Home » Virat Kohli
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వన్డే ప్రపంచ కప్ 2027లో ఆడుతాడా? లేదా? అని చాలాకాలంగా చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో కోహ్లీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తన సామర్థ్యాన్ని పదేపదే నిరూపించుకోవాల్సిన పరిస్థితే వస్తే అలాంటి వాతావరణంలో తాను ఉండబోనని స్పష్టం చేశాడు.
ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దుమ్మురేపుతున్నాడు. నిన్న రాయ్పూర్ వేదికగా కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్లో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి సంబంధించిన సోషల్ మీడియా వివాదం మరోసారి చర్చనీయాంశమైంది. జర్మన్ మోడల్, సింగర్ లిజ్లాజ్ ఇన్స్టా ఫొటోకు కోహ్లీ లైక్ కొట్టిన అంశం వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆ విషయంపై లిజ్లాజ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసింది.
ఐపీఎల్ 2026లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై రెండు వికెట్ల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ఆర్సీబీ విజయం సాధించినప్పటికీ.. స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు.
ఐపీఎల్ 2026లో లఖ్నవూ సూపర్ జెయింట్స్పై ఆర్సీబీ 9 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఈ మ్యాచ్లో ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ డకౌట్ అయిన సంగతి తెలిసిందే. ప్రిన్స్ యాదవ్ బౌలింగ్లో కోహ్లీ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మ్యాచ్ అనంతరం కోహ్లీని ఔట్ చేయడంపై ఎల్ఎస్జీ బౌలర్ ప్రిన్స్ యాదవ్ స్పందించాడు.
ప్రపంచవ్యాప్తంగా ఐషోస్పీడ్గా పాపులర్ అయిన ఇంటర్నెట్ సెన్సేషన్ డారెన్ జాసన్ తాజాగా క్రికెట్ పిచ్పై తనదైన శైలిలో సందడి చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించాడు. అంతేకాక క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ దృష్టిలో పడేందుకు ఓ వెరైటీ ప్రయత్నం చేశాడు.
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళురు 4 వికెట్ల తేడాతో గుజరాత్ చేతిలో ఓడించింది. ఈ మ్యాచ్ అనంతరం ఆర్సీబీ జట్టును సరదగా ఆటపట్టిస్తూ గుజరాత్ జట్టు కెప్టెన్ శుభ్మన్ గిల్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు.
ఐపీఎల్ 2026లో నిన్న గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్లో ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. గుజరాత్ ప్లేయర్ జేసన్ హోల్డర్ పట్టిన క్యాచ్ వివాదానికి దారి తీసింది.
ఐపీఎల్ 2026లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుస విజయాలతో దూసుకెళుతోంది. అయితే ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ గురించి స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. విరాట్ డ్రెస్సింగ్ రూమ్లో ఇచ్చే ఇన్పుట్స్, తమ జట్టు మైండ్సెట్ గురించి మాట్లాడాడు.
ఐపీఎల్ చరిత్రలోనే 9వేల పరుగుల మైలురాయిని అందుకున్న తొలి ప్లేయర్గా కోహ్లీ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. దీంతో అతడిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.