Home » Vijayawada Durga Temple
విజయవాడ ఉత్సవ్ మరో వందేళ్ల పాటు కొనసాగాలని కోరుకుంటున్నట్లు భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ అన్నారు. విజయవాడ హాటెస్ట్ సిటీ, కూల్ పీపుల్ అన్నారు. ఇవాళ ఆయన విజయవాడ ఉత్సవ్-2025లో పాల్గొన్నారు.
ఇంద్రకీలాద్రి అమ్మవారిని ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానంతరం వేద పండితుల చేత వేద ఆశీర్వచరం పొందారు.
గాయత్రీ దేవి అలంకరణలో ఉన్న దుర్గమ్మను దర్శించుకునేందుకు క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. తెల్లవారుజాము నుంచే అమ్మ దర్శనం కోసం భక్తులు తరలివచ్చారు.
విజయవాడలోని కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనానికి విచ్చేసే భక్తుల కోసం ఆలయ అధికారులు కొత్త నిబంధనలు జారీ చేశారు. ఆలయ పవిత్రతను కాపాడే లక్ష్యంతో డ్రెస్ కోడ్ అమలు చేశారు.
ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన దుర్గమ్మ ఆలయంలో ఈ నెల 25 నుండి శ్రావణమాస ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ పవిత్ర మాసం పూర్తయ్యేవరకూ ఆలయంలో నిర్వహించనున్న ప్రత్యేక పూజలు, పవిత్రోత్సవాలకు సంబంధించిన తేదీలను ఆలయ అధికారులు విడుదల చేశారు.
ఏపీలోని వియజవాడ కనకదుర్గ అమ్మవారిని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు.
విజయవాడలో భవానీ దీక్షల విరమణ కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో అందుకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా ఉన్నతాధికారులు బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా పలు శాఖల అధికారులకు కీలక సూచనలు చేశారు.
శ్రీదుర్గా మల్లేశ్వరస్వామి వారిని శ్రీ శృంగేరి శారదా పీఠాధిపతి శంకరాచార్య విధుశేఖర భారతి స్వామీజీ మంగళవారం దర్శించుకున్నారు. శ్రీ శృంగేరి పీఠాధిపతికి దుర్గ గుడి ఈవో రామారావుతోపాటు పురోహితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం స్వామిజీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ముగియడంతో దీక్షల విరమణ కోసం భక్తులు శని, ఆదివారాల్లో ఇంద్రకీలాద్రికి పోటెత్తారు. దీంతో దుర్గగుడి పరిసరాలు కిటకిటలాడాయి.
దసరా శరన్నవరాత్రుల వేడుకల్లో భాగంగా విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వారి దేవాలయంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. శనివారం ఉదయం ఈ ఉత్సవాల ముగింపులో భాగంగా దేవాలయ ప్రాంగణంలో పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు.