Home » Vijayawada
విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జిగా బుద్దా వెంకన్న ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణస్వీకారంతోపాటు బుద్దా వెంకన్న జన్మదిన వేడుకలను కూడా టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు.
ప్రయాణికుల సౌకర్యార్థం తిరుపతి- కరీంనగర్ బైవీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ (రైలు నం. 12761) బయలుదేరే సమయాన్ని దక్షిణ మధ్య రైల్వే అధికారులు సవరించారు.
విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్లను మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దర్శించుకున్నారు. అనంతరం దసరా శరన్నవరాత్రి మహోత్సవాల ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
కృష్ణాజిల్లాలోని కానూరులో విషాదం చోటు చేసుకుంది. నీట్ శిక్షణ పొందుతున్న హైదరాబాద్ యువతి వైష్ణవి(19) బలవన్మరణానికి పాల్పడింది. హైదరాబాద్లోని బేగంపేటకు చెందిన వైష్ణవి నీట్ లాంగ్టర్మ్ కోచింగ్ కోసం కృష్ణా జిల్లాలోని శ్రీ భారతి ఇన్స్టిట్యూట్లో చేరింది.
విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మండలి వెంకట కృష్ణారావు శతజయంతి కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మండలి వెంకట కృష్ణారావు కాంస్య విగ్రహాన్ని ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడుతో కలిసి ఆయన ఆవిష్కరించారు.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసిన యువతిపై ఆలయ అధికారులు సీరియస్ అయ్యారు. దేవస్థానం ఆచారాలు, సంప్రదాయాలకు విరుద్ధంగా వ్యవహరించిందని ఆరోపిస్తూ యువతిపై విజయవాడ వన్టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఏపీడీఏఎస్సీఏసీ బాధ్యతలను మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ ఎం.వేణుగోపాల్ రెడ్డికి అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జీఓఆర్టీ.నం128ను జారీ చేసింది.
రాష్ట్రంలోని 50 వేలకుపైగా అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్న లక్షలాది మంది చిన్నారులకు అందిస్తున్న ‘బాలామృతం’ సరఫరా విషయంలో మన రాష్ట్రం ఇప్పటికీ తెలంగాణపైనే ఆధారపడుతోంది.
ప్రముఖ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ సన్నిధిలో శాకంబరీ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా వివిధ రకాల ఆకుకూరలు, పండ్లు, కూరగాయలతో దుర్గమ్మ దర్శనమిస్తున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో నేటి నుంచి ఇంటింటి ప్రచారం కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలు ప్రారంభించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి బుద్దా వెంకన్న ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం చేపట్టారు.