Home » Vijayawada
సూర్య భగవానుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే సమయాన్ని ‘మకర సంక్రాంతి’ అని అంటారు. ఈ పండుగకు సరిగ్గా ఒక రోజు ముందు ‘భోగి’ పండుగను జరుపుకుంటారు.
సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా రైల్వే శాఖ ఏలూరు జిల్లా మీదుగా రెండు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది..
విజయవాడలో బొమ్మల కొలువు కొలువుతీరింది. స్థానిక విజయశ్రీ అనే మహిళ దేవీ పురాణం, భాగవత పురాణాల నుంచి ప్రేరణ పొంది.. నెలలపాటు శ్రమించి ఈ బొమ్మల కొలువు తీర్చిదిద్దారు. దేవి బాల్యం, బాలిక, స్త్రీ, మోక్ష దశలను చిత్రీకరించారు.
ఉద్యోగాల పేరుతో విదేశాలకు వెళ్లి సైబర్ ముఠా చేతిలో చిక్కుకుని తీవ్ర ఇబ్బందులకు గురైన ఏపీకి చెందిన యువతను సీఐడీ పోలీసులు రక్షించారు. భారత దేశ యువకులు ఈ సైబర్ ముఠా ట్రాప్లో పడుతున్నారని సీఐడీ ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా తెలిపారు.
వైసీపీపై భానుప్రకాశ్ రెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. గోశాల నుంచి గోవిందుడి వరకు వైసీపీ నాయకులు ఆధారాలు సృష్టించి తమపై అపచారం మోపుతున్నారని ఆయన ఆరోపించారు.
విజయవాడ దుర్గగుడిలో శ్రీచక్ర అర్చనలో అభిషేకానికి ఉపయోగించే పాలలో పురుగులు రావడం తీవ్ర కలకలం రేపింది. ఈ అపచార ఘటనకు సంబంధించి బాధ్యులపై ఈవో శీనా నాయక్ చర్యలు తీసుకున్నారు.
సంక్రాంతి పండగను కుటుంబ సభ్యులతో జరుపుకొనేందుకు దూర ప్రాంతాల్లో ఉన్న వారు పల్లె బాట పడుతున్నారు. దీంతో ఏపీలోని విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ ప్రయాణికులతో కిక్కిరిసింది.
అమరావతిని ప్రపంచం మెచ్చే 'ప్రజా రాజధాని'గా తిరిగి అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. రెండేళ్లలో అమరావతి రూపుదిద్దుకుని విజయవాడ–గుంటూరు–మంగళగిరితో కలిసి గ్లోబల్ సిటీగా, 2047 నాటికి స్వర్ణాంధ్ర లక్ష్యాన్ని చేరుకుంటుందని అన్నారు.
లిక్కర్ స్కామ్ కేసులో నిందితులు రాజ్ కసిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దీంతో వారిని జైలు అధికారులు చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు తరలించారు..
సంక్రాతి పండుగకు సెలవులు ఇవ్వడంతో శుక్రవారం రాత్రి నుంచే బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లే బస్సులు, రైళ్లన్నీ ప్రయాణికులతో నిండిపోతున్నాయి. హైదరాబాద్ నగరంలో దాదాపు మూడొందుల మంది తమతమ స్వస్థలాలకు వెళ్లనున్నారు.