Home » Viral News
చాలా మంది బేకరీ ఫుడ్స్ను బాగా ఇష్టంగా తింటుంటారు. ముఖ్యంగా పిల్లలైతే మరింత ఎక్కువగా ఇష్టపడతారు. బేకరీల్లో దొరికే క్రీమ్ రోల్స్ చాలా మంది చిన్న పిల్లలు ఇష్టపడే ఫేవరెట్ స్నాక్. అయితే ఆ క్రీమ్ రోల్స్ను తయారు చేస్తున్న విధానానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని అందర్నీ ఆకట్టుకుంటూ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఎవరైనా తమ ట్యాలెంట్ ఉపయోగించి చేసే అద్భుతమైన పనులకు సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెళ్లిళ్ల సీజన్ జోరుగా సాగుతోంది. పెళ్లికి సంబంధించిన ఫన్నీ ఘటనలు, ఆసక్తికర సన్నివేశాలకు సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆకట్టుకుంటుంటాయి. ఇప్పటికే అలాంటి ఎన్నో వెడ్డింగ్ వీడియోలు నెట్టింట హల్చల్ చేశాయి.
సింహం అడవికి రారాజు. సింహాన్ని ఎదురించి నిలబడగలిగే జంతువులు చాలా తక్కువ. అయితే హైనాలు కూడా క్రూరమైన జంతువులే. ముఖ్యంగా గుంపులుగా నివసించే హైనాలు ఎలాంటి సింహాన్నైనా చంపగలవు. ఒకేసారి 30 హైనాలు మీద పడితే ఎంతటి సింహమైనా ప్రాణం మీద ఆశలు వదిలేసుకోవాల్సిందే.
సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. కొన్ని నవ్వులు పూయిస్తుంటే.. కొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ఓ చిన్నారి, బొమ్మ ఫోన్తో వీడియో షూట్ చేయడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సాధారణంగా గుడ్లు చాలా ఆరోగ్యకరమైనవని భావిస్తుంటాం. ప్రతిరోజు గుడ్డు తినే వారు ఎంతో మంది ఉంటారు. అయితే గుడ్లకు సంబంధించిన ఓ షాకింగ్ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. జెప్టో నుంచి ఆర్డర్ చేసిన గుడ్లను ఉడికించిన ఓ మహిళకు దిమ్మదిరిగే అనుభవం ఎదురైంది.
రవి అస్తమించిన బ్రిటీష్ సామ్రాజ్యం ఒక భారతీయుడి నుంచి అప్పు తీసుకుంది. 109 ఏళ్లుగా ఆ అప్పు తీర్చుకుండా నాన్చుతోంది. దీంతో ఆ వ్యక్తి మనవడు తమ అప్పును తిరిగి చెల్లించమని కోరుతూ ఏకంగా బ్రిటీష్ ప్రభుత్వానికి నోటీసును పంపుతున్నాడు.
ఇద్దరు, ముగ్గురు వ్యక్తులు కలిస్తే అక్కడ లేని వ్యక్తి గురించి మాట్లాడుకోవడం అనేది సాధారణంగా జరుగుతుంటుంది. ముఖ్యంగా పల్లెటూళ్లలో ఇది మరింత ఎక్కువగా ఉంటుంది. స్నేహితుల మధ్య, బంధువుల మధ్య గొడవలకు చాడీలు చెప్పడం అనేది అనేక గొడవలకు కారణమవుతుంటుంది.
మద్యం మత్తులో చేసే చాలా సాహసాలు ప్రాణాపాయానికి దారి తీస్తాయి. పూర్తి స్పృహలో లేకుండా ప్రమాదాలతో ఆటలాడితే ప్రాణాలు కోల్పోవాల్సిందే. తాజాగా మహారాష్ట్రలోని విరార్లో ఓ వ్యక్తి మద్యం మత్తులో పాముతో ఆటలాడి ప్రాణాలు కోల్పోయాడు.
ట్రాక్టర్ పాడైపోవడంతో దానిని దశాబ్దాలుగా అలానే వదిలేశారు. తుప్పుపట్టిపోయి ఉన్న ఆ పాత ట్రాక్టర్ ఒక వ్యక్తిని రాత్రికి రాత్రే కోటీశ్వరుడిని చేసింది. ఏకంగా రూ. 1.25 కోట్లు తెచ్చిపెట్టింది.