Home » Venezuela
అమెరికా డెల్టా ఫోర్స్ సైన్యం జనవరి 3వ తేదీన వెనెజువెలాపై దాడి చేసి ఇద్దరినీ కస్టడీలోకి తీసుకుంది. అమెరికా సైన్యం దాడుల్లో పెద్ద మొత్తంలో వెనెజువెలా, క్యూబన్ సైనికులు చనిపోయారు.
తాజాగా నికోలస్ మదురోను, ఆయన భార్య సిలియాను అమెరికా అధికారులు న్యూయార్క్ కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టులో మదురో తన వాదనలు వినిపిస్తూ.. తాను ఏ తప్పూ చేయలేదని, తనను కిడ్నాప్ చేశారని జడ్జి ముందు స్టేట్మెంట్ ఇచ్చారు.
మదురో స్థానంలో వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలిగా డిల్సీ రోడ్రిగ్స్ను నియమిస్తూ ఆ దేశ సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు ఆమె వెనెజువెలా ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తించారు. తాజాగా తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన ఆమె సత్యసాయి బాబా భక్తురాలు కావడం విశేషం.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను సంతోషంగా లేననే విషయం భారత ప్రధాని మోదీకి తెలుసునన్నారు....
అమెరికా హెచ్చరికలను ఖాతరు చేయకుండా ప్రజల ముందుకు పదే పదే వస్తూ మదురో ట్రంప్ సర్కారును సవాలు చేశారట. ఇదే చివరకు అమెరికాను సైనిక చర్యకు ఉసిగొల్పిందని వాషింగ్టన్ వర్గాలు చెబుతున్నాయి. మదురో చేసిన ఓ డ్యాన్స్ వీడియోనే మొత్తం వ్యవహారాన్ని మలుపు తిప్పిందని అంటున్నారు.
తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన డిల్సీ రోడ్రిగ్స్కు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. వెనెజువెలా అభివృద్ధికి తాను సూచించిన ప్రణాళికను అమలు చేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు
వెనెజువెలాపై దాడి చేసి ఆ దేశ చమురు రంగాన్ని తన చేతుల్లోకి తీసుకోవడమే అమెరికా ప్రధాన లక్ష్యం అనేది బహిరంగ రహస్యమే. ఈ నేపథ్యంలో భారత చమురు కంపెనీలకు లాభం చేకూరుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
అర్ధరాత్రి మిలిటరీ ఆపరేషన్తో వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను అపహరించిన అమెరికా.. ఆయనను కరుడుగట్టిన నేరస్థుడి మాదిరిగా చేతులకు బేడీలు వేసి జైలుకు తరలించింది.
మదురోను ట్రంప్ పట్టుకుని స్వదేశానికి తీసుకువెళ్లినప్పుడు 170 మంది ప్రాణాలను బలికొన్న 2008 ఉగ్రదాడుల నిందితులైన మసూద్ అజహర్, లష్కరే తొయిబా నేతలను కూడా మోదీ పట్టుకురావచ్చు కదా అని ఒవైసీ అన్నారు.
వెనెజువెలా వ్యవహారాలు అమెరికా చేతుల్లోకి వెళ్లాక భారత్కు మేలు కలిగే అవకాశం ఉందని పరిశీలకులు కామెంట్ చేస్తున్నారు. ముఖ్యంగా చమురు ఎగుమతులపై ఆంక్షలు తొలగిపోతే ఓఎన్జీసీ బాకీ వసూలు కావడంతో పాటు అక్కడి ఆయిల్ ఫీల్డ్స్లో చమురు వెలికితీత పుంజుకునే అవకాశం ఉందని అంటున్నారు.