Home » Venezuela
రష్యా ముడి చమురుకు బదులు వెనెజువెలా నుంచి దిగుమతులు ప్రారంభించాలని భారత్కు అమెరికా సూచించినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ వార్తలపై భారత్ ఇంకా స్పందించాల్సి ఉంది.
మదురో అరెస్టు తరువాత తమకు అమెరికా దళాలు కేవలం 15 నిమిషాలే టైమిచ్చి తదుపరి చర్యపై నిర్ణయం తీసుకోమని బెదిరించాయని వెనెజువెలా అధ్యక్షురాలు డెల్సీ రోడ్రీగెజ్ చెప్పినట్టు ఉన్న ఆడియో రికార్డింగ్ ఆ దేశంలో కలకలం రేపుతోంది. అమెరికాకు, డెల్సీకి మధ్య రహస్య ఒప్పందం ఉందన్న వార్తల నడుమ ఈ పరిణామానికి అమిత ప్రాధాన్యం ఏర్పడింది.
మా ముక్కుల నుంచి రక్తం కారింది. కొందరు వాంతులు చేసుకున్నారు. చాలా మంది కింద పడిపోయారు. ఆ సోనిక్ ఆయుధం ముందు మే నిలబడలేకపోయాం. అమెరికాతో పోరాడగలమని ఎవరైనా అనుకుంటే అది భ్రమే.. నికోలస్ మదురో దగ్గర గార్డ్గా పని చేసిన ఓ వ్యక్తి మాటలు చాలా మందిని ఆశ్చర్యపరిచాయి.
వెనెజువెలా నుంచి అక్రమంగా ముడిచమురును తరలిస్తున్న మరో ఆయిల్ ట్యాంకర్ను అదుపులోకి తీసుకున్నట్టు అమెరికా సైన్యం తాజాగా పేర్కొంది. కరీబియన్ సముద్ర జలాల్లో నౌకను స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించింది.
వెనెజువెలా ఆపద్ధర్మ అధ్యక్షురాలు డెల్సీ రోడ్రీగెజ్ అమెరికా తీరును ఎండగట్టారు. దురాశతో అమెరికా తమ దేశ వనరులపై దృష్టి సారించిందని పార్లమెంటును ఉద్దేశించి తాజాగా వ్యాఖ్యానించారు.
గత నెలలో వెనెజువెలా వైపు వెళ్తున్న ఎం/వీ బెల్లా-1 నౌకను స్వాధీనం చేసుకునేందుకు అమెరికా కోస్ట్ గార్డులు ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేదు. రష్యా ఆ నౌకకు మద్దతుగా సబ్ మెరైన్, యుద్ధ నౌకను మెహరించింది.
అమెరికా డెల్టా ఫోర్స్ సైన్యం జనవరి 3వ తేదీన వెనెజువెలాపై దాడి చేసి ఇద్దరినీ కస్టడీలోకి తీసుకుంది. అమెరికా సైన్యం దాడుల్లో పెద్ద మొత్తంలో వెనెజువెలా, క్యూబన్ సైనికులు చనిపోయారు.
తాజాగా నికోలస్ మదురోను, ఆయన భార్య సిలియాను అమెరికా అధికారులు న్యూయార్క్ కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టులో మదురో తన వాదనలు వినిపిస్తూ.. తాను ఏ తప్పూ చేయలేదని, తనను కిడ్నాప్ చేశారని జడ్జి ముందు స్టేట్మెంట్ ఇచ్చారు.
మదురో స్థానంలో వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలిగా డిల్సీ రోడ్రిగ్స్ను నియమిస్తూ ఆ దేశ సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు ఆమె వెనెజువెలా ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తించారు. తాజాగా తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన ఆమె సత్యసాయి బాబా భక్తురాలు కావడం విశేషం.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను సంతోషంగా లేననే విషయం భారత ప్రధాని మోదీకి తెలుసునన్నారు....