Home » Uttarakhand
కాంగ్రెస్ పార్టీపై బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్షా భారీ పంచ్ విసిరారు. గత కొన్నేళ్లుగా కాంగ్రెస్ పార్టీ నేతలు బీజేపీ, శివసేన, తృణమూల్ కాంగ్రెస్కు వలసలు పోతున్నారని, ఎక్కువ మంది నేతలు బీజేపీలో చేరారని చెప్పారు. కాంగ్రెస్ నేతలందరి కోసం బీజేపీ తలుపులు తెరిస్తే గ్రాండ్ ఓల్డ్ పార్టీకి కేవలం పార్టీ కార్యాలయ భవంతులే మిగులుతాయని అన్నారు.
సంస్కృతి సంప్రదాయాలకు భారతదేశం పెట్టింది పేరు. అడుగడుగునా ఆధ్యాత్మిక ఉట్టిపడే ఆలయాలు, రాజుల కాలం నాటి రాజస కట్టడాలు, శత్రు దుర్భేధ్యమైన కోటలు, ప్రశాంత సముద్ర తీరాలు.. ఇలా చెప్పుకుంటూపోతే లెక్కకు మిక్కిలి చాలా ఉన్నాయి.
కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత, స్టార్ క్యాంపెయినర్ ప్రియాంక గాంధీ వాద్రా బీజేపీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఉత్తరాఖండ్ రామ్ నగర్లో ప్రియాంక శనివారం నాడు ప్రచారం చేశారు. త్యాగం గురించి ప్రియాంక గాంధీ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. బీజేపీలో ఏ ఒక్కరి పేరు ప్రస్తావించకుండా ప్రియాంక విమర్శలు చేశారు. దేశం కోసం ఎంత చేసినా సరే తమ కుటుంబాన్ని అవమానిస్తారని మండిపడ్డారు.
ఎన్నికల నగారా మోగిందంటే చాలు.. రాజకీయ పార్టీలు వెంటనే ప్రచార కార్యక్రమాలు, ర్యాలీలు నిర్వహిస్తాయి. చిన్న చిన్న మారుమూల ప్రాంతాలకు వెళ్లి మరీ.. తమకే ఓటు వేయాలని ఓటర్లను కోరుతారు. ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. దేశవ్యాప్తంగా పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని చేపట్టాయి.
కూలీలతో వెళ్తున్న బొలెరో వాహనం ప్రమాదవశాత్తు అదుపు తప్పి దాదాపు 200 మీటర్ల లోతులో ఉన్న గుంతలో పడిపోయింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న 10 మందిలో 8 మంది మృత్యువాత చెందారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ విషాద ఘటన ఉత్తరాఖండ్(Uttarakhand)లోని నైనిటాల్(Nainital district) జిల్లాలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉత్తరాఖండ్ లో లోక్సభ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. రుద్రపూర్లో మంగళవారంనాడు జరిగిన 'విజయ్ శంఖనాథ్ ర్యాలీ'లో మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయనకు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఒక శంఖాన్ని బహూకరించారు.
ఉత్తరాఖండ్(Uttarakhand)లో పట్టపగలే దుండగులు రెచ్చిపోయారు. ఉదమ్ సింగ్ నగర్లోని నానక్మట్టా సాహిబ్ గురుద్వారా చీఫ్ బాబా తర్సేమ్ సింగ్ను ఈరోజు తెల్లవారుజామున బైక్పై వచ్చిన ఇద్దరు దుండగులు గురుద్వారా ఆవరణలో కాల్చి చంపారు. దీనికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు బయటకు వచ్చాయి.
దేశంలో సార్వత్రిక ఎన్నికల హడావుడి మొదలైంది. తొలిదశలో 102 స్థానాలకు పోలింగ్ జరగనుండగా.. ఉత్తరాఖండ్లోని మొత్తం ఐదు స్థానాలకు ఒకే దశలో పోలింగ్ నిర్వహించనున్నారు. నోటిఫికేషన్ విడుదలతో నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరాఖండ్లో బీజేపీ క్లీన్స్వీప్ చేసింది. వరుసగా మూడోసారి క్లీన్ స్వీప్పై కమలం పార్టీ గురి పెట్టింది.
ఉత్తరాఖండ్ అసెంబ్లీలో ఫిబ్రవరి 7న ఆమోదించిన ఉమ్మడి పౌర స్మృతి బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం ఆమోద ముద్ర వేశారు. దీంతో ఈ బిల్లు చట్టంగా మారింది. మతంతో సంబంధం లేకుండా వివాహాలు, విడాకులు, భూములు, ఆస్తులు, వారసత్వ చట్టాలు అందరికీ ఒకేరీతిలో వర్తించేందుకు ఉద్దేశించిన ఈ బిల్లును ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ థామి గత అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టగా, బిల్లు సభామోదం పొందింది.
Dehradun News: కేదార్నాథ్ వెళ్లాలనుకునే భక్తులకు బద్రీనాథ్-కేదార్నాథ్ ఆలయ కమిటీ(BKTC) శుభవార్త చెప్పింది. మే 10వ తేదీన ఉదయం 7 గంటలకు కేదార్నాథ్ ఆలయాన్ని(Kedarnath Dham) తెరవనున్నట్లు ప్రకటించారు. మహాశివరాత్రి(Mahashivratri) సందర్భంగా బద్రీనాథ్-కేదార్నాథ్ ఆలయ కమిటీ ఈ ప్రకటన చేసింది. మే 10వ తేదీన భక్తుల సందర్శనార్థం ఆలయ ద్వారాలు తెరుచుకుంటాయని తెలిపారు.