Home » Vijayawada
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాజీ సీపీఆర్వో పూడి శ్రీహరి(Pudi Srihari) అరెస్ట్ అయ్యారు. శ్రీహరిని బెంగళూరులో అదుపులోకి తీసుకున్న పోలీసులు కుప్పంకు తరలిస్తున్నారు.
ఏపీలో ఇంధన కొరతతో పలు చోట్ల పెట్రోల్ బంకుల మూసివేత అంశంపై అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు.
మహిళలకు 33 శాతం రిజర్వేషన్ను 2029 ఎన్నికల నుంచే అమలు చేసేలా ఎన్డీఏ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. 25 ఏళ్లుగా ఈ బిల్లును అడ్డుకున్న విపక్షాలు మరోసారి ఆటంకపరుస్తున్నాయని మండిపడ్డారు.
విజయవాడ నగరంలోని కోర్టు భవనంలో లిఫ్ట్ నిలిచిపోయింది. ఏడు, ఎనిమిది అంతస్తుల మధ్య నిలిచిన లిఫ్ట్లో ఐదుగురు లాయర్లు చిక్కుకుపోయారు.
తెలుగు జాతి గర్వించదగ్గ, భారత దేశ రాజకీయాలలో సూపర్ స్టార్ చంద్రబాబు అని బుద్దా వెంకన్న కొనియాడారు. భారత దేశంలో ఆయనకు ఉన్న క్రేజు ఏ నాయకులకు లేదన్నారు.
సీఎం చంద్రబాబు నాయుడు తన 76వ పుట్టినరోజు సందర్భంగా భార్య నారా భువనేశ్వరతో కలిసి విజయవాడలోని పటమట ప్రాంతంలో ఉన్న అన్న క్యాంటీన్ను సందర్శించారు. ప్రజలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో కలిసి అన్న క్యాంటీన్లో అల్పాహారం తీసుకున్నారు.
విజయవాడ బీసెంట్ రోడ్డులో చిరు వ్యాపారిగా జీవనం సాగిస్తున్న దుర్గారావు సమస్యను ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డైరెక్టర్ భానుప్రకాశ్ కోగంటి ట్వీట్ చేయడంతో మంత్రి నారా లోకేశ్ దృష్టికి చేరింది. ఆ ట్వీట్ ఆయన మనసును కదిలించింది.
పింఛన్ ఇప్పించే ఏర్పాటు చేస్తానంటూ స్వయంగా సీఎం చంద్రబాబు హామీ ఇచ్చినా.. ఇప్పటికీ నెరవేరలేదంటూ దుర్గారావు అనే దివ్వాంగుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డైరెక్టర్ భానుప్రకాశ్ కోగంటి సోషల్ మీడియా ఎక్స్లో పోస్ట్ చేశారు.
అగ్నిమాపక శాఖ వారోత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమరవీరుల స్మృతికి నివాళులర్పించారు.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏపీ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కె.శాంతిని రెండు రోజుల పోలీస్ కస్టడీకి ఇస్తూ ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్ 15, 16వ తేదీల్లో విచారించేందుకు అనుమతిచ్చింది.