Home » Uttam Kumar Reddy Nalamada
ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లపై ఉన్నతాధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
దేవాదుల ఎత్తిపోతల పథకాన్ని 2027 డిసెంబరులోగా పూర్తి చేయడానికి రోడ్ మ్యాప్ సిద్ధం చేసినట్లు మంత్రి ఉత్తమ్ ప్రకటించారు.
భూగర్భ జలాల సంరక్షణకు, ప్రజలకు సురక్షిత తాగునీటిని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్ఠ చర్యలు తీసుకుంటోందని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు.
కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను కేంద్ర ప్రభుత్వం అమాంతం పెంచిందని తెలంగాణ నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీపై మంత్రి ఫైర్ అయ్యారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై సీఎం రేవంత్రెడ్డికి, తమ ప్రభుత్వానికి ఎలాంటి దురుద్దేశం లేదని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఈనెల 20వ తేదీన సీఎం రేవంత్రెడ్డితో కలిసి మేడిగడ్డ బ్యారేజ్ను పరిశీలిస్తామని పేర్కొన్నారు.
కాలేశ్వరం, దేవాదుల ప్రాజెక్టుల్లోని భారీ మోటార్లను నిబంధనలకు విరుద్ధంగా పదే పదే ఆన్, ఆఫ్ చేస్తూ అశాస్త్రీయంగా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. పంపులు, మోటార్లు పాడైపోయేలా కావాలనే ఇలాంటి కుట్ర జరుగుతోందని ఆరోపించారు.
రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత ఉందనే వార్తల నేపథ్యంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. ఎలాంటి భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదని, రాష్ట్రంలో ఇంధన నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని తెలిపారు.
గ్యాస్ సిలిండర్ల సరఫరాలో ఏర్పడిన సమస్యలపై రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లకు ఎలాంటి కొరత లేదని స్పష్టం చేశారు.
తెలంగాణ వ్యాప్తంగా అత్యవసర సేవలకు గ్యాస్ కొరత లేకుండా చూస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. కొంత కొరత ఉందని కేంద్ర ప్రభుత్వమే ప్రకటించిందన్న ఉత్తమ్.. కేంద్రం, రాష్ట్రాలకు గైడ్ లైన్స్ ఇచ్చిందని ఆ విధంగా ముందుకెళ్తున్నామని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్లకు కొరత లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. గృహ వినియోగదారులు ఆందోళనకు గురికాకుండా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు.