Home » Vijayawada
జనసేన పార్టీ బలోపేతం కోసం ఎంతోమంది పని చేస్తున్నారని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. సాధారణ ఎన్నికలలో రాష్ట్ర హితం కోసం కూటమి ధర్మానికి కట్టుబడి అందరూ కలిసి పని చేశారని చెప్పారు.
కృష్ణా జిల్లాలోని గుడివాడ నెహ్రూ చౌక్ అంబేద్కర్ విగ్రహం వద్ద మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కైకలూరు మండలం చావలిపాడు గ్రామానికి చెందిన తలారి రమాదేవి(50) పాయిజన్ టాబ్లెట్లు మింగి బలవన్మరణానికి యత్నించింది.
జనసేన పార్టీ కోసం గ్రామస్థాయి నుంచి కార్యకర్తలు సొంతంగా పనిచేశారని మంత్రి కందుల దుర్గేశ్ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం అందరం సంసిద్ధం కావాలని పిలుపునిచ్చారు. మిత్రపక్ష పార్టీల నేతలను కలుపుకుని ముందుకు సాగాలని నేతలకు సూచించారు.
గాదె సాయికృష్ణ అదృశ్యం కేసు దర్యాప్తును సిట్ మరింత ముమ్మరం చేసింది. అందులో భాగంగా సోమవారం విజయవాడలోని సాయికృష్ణ నివాసానికి సిట్ అధికారులు చేరుకున్నారు.
కృష్ణా జిల్లా కరకట్టపై అవనిగడ్డ నుంచి విజయవాడ వెళ్లే ఆర్టీసీ బస్సు డ్రైవర్, కండక్టర్పై ఓ యువకుడి దాడి తీవ్ర కలకలం రేపుతోంది. తోట్లవల్లూరు మండలం రొయ్యూరు వద్ద ద్విచక్ర వాహనంతో అడ్డగించి మరీ వారిద్దరిపై యువకుడు దాడికి తెగబడ్డాడు.
విజయవాడలోని గిరిపురంలో డయేరియా ప్రబలడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో డీఎమ్హెచ్ఓ శ్రావణ్ కుమార్ గిరిపురంలో పర్యటించి ప్రజలతో మాట్లాడారు.
కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని మంగినపూడి బొట్లవానిపాలెంలో దారుణం జరిగింది. క్షణికావేశంలో కన్నకొడుకుపై తండ్రి.. కర్రతో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన కొడుకు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
పట్టిసీమ నుంచి గోదావరి జలాలు కృష్ణమ్మ చెంతకు చేరి ఈ డెల్టాను సస్యశ్యామలం చేస్తున్నాయని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. శ్రీశైలం, నాగార్జున సాగర్లకు కృష్ణా నది నుంచి నీటి ప్రవాహం తగ్గిందని తెలిపారు.
ఏపీ ఆయుష్ విభాగంలో రూ.350 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులు సిద్ధంగా ఉన్నాయని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఆయుష్ మౌలిక సదుపాయాల విస్తరణకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు.
విజయవాడలోని ఆటోనగర్లో ఆదివారం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. 7 బస్సులు కాలిపోయాయి. మరమ్మతుల కోసం ఉంచిన బస్సులో మంటలు చెలరేగటంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.