Home » Uttam Kumar Reddy Nalamada
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణానికి కట్టుబడి ఉన్నామని, ఇందుకోసం తక్షణమే సవరణ డీపీఆర్ను సిద్ధం చేసి, అనుమతుల కోసం దాఖలు చేయాలని అధికారులను మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆదేశించారు.
దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో తెలంగాణ ఒకటి అని, రాష్ట్రంలో పెట్టుబడిదారులకు అత్యంత అనుకూలమైన వాతావరణం ఉందని డెన్మార్క్ రాయబారి రాస్మస్ అబిల్డ్గార్డ్ క్రిస్టెన్సన్తో మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి అన్నారు.
గత ప్రభుత్వంలో బాధ్యతా రహితంగా నిర్మించిన కాళేశ్వరం తప్పిదాలకు నాటి సీఎం కేసీఆరే బాధ్యులని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి పేర్కొన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆదివారం హడావుడిగా చర్చ అంటేనే కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర ఏంటో అర్థమైందని మాజీ మంత్రి హరీష్రావు విమర్శించారు. కేసీఆర్కు, తనకు కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ 8బీ కింద నోటీసులు ఇవ్వలేదని పేర్కొన్నారు. 8బీ కింద నోటీసులు ఇవ్వకపోతే రిపోర్టు చెల్లదని సుప్రీంకోర్టు చెప్పిందని మాజీ మంత్రి హరీష్రావు గుర్తుచేశారు.
కేబినెట్ అనుమతి లేకుండానే కాళేశ్వరం ప్రాజెక్టుపై కేసీఆర్ ప్రభుత్వం ముందుకు వెళ్లిందని మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి తెలిపారు. కాళేశ్వరం పూర్తి చేయడానికి రూ.లక్షా 27 వేలకోట్లు అవసరమని పేర్కొన్నారు. లక్ష కోట్లు ఖర్చు పెట్టి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుతో లక్ష ఎకరాల కొత్త ఆయకట్టుకు కూడా నీరు ఇవ్వలేదని వెల్లడించారు. లక్ష కోట్లతో కట్టిన ప్రాజెక్ట్ నాలుగేళ్లలోనే కూలిందని మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
కేంద్ర జల వనరుల సంఘం (సీడబ్ల్యూసీ) నుంచి ప్రాజెక్టులకు కీలక అనుమతులు సాధించినప్పటికీ వాటికి కేంద్ర సహాయం కోరే దిశగా అధికారుల అడుగులు పడటం లేదు.
కృష్ణా, గోదావరి ప్రాజెక్టుల కింద పంటల సాగుకు అనువైన పరిస్థితులున్నాయని మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి తెలిపారు. వరదల నిర్వహణలో నిర్లక్ష్యాన్ని ఏమాత్రం సహించబోమన్నారు.
హుజుర్నగర్ నియోజకవర్గ పరిధిలోని జానపహాడ్ గ్రామంలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల చెల్లింపులో జరిగిన అవకతవకలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సీరియస్గా స్పందించారు. అవకతవకల విషయం తన దృష్టికి వచ్చిన వెంటనే సదరు కార్యదర్శి వెంకటయ్యను సస్పెండ్ చేయడంతో పాటు ఏసీబీ కేసు నమోదు చేయాలంటూ జిల్లా కలెక్టర్ను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు.
కాంగ్రెస్ సర్కారుపై బీఆర్ఎస్ నేత, ఆ పార్టీ సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శలు గుప్పించారు. రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వం పగ తీర్చుకుంటోందన్నారు. కాంగ్రెస్ నేతలకు వ్యవసాయం, నీళ్ల విలువ, రైతుల గురించి తెలియదన్న హరీశ్ రావు..
తెలంగాణలో 'రప్పా రప్పా' రాజకీయాలకు తెరలేపారు. సూర్యాపేటలో కలెక్టరేట్కు వెళ్ళేదారిలో కాంగ్రెస్ రప్పా- రప్పా అంటూ మంత్రి ఉత్తమ్ యువశక్తి పేరుతో ఫ్లెక్సీలు వెలిశాయి.