Home » Vijayawada
ఏపీ భవిష్యత్తు, సంపద యువతే అని కూటమి ప్రభుత్వం బలంగా నమ్ముతోందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. మంత్రి లోకేశ్ తన విద్య అనుభవాన్ని ఉపయోగించి 100 రోజుల కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో ఏపీకి చెందిన మహిళ మస్కట్ నుంచి క్షేమంగా స్వగ్రామానికి చేరుకుంది. అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలానికి చెందిన షెహనాజ్ కుటుంబ జీవనం కోసం ఏజెంట్ ద్వారా మస్కట్కు వెళ్లి చిత్ర హింసలకు గురైంది.
విజయవాడ కనకదుర్గమ్మను మంత్రి నారా లోకేశ్ దర్శించుకున్నారు. అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
ప్రముఖ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై మే 12న హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకల కోసం దుర్గగుడి అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. మే 12న ఉదయం 6 గంటల నుంచి ప్రత్యేక పూజలు ప్రారంభంకానున్నాయి.
ఉమ్మడి గుంటూరు జిల్లాలోని అమరావతి మండలం ధరణికోట గ్రామానికి చెందిన బొందలపాటి రాజమ్మ 2004, ఆగస్టు 23న తనకున్న స్థిరాస్తుల్లో కొంత భూమిని పలు దేవాలయాలకు విరాళంగా ఇచ్చారు.
ప్రజలు బీజేపీపై ఉన్న నమ్మకంతో మూడు రాష్ట్రాల్లో పట్టం కట్టారని ఆ పార్టీ ఏపీ అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ అన్నారు. మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ ‘రౌడీ పరిపాలన’కు ప్రజలు అంతం పలికారని, బెంగాల్ ప్రజలు ఇచ్చిన తీర్పుపై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు.
అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో బీజేపీ అధికారం నిలబెట్టుకోగా.. పశ్చిమ బెంగాల్లో బీజేపీ విజయం చరిత్రాత్మకమని కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ అన్నారు.
ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ అలర్ట్ జారీ చేశారు. రానున్న మూడు గంటల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.
విజయవాడలోని డాక్టర్ నోరి రామశాస్త్రి ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాలలో విద్యార్థినిలపై లైంగిక వేధింపుల ఘటనపై సీఎం చంద్రబాబు సర్కార్ సీరియస్ అయ్యింది. ఈ మేరకు బాధ్యులపై వైద్యారోగ్య శాఖ చర్యలకు ఉపక్రమించింది.
విశాఖ ఎక్స్ప్రెస్ ట్రైన్లో వివాహితపై అత్యాచారం చేసిన యువకుడిని విజయవాడ రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని ఒడిశా రాష్ట్రానికి చెందిన శౌరవ్ బగ్దిగా గుర్తించారు.