Home » Virat Kohli
ఆర్సీబీ విజయోత్సవ వేడుకల తొక్కిసలాటలో పలువురు మరణించిన ఘటన కలకలం రేపుతున్న తరుణంలో విరాట్ అనుష్క లండన్కు వెళ్లడంపై జనాలు మండిపడుతున్నారు.
18 ఏళ్ల కప్పు కలను ఎట్టకేలకు నిజం చేసుకున్నాడు కింగ్ కోహ్లీ. ఐపీఎల్-2025లో ఆర్సీబీ చాంపియన్గా నిలవడంతో విరాట్ ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. అతడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
దాదాపు 18 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆ ఆనందాన్ని పూర్తిగా ఆస్వాదించలేకపోతోంది. బుధవారం జరిగిన విక్టరీ పరేడ్ సందర్భంగా చిన్నస్వామి స్టేడియం బయట జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృతి చెందారు. దాదాపు 50 మంది గాయాలపాలయ్యారు.
2025 ఐపీఎల్ ఫైనల్లో బెంగళూరు టైటిల్ గెల్చుకోవడంతో విరాట్ కోహ్లీ (Virat Kohli) 18 ఏళ్ల నిరీక్షణకు ముగింపు పలికాడు. ఈ సందర్భంగా మాట్లాడిన విరాట్ కోహ్లీ తన రిటైర్మెంట్ గురించి కూడా కీలక ప్రకటన చేశాడు.
ఐపీఎల్లో 18 ఏళ్ల పాటు ఒకే జట్టుకు ఆడిన ఏకైక ఆటగాడు విరాట్ కోహ్లీ. ఆర్సీబీకి ఐపీఎల్ టైటిల్ అందించాలనేది కోహ్లీ కోరిక. అది తాజాగా నెరవేరిన క్షణంలో కోహ్లీ ఇన్స్టాగ్రామ్లో ఓ ఎమోషనల్ పోస్ట్ చేశాడు.
విరాట్ కోహ్లీ (Virat Kohli) ఒక ఆటగాడు మాత్రమే కాదు, ఒక ఎమోషన్. 18 జెర్సీ కల్గిన విరాట్, 18 ఏళ్లుగా ఆర్సీబీ తరుఫున తొలి విజయం కోసం ఎదురుచూస్తున్నారు. ఎన్నో ఆశలు, ఎన్నో కన్నీళ్లు, ఎన్నో కలలు. కానీ ఈ మంగళవారం రాత్రి, ఆ కల నెరవేరే అవకాశం వచ్చింది. ప్రత్యర్థి జట్టు శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని పంజాబ్ కింగ్స్తో ఆర్సీబీ ఐపీఎల్ పోరు కొనసాగించనుంది.
టెస్ట్లలో ఎన్నో రికార్డులు కలిగిన కోహ్లీ ఇలా అనూహ్యంగా వైదొలగడం మాజీలందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. కోహ్లీ రిటైర్మెంట్ గురించి తాజాగా హర్భజన్ సింగ్ కూడా స్పందించాడు. తన కూతురు ఈ విషయమై కోహ్లీని ప్రశ్నించిందని భజ్జీ చెప్పాడు.
టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో పెట్టుకోవాలంటే అన్ని జట్లు భయపడతాయి. తోపు ఆటగాళ్లు కూడా అతడి జోలికి వెళ్లాలంటే జంకుతారు. అలాంటిది ఓ కుర్ర బౌలర్ మాత్రం విరాట్ను రెచ్చగొట్టాడు. అసలేం జరిగిందంటే..
2025 ఐపీఎల్ సీజన్లో మే 27న విరాట్ కోహ్లీ (Virat Kohli) సరికొత్త రికార్డ్ సృష్టించాడు. లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున మరో అరుదైన ఘనతను తన ఖాతాలోకి వేసుకున్నాడు. కేవలం 24 పరుగులు అవసరమైన దశలో మైదానంలోకి అడుగుపెట్టిన కోహ్లీ, ఆ టార్గెట్ను చేరుకుని, టీ20ల చరిత్రలో ఒకే ఫ్రాంచైజీ తరపున 9000 పరుగులు సాధించిన తొలి క్రికెటర్గా రికార్డు సృష్టించాడు.
ఐపీఎల్-2025 ప్లేఆఫ్స్కు ముందు మరో ఆలయాన్ని సందర్శించాడు ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లీ. అయోధ్యలోని ప్రసిద్ధ హనుమాన్ గఢీ గుడికి వెళ్లాడు. దీనికి సంబంధించిన విజువల్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.