YS Jagan: జగన్‌కు షాక్.. నర్సీపట్నం పర్యటనకు నిరసన సెగ

ABN, Publish Date - Oct 09 , 2025 | 10:24 AM

విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో నేడు వైఎస్‌ జగన్‌ పర్యటించనున్నారు. మాకవరపాలెం మెడికల్‌ కాలేజ్‌ని సందర్శించనున్నారు. అయితే, ఈ నేపథ్యంలో జగన్‌కు నిరసన సెగ తగిలింది.

విశాఖ: జగన్ నర్సీపట్నం పర్యటనకు దళిత సంఘాల నుంచి నిరసన సెగ తగిలింది. డాక్టర్ సుధాకర్ కుటుంబానికి జగన్ క్షమాపణ చెప్పాలని దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. జగన్ క్షమాపణ చెప్పకపోతే జగన్ పర్యటన అడ్డుకుంటామని వార్నింగ్ ఇస్తున్నాయి. డాక్టర్ సుధాకర్‌కు అవమానం జరిగిందంటూ నర్సీపట్నంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

Updated at - Oct 09 , 2025 | 10:30 AM