Home » Vijayawada
విజయవాడలో ప్రియురాలి పట్ల ప్రియుడు దారుణంగా ప్రవర్తించాడు. ఆమెపై అనుమానం పెంచుకున్న అతడు.. ఏకంగా ఆమె ప్రాణాలు తీసేందుకు తెగబడ్డాడు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శ పేరుతో ఇద్దరి ప్రాణాలను బలి తీసుకున్నారు. మొన్న అంబటి రాంబాబు ఇంటికి వెళ్లి వారి కుటుంబసభ్యులను పరామర్శించిన జగన్.. ఇప్పుడు జోగి రమేశ్ ని పరామర్శించేందుకు విజయవాడలోని ఇబ్రహీంపట్నం వెళ్లారు.
ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేశ్ను ఆయన నివాసంలో వైఎస్ జగన్ పరామర్శించనున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్కు విజయవాడ పోలీసులు నోటీసులు జారీ చేశారు.
డిసెంబరు 23 నుంచి తన కుమార్తె ఆచూకీ తెలియలేదని గుంటూరుకు చెందిన ఓ మహిళ.. మహిళా కమిషన్కు ఫిర్యాదు చేసింది. అలాగే.. భర్త రెండు సంవత్సరాలుగా వేధిస్తున్నాడని ఆ ఫిర్యాదులో పేర్కొంది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
కృష్ణా జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. సుమారు 171 కిలోల గంజాయిని పట్టుకున్న పోలీసులు.. ఇద్దరిని అరెస్ట్ చేశారు.
ఎస్ఎంటీవీ బెంగళూరు- బాలూర్ఘాట్ (పశ్చిమబెంగాల్) మధ్య నేటి నుంచి రెండు కొత్త వీక్లీ ఎక్స్ప్రెస్ రైళ్లు ప్రారంభిస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ రైళ్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆయా స్టేషన్ల మీదుగా వెళ్లనున్నాయి. వివరాలిలా ఉన్నాయి.
సంక్రాంతి సెలవులు ముగించుకుని సొంతూర్ల నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలతో విజయవాడ, హైదరాబాద్ జాతీయ రహదారి రద్దీగా మారింది. పోలీసులు భారీ వాహనాలను హనుమాన్ జంక్షన్ వద్ద నూజివీడు, మైలవరం మార్గం ద్వారా హైదరాబాద్ పంపిస్తున్నారు.
విజయవాడ-హైదరాబాద్ హైవేను పొగమంచు కమ్మేసింది. దీనివల్ల వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కనీసం 20 మీటర్ల ముందు ఏముందో తెలియని పరిస్థితి. సంక్రాంతి పండుగ అనంతరం పట్టణాలు, నగరాలకు చేరుకుంటున్న వారు చాలా నెమ్మదిగా వాహనాలు నడపాల్సిన పరిస్థితి ఎదురైంది.
సంక్రాంతి ముగించుకుని పల్లెవాసులు అందరూ భాగ్యనగర బాటపట్టారు. దీంతో విజయవాడ, హైదరాబాద్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. నందిగామ వై-జంక్షన్ వద్ద వాహనాలు బారులు తీరాయి.
ఉమ్మడి కృష్ణా జిల్లా అంతటా సంక్రాంతి సంబరాల్లో ఎన్ఫోర్స్మెంట్ వర్గాలు నిస్సహాయులయ్యారు. కళ్లెదుదే పందెం పుంజులు కత్తులు రువ్వుతున్నా, పేకలు గాల్లో ఎగురుతున్నా, గుండు గిరగిరా తిరుగుతున్నా వీక్షణకే పరిమతయ్యాయి. దుకాణాల నుంచి వాహనాల్లో కేసుల కొద్దీ మద్యం బరుల వద్దకు చేరుకుంటున్నా ఆపలేని స్థితిలో ఎక్సైజ్ అధికారులున్నారు.