Share News

Harish Rao : రైతులపై కాంగ్రెస్‌ ప్రభుత్వం పగ తీర్చుకుంటోంది, వాళ్లకు నీటి విలువ తెలీదు : హరీశ్ రావు

ABN , Publish Date - Aug 17 , 2025 | 12:20 PM

కాంగ్రెస్ సర్కారుపై బీఆర్ఎస్ నేత, ఆ పార్టీ సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శలు గుప్పించారు. రైతులపై కాంగ్రెస్‌ ప్రభుత్వం పగ తీర్చుకుంటోందన్నారు. కాంగ్రెస్‌ నేతలకు వ్యవసాయం, నీళ్ల విలువ, రైతుల గురించి తెలియదన్న హరీశ్ రావు..

Harish Rao :  రైతులపై కాంగ్రెస్‌ ప్రభుత్వం పగ తీర్చుకుంటోంది, వాళ్లకు నీటి విలువ తెలీదు : హరీశ్ రావు
Harish Rao

హైదరాబాద్, ఆగస్టు 17 : రేవంత్ రెడ్డి సర్కారుపై బీఆర్ఎస్ నేత, ఆ పార్టీ సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శలు గుప్పించారు. రైతులపై కాంగ్రెస్‌ ప్రభుత్వం పగ తీర్చుకుంటోందన్నారు. కాంగ్రెస్‌ నేతలకు వ్యవసాయం, రైతుల గురించి తెలియదన్న హరీశ్ రావు, సీఎం రేవంత్‌, మంత్రి ఉత్తమ్‌కు నీటి విలువ తెలియదని ఎద్దేవా చేశారు. 'బీఆర్ఎస్‌ నేతల మీద కోపం ఉంటే.. రైతులకు శిక్ష వేస్తారా? బురద రాజకీయాల కోసం వరద నీళ్లను సముద్రంలోకి వదలకండి. కాళేశ్వరం కూలిందని గోబల్స్‌ ప్రచారం చేస్తున్నారు. కావాలనే కాళేశ్వరం మోటార్లు ఆన్‌ చేయడం లేదు. ప్రజలకు కీడు చేస్తే.. అది ప్రభుత్వమే అనుభవిస్తుంది.' అంటూ హరీశ్ రావు ధ్వజమెత్తారు. కాళేశ్వరం పంపులను ఆన్ చేసి రిజర్వాయర్లను నింపాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

ఇవాళ సిద్ధిపేటలో మీడియాతో మాట్లాడిన హరీశ్ రావు.. కాంగ్రెస్ మంత్రుల తీరుని ఎండగట్టే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా హరీశ్ రావు చేసిన కామెంట్స్..


* ప్రభుత్వం ప్రజలకు మేలు చేయాలి, కీడు చేస్తే అది ప్రభుత్వం అనబడదు.

* కట్టిన ఇల్లు, పెట్టిన పొయ్యి లెక్కన కాళేశ్వరం ప్రాజెక్టు ఉంటే, ఈ ప్రభుత్వం నీళ్ళని సముద్రంలోకి వదులుతూ ప్రాజెక్టులను పడవు పెడుతున్నది.

* కడెం నుంచి ఎల్లంపల్లి కి 62 వేల క్యూసెక్కుల నీరు వస్తుంది.. ఈ మధ్యాహ్నానికి అది లక్ష 50 వేలకు పెరగనుంది.

* వరద నీళ్ళు వస్తుంటే ప్రభుత్వం గేట్లు ఎత్తి సముద్రంలోకి వదులుతున్నది.

* నంది మేడారంలో కటక ఆన్ చేస్తే రోజుకు రెండు టీఎంసీ లు మిడ్ మానేర్ కు వస్తాయి.

* 60 శాతం డ్యామ్ లు ఖాళీగా ఉన్నవి..

* కాళేశ్వరం కూలిందని చెప్పి ప్రభుత్వం, నీళ్ల రాజకీయం చేస్తున్నారు.

* రేవంత్ కు ప్రభుత్వం నడపడం చేతకావడం లేదు.

* ఎస్ఆర్ఎస్పి వరద కాలువ ద్వారా నీళ్లు నింపాలి.

* ఇప్పటికే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కి భారీగా వరద నీరు వస్తున్నది..

* వరద కాలువ ద్వారా అన్నపూర్ణ, మిడ్ మానేరు, ప్రాజెక్టు ను నింపాలి..

* కరెంటు ఫుల్.. నీళ్లు ఫుల్.. ప్రాజెక్టు మోటార్ల స్విచ్చ్ ఆన్ చేయాలి

* మోటార్లను ప్రభుత్వం ఆన్ చేయక పోతే, వేలాది మంది రైతులతో వెళ్లి మేమే మోటార్లు ఆన్ చేస్తాము.

* కాంగ్రెస్ వచ్చింది..మళ్ళీ యూరియా కోసం చెప్పులు లైన్ పెట్టుతున్నారు.

* కాళేశ్వరం పై మరో కుట్ర చేస్తున్నారు.. మోటర్లను ఆన్ అండ్ ఆన్ చేయడం వలన మోటార్లు పనికి రాకుండా చేస్తున్నారు.

* రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ మధ్య విభేదాలు ఉంటే మీలో మీరు చూసుకోండి.

* బి.ఆర్.ఎస్ పార్టీ వందలాది మంది తో వెళ్లి కాళేశ్వరం మోటార్లు ఆన్ చేస్తాము.

* దేవాదుల మోటార్లు ఆన్ చేయక వరంగల్ కు నష్టం జరుగుతుంది.

* మంత్రులకు కమీషన్ పంచుకోవడానికి సమయం సరిపోవడం లేదు. అంటూ హరీశ్ రావు చెప్పుకొచ్చారు.


ఇవి కూడా చదవండి

మీరు ఇంత ప్రత్యేకమా.. ఈ విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు..

సూర్యుడిలో విస్ఫోటనాలు.. మనుషులపై తీవ్ర ప్రభావం..

Updated Date - Aug 17 , 2025 | 05:22 PM