి తెలిపారు. ఈ వార్డులో ఏసీతో పాటు,18 బెడ్స్ ఉంటాయన్నారు.
విశాఖపట్నంలో స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. దేశ రాజకీయాలలో టీడీపీ కీలక పాత్ర పోషిస్తోందని ఎంపీ శ్రీభరత్ అన్నారు.