Home » Venkaiah Naidu
విద్య అనేది కేవలం ఉద్యోగం పొందడానికి మాత్రమే కాకుండా, వ్యక్తిత్వ వికాసానికి, దేశ నిర్మాణానికి దోహదపడాలని భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు పేర్కొన్నారు.
విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మండలి వెంకట కృష్ణారావు శతజయంతి కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మండలి వెంకట కృష్ణారావు కాంస్య విగ్రహాన్ని ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడుతో కలిసి ఆయన ఆవిష్కరించారు.
హిందుత్వం అంటే మతం కాదని.. జీవన విధానమని భారతదేశ మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. దేశభక్తి సమాజ ఐక్యత లోపిస్తే దేశం వెనకబడుతుందని పేర్కొన్నారు.
తిరుపతి లడ్డూ వ్యవహారం, అయోధ్యలో దొంగతనం, శబరిమల ఘటన తననెంతో బాధించాయని భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. వీటికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. ఈరోజు (ఆదివారం) విశాఖలో 'వెంకయ్య నాయకుడు' పుస్తకావిష్కరణ కార్యక్రమం జరగగా ఆయన పాల్గొన్నారు.
రాజకీయాల్లో వెంకయ్య నాయుడు స్ఫూర్తిదాయకమని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. వెంకయ్యనాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక వరమని ఉద్ఘాటించారు.
12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని బొగ్గు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ప్రత్యేకంగా 1-డే కౌంట్డౌన్ ఈవెంట్ నిర్వహించారు.
కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రచించిన 'అప్నాపన్: మై ఎక్స్పీరియన్స్ విత్ నరేంద్ర మోదీ' పుస్తకావిష్కరణ కార్యక్రమం దేశ రాజధాని ఢిల్లీలో ఘనంగా జరిగింది. అప్నాపన్ పుస్తకాన్ని మాజీ ప్రధాని హెచ్.డి.దేవెగౌడ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు.
ఏపీ విద్యశాఖ మంత్రి నారా లోకేశ్ పనితీరు చాలా బాగుందని భారత పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రశంసించారు. ఈ ఏడాది పదోతరగతిలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు మంచి ఫలితాలు తీసుకువచ్చారని కొనియాడారు.
ఆంధ్రా యూనివర్సిటీ శతాబ్ది మహోత్సవాల్లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. పరిస్థితులకు తగినట్టు విద్యార్థులు కొత్త నైపుణ్యాలను అలవర్చుకోవాలని సూచించారు.
పత్రికల్లో, మీడియాల్లో ఏమైనా అసత్య ప్రసారాలు వస్తే వాటిపైన శాంతియుతంగా నిరసనలు తెలిపే హక్కు ఉందని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు. అలా కాకుండా మీడియాపై భౌతిక దాడులకు పాల్పడటం మంచి పద్ధతి కాదని పేర్కొన్నారు.