• Home » Vijayawada

Vijayawada

దుర్గగుడిలో మహా కుంభాభిషేక మహోత్సవం.. సీఎంకు ఆహ్వానం

దుర్గగుడిలో మహా కుంభాభిషేక మహోత్సవం.. సీఎంకు ఆహ్వానం

విజయవాడ దుర్గమ్మ గుడిలో జరిగే మహాకుంభాభిషేకానికి రావాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఆలయ అధికారులు ఆహ్వానం అందించారు. ఈనెల 6 నుంచి 8 వరకు దుర్గ గుడిలో కుంభాభిషేక మహోత్సవం జరగనుంది.

మళ్లీ చిన్ని వర్సెస్ కొలికపూడి..

మళ్లీ చిన్ని వర్సెస్ కొలికపూడి..

టీడీపీ అధిష్థానం జోక్యం చేసుకున్నా విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మధ్య వివాదాలు సమసిపోవడం లేదు. తాజాగా నెమలి వేణు గోపాల స్వామి బ్రహ్మోత్సవాల్లో వారిద్దరి మధ్య ప్రొటోకాల్ చిచ్చు ఏర్పడింది.

మిర్చి రాక.. మందగమనం

మిర్చి రాక.. మందగమనం

మిర్చి ఆగమనాలు గుంటూరు వ్యవసాయ మార్కెట్‌ కమిటీకి తగ్గాయి. దాదాపుగా 30 శాతం తక్కువగా పంట దిగుబడిని రైతులు విక్రయించడానికి తీసుకొస్తున్నారు.

ఏపీ కొత్త సీఎస్‌గా సాయిప్రసాద్.. రేపే బాధ్యతల స్వీకరణ

ఏపీ కొత్త సీఎస్‌గా సాయిప్రసాద్.. రేపే బాధ్యతల స్వీకరణ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(CS)గా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి జి.సాయిప్రసాద్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ప్రస్తుత సీఎస్‌ కె.విజయానంద్‌ పదవీ కాలం ఫిబ్రవరి 28, 2026 నాటితో ముగియనుంది. ఆయన స్థానంలో జి.సాయిప్రసాద్‌ను ప్రభుత్వం ఇప్పటికే అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. వివరాల్లోకి వెళితే..

ఆయేషా మీరా అవశేషాల అప్పగింత.. తెనాలికి బయలుదేరిన తల్లిదండ్రులు

ఆయేషా మీరా అవశేషాల అప్పగింత.. తెనాలికి బయలుదేరిన తల్లిదండ్రులు

కోర్టు ఆదేశాల మేరకు ఆయేషా మీరా అవశేషాలను తల్లిదండ్రులకు అప్పగించారు అధికారులు. ప్రత్యేక భద్రత నడుమ అంబులెన్స్‌లో ఆయేషా మీరా అవశేషాలను తెనాలికి తరలించారు.

విజయవాడ సిట్ ఆఫీస్‌లో లొంగిపోయిన ముప్పిడి అవినాశ్‌రెడ్డి

విజయవాడ సిట్ ఆఫీస్‌లో లొంగిపోయిన ముప్పిడి అవినాశ్‌రెడ్డి

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడు, పరారీలో ఉన్న ముప్పిడి అవినాశ్‌రెడ్డి విజయవాడ సిట్ ఆఫీస్‌లో లొంగిపోయారు. వివరాల్లోకి వెళితే..

రైళ్ల పాక్షిక రద్దు

రైళ్ల పాక్షిక రద్దు

డివిజన్‌ కేంద్రం మీదుగా వెళ్లే పలు రైళ్లను పాక్షికంగా రద్దు చేశామని అధికారులు బుధవారం తెలిపారు. నైరుతి రైల్వే జోన్‌లోని హుబ్లీ డివిజన్‌, క్యాస్టిల్‌ రాక్‌-కులేం రైల్వే సెక్షన్‌లోని ఘాట్‌ మార్గంలో అంతరాయాల కారణంగా గుంతకల్లు మీదుగా వెళ్లే కొన్ని రైళ్లను వాస్కోడగామా వరకూ కాకుండా హుబ్లీ స్టేషన్‌ వరకే పరిమితం చేశామని తెలిపారు.

డ్రగ్స్‌పై ఈగల్ టీం ఉక్కుపాదం.. గంజాయి సాగును నిర్మూలించాం: ఐజీ రవికృష్ణ

డ్రగ్స్‌పై ఈగల్ టీం ఉక్కుపాదం.. గంజాయి సాగును నిర్మూలించాం: ఐజీ రవికృష్ణ

ఏపీలో గంజాయి సాగును పూర్తిగా నిర్మూలించామని ఈగల్ ఐజీ రవికృష్ణ తెలిపారు. అల్లూరి సీతారామరాజు నడిచిన పవిత్ర భూమిలో గంజాయి సాగు ఉండకూడదని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.

త్వరలో విజయవాడ రైల్వేస్టేషన్ మోడ్రనైజేషన్ పూర్తి: ఎంపీ కేశినేని శివనాథ్

త్వరలో విజయవాడ రైల్వేస్టేషన్ మోడ్రనైజేషన్ పూర్తి: ఎంపీ కేశినేని శివనాథ్

ఇండియాలోనే పీపీపీ మోడల్‌లో విజయవాడ రైల్వే స్టేషన్ అభివృద్ధి చేయబోతున్నారని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. విజయవాడ రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై రైల్వే డీఆర్ఎంతో ఎంపీ భేటీ అయ్యారు.

రౌడీ షీటర్ అంతిమయాత్రలో గంజాయి బ్యాచ్ హల్‌చల్

రౌడీ షీటర్ అంతిమయాత్రలో గంజాయి బ్యాచ్ హల్‌చల్

రౌడీషీటర్ అంతిమయాత్రలో గంజాయి, బ్లేడ్ బ్యాచ్‌లు హల్‌చల్ చేశాయి. విజయవాడలో రౌడీ షీటర్ పండు అలియాస్ పావురం అంతిమ యాత్రలో గంజాయి బ్యాచ్ బీభత్సం సృష్టించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి