Home » Videos
పశ్చిమాసియా ఘర్షణల కారణంగా చమరులు ధరలు భగ్గమంటున్నాయి. యుద్ధం కారణంగా ప్రపంచ ఇంధన సరఫరాకు తీవ్ర ఆటంకం ఏర్పడటంతో చమురు ధరలు పైపైకి వెళ్తున్నాయి.
హైదరాబాద్లోని ప్రజా భవన్లో ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మహిళా జర్నలిస్టులను సీఎం రేవంత్ రెడ్డితోపాటు మంత్రి కొండా సురేఖ ఘనంగా సన్మానించారు.
సంచలన ఫలితాలతో కోట్లాదిమంది అభిమానులను ఆకట్టుకున్న టీ20 వరల్డ్కప్ ఆఖరి అంకానికి చేరుకుంది. ఆదివారం నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య ఫైనల్ జరుగబోతోంది.
విజయ బ్రాండ్.. ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్గా మారింది. ఏపీ విజయ పేరుతో విక్రయిస్తున్న నెయ్యి కల్తీ అంటూ తెలంగాణ స్టేట్ డెయిరీ డెవలప్మెంట్ కో-ఆపరేటివ్ ఫెడరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇరాన్ యుద్ధ ప్రభావంతో చమురు సలసలా మండటం ఖాయమా? కొద్ది రోజులకు సరిపడా ఉన్న నిల్వలు భవిష్యత్తును ఆదుకోగలవా? పెట్రోల్, డీజిలే కాకుండా గ్యాస్ మంటలు..
తెలంగాణలో మావోయిస్టుల లొంగుబాటు పరంపర కొనసాగుతోంది. 130మంది మావోయిస్టులు శనివారం నాడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎదుట లొంగిపోయారు.
సాధారణంగా పత్తి అనగానే మనకు మెరిసిపోయే ‘తెల్లని రంగు’ గుర్తుకు వస్తుంది. కానీ, ఇప్పుడు పొలాల్లో పత్తి రంగు రంగులుగా కనిపిస్తుంది. దశాబ్దాలుగా పలు ప్రాంతాల్లోని పత్తి పరిశోధన కేంద్రాలు కొత్త రకం వంగడాలపై పరిశోధనలు చేస్తున్నారు.
విజయవాడలో స్థానిక ఆంత్రాలూక్స్ కన్వెన్షన్ వేదికగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్రీడా సాంస్కృతిక ఉత్సవాల్లో ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు భీముడి పాత్రలో అదరగొట్టారు.
సివిల్స్ పరీక్ష ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) శుక్రవారం విడుదల చేసింది. ఈ పరీక్షల్లో అనూజ్ అగ్నిహోత్రి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించారు.
ఇటీవల మున్సిపల్ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో బీజేపీ కౌన్సిలర్లను ఆ పార్టీ నేతలు సన్మానించారు. తమను గెలిపించిన ప్రజలకు బీజేపీ కౌన్సిలర్లు ధన్యవాదాలు తెలిపారు.