Home » Venkaiah Naidu
తాను చదువుకునే రోజుల్లో తెలియక హిందీ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నానని భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు గుర్తుచేశారు. తాను వీధి బడిలో చదువుకుని... ఉప రాష్ట్రపతి వరకు వెళ్లానని తెలిపారు.
నక్సల్స్పై కేంద్రప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలిపారు. నక్సల్స్ మూమెంట్ వీక్ అయిపోయిందని విమర్శించారు. నక్సల్స్లో ఎవరికి వాళ్లు తమ సిద్ధాంతాలు చెబుతారని అన్నారు. కమ్యూనిస్టుల మధ్యే ఎన్నో విబేధాలు ఉన్నాయని ఆరోపించారు వెంకయ్య నాయుడు.
ప్రజాప్రతినిధులు పార్టీ మారితే.. ఆ పార్టీ ద్వారా పొందిన పదవికి రాజీనామా చేయాలని వెంకయ్యనాయుడు తెలిపారు. రాజ్యాంగంలో 10వ షెడ్యూల్ని సవరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
'విజయవాడ ఉత్సవ్ 2025'ను మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు అనేక విషయాల్ని పంచుకున్నారు. రాజధాని విజయవంతం కావాలంటే ఎడ్యుకేషన్, ఎంటర్ టైన్ మెంట్ అవసరమని..
విజయవాడ చరిత్రలో మొట్టమొదటి సారిగా గ్రాండ్వేలో విజయవాడ ఉత్సవ్ 2025 నిర్వహిస్తున్నారు. ఈ పండుగను మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మంత్రి నారా లోకేష్ ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇరువురు అనేక విషయాల్ని పంచుకున్నారు.
1984లో ప్రజాస్వామ్యాన్ని నిస్సిగ్గుగా ఖూనీ చేశారని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు విమర్శించారు. చరిత్ర పుస్తకాల్లోనే కాదు రాజనీతి శాస్త్ర పుస్తకాల్లో చేర్చాల్సిన అంశం 1984 ఘటన అని వెంకయ్య నాయుడు తెలిపారు.
సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఉన్న సవాళ్లను ఎదుర్కొనేలా మీ మేథస్సుతో పని చేయాలని భారత మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు మార్గనిర్దేశం చేశారు. త్వరలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందుబాటులోకి వస్తోందని.. వాటిపై మనం పూర్తి అవగాహన పెంచుకోవాలని సూచించారు. మన సాంకేతికతను ఉపయోగించి మంచి పంటలు పండేలా చేయాలని వెంకయ్య నాయుడు ఆకాంక్షించారు.
వల్లూరు శ్రీమన్నారాయణ అభినందన సభలో భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నాయకులు ఇతరులకు ఆదర్శప్రాయంగా ఉండాలని సూచించారు. అయితే, ప్రస్తుత రాజకీయాల్లో విలువలు లేకుండా పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రస్తుత పరిస్థితుల్లో సోషల్ మీడియా.. యాంటీ సోషల్గా మారుతోందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు.
విలీనం-విభజన మన ముఖ్యమంత్రులు పుస్తకాన్ని నేటితరం యువత తప్పని సరిగా చదవాలని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సూచించారు. ఈ పుస్తకం చదివితే నాయకుల పరిపాలన, విజ్ఞానం, వారి గురించి అన్ని విషయాలు తెలుస్తాయని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.