Home » Virat Kohli
సుధీర్ఘ విరామం తర్వాత ఆసీస్ మ్యాచ్ తో టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చిన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తీవ్రంగా నిరాశపర్చాడు. తొలి మ్యాచ్లో భారీ అంచనాలతో బరిలోకి దిగిన కోహ్లీ డకౌట్గా వెనుదిరిగాడు. 8 బంతులాడి కోహ్లీ మిచెల్ స్టార్క్ బౌలింగ్లో కూపర్ కొన్నోల్లీ స్టన్నింగ్ క్యాచ్కు పెవిలియన్ చేరాడు.
ఆదివారం పెర్త్ వేదికగా జరిగే తొలి వన్డేలో కోహ్లీ సెంచరీ చేస్తే.. ఈ అరుదైన రికార్డ్ తన ఖాతాలో పడనుంది. ప్రస్తుతం ఈ జాబితాలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఉన్నారు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి విరాట్ కోహ్లీ గుడ్ బై చెప్పనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఐపీఎల్ 2026 సీజన్కు సంబంధించిన కమర్షియల్ కాంట్రాక్ట్పై కోహ్లీ సంతకం చేయలేదనే ప్రచారం సాగుతోంది.
టీమిండియా దిగ్గజ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ దాదాపు నాలుగు నెలల విరామం తర్వాత తిరిగి మైదానంలో అడుగుపెట్టబోతున్నారు. ఆస్ట్రేలియాతో ఈ నెలలో జరిగే వన్డే సిరీస్ కోసం బరిలోకి దిగబోతున్నారు. 2027 ప్రపంచకప్ వరకు వారు జట్టులో కొనసాగాలని అభిమానులు కోరుకుంటున్నారు.
ఆస్ట్రేలియా వన్డే సిరీస్లో టీమిండియా జట్టుకు కెప్టెన్గా శుభ్మన్ గిల్ ఎంపికయ్యాడు. వెటరన్ ప్లేయర్ రోహిత్ శర్మ స్థానంలో జట్టు పగ్గాలు చేపట్టాడు. అయితే, ఈ టూర్లో రోహిత్తో పాటు కోహ్లీ కూడా పాల్గొననున్నారు.
డాషింగ్ బ్యాటర్ యువరాజ్ సింగ్ టీమిండియా క్రికెటర్ చరిత్రలో ఓ దిగ్గజ ఆటగాడు. భారత్ టీ-20 ప్రపంచకప్, వన్డే ప్రపంచకప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. మహేంద్ర సింగ్ ధోనీతో కలిసి టీమిండియాకు ఎన్నో చారిత్రాత్మక విజయాలు అందించాడు.
టీమిండియా స్టార్ ప్లేయర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ దాదాపు నాలుగు నెలల విరామం తర్వాత తిరిగి మైదానంలో అడుగుపెట్టబోతున్నారు. వీరిద్దరూ ఇప్పటికే టీ-20, టెస్ట్ ఫార్మాట్కు వీడ్కోలు ప్రకటించిన సంగతి తెలిసిందే. వీరు ఇకపై టీమిండియా తరఫున వన్డేలు మాత్రమే ఆడబోతున్నారు.
టీమిండియా స్టార్ ఫినిషర్ రింకూ సింగ్ ప్రస్తుతం ఆసియా కప్ కోసం సన్నద్ధమవుతున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్లో పేలవ ప్రదర్శనతో సతమతమైన రింకూ తిరిగి ఫామ్ అందుకునేందుకు ప్రాక్టీస్ చేస్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రింకూ.. స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీని బ్యాట్ అడగడం గురించి మాట్లాడాడు.
టీమిండియా దిగ్గజ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇప్పటికే అంతర్జాతీయ టీ-20, టెస్ట్ క్రికెట్కు వీడ్కోలు పలికారు. టీమిండియా తరఫున వన్డేలు మాత్రమే ఆడుతున్నారు. వన్డే ఫార్మాట్లో అద్భుత ప్రదర్శన చేస్తున్నారు.
ఐపీఎల్ తర్వాత క్రికెట్ మ్యాచ్లు లేకపోవడంతో కోహ్లీ లండన్లోనే ఉంటున్నాడు. అక్కడే క్రికెట్ ప్రాక్టీస్ కూడా చేస్తున్నాడు. తాజాగా తన భార్య అనుష్క శర్మతో కలిసి లండన్ వీధుల్లో చక్కర్లు కొడుతూ కనిపించాడు.