Home » Uttam Kumar Reddy Nalamada- Congress
కాళేశ్వరం ప్రాజెక్టులో తెలంగాణ హైకోర్టు ఎవరికీ క్లీన్ చిట్ ఇవ్వలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. జస్టిస్ ఘోష్ కమిషన్ ఏర్పాటు సరైందని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసిందని తెలిపారు.
‘కాళేశ్వరం ప్రాజెక్టును గాలికి వదిలేయబోం. ఎన్డీఎస్ఏ సూచనల మేరకు మరమ్మతులు చేస్తాం. ప్రాజెక్టును పునరుద్ధరిస్తాం. మళ్లీ వినియోగంలోకి తెస్తాం. లక్ష కోట్లు పెట్టిన.....
ప్రస్తుత యాసంగి సీజన్లో తెలంగాణ నుంచి 30 లక్షల టన్నుల ఉప్పుడు బియ్యాన్ని (బాయిల్డ్ రైస్ను) సేకరించాలని సీఎం రేవంత్రెడ్డి, మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ పనులపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. కాళేశ్వరం బ్యారేజీల్లో తీవ్రమైన లోపాలని ఎన్డీఎస్ఏ అధికారులు గుర్తించారని తెలిపారు.
: అడ్డదారుల్లో ధాన్యాన్ని తరలిస్తే ఉపేక్షించేది లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. రాష్ట్ర సరిహద్దుల్లో ధాన్యం ఎగుమతులు,దిగుమతులపై కట్టుదిట్టమైన నిఘా ఉంచామని స్పష్టం చేశారు.
కేసీఆర్ వల్లనే తనకు గుర్తింపు వచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. రావణాసురుడు లేకుంటే శ్రీరామునికి పేరు వచ్చేదే కాదన్నారు.
తెలంగాణ అసెంబ్లీలో బియ్యం ఎగుమతులపై సోమవారం చర్చ జరిగింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్య మాటల యుద్ధం జరిగింది.
బీఆర్ఎస్ నేతలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరిగేషన్ శాఖను బీఆర్ఎస్ సర్వనాశనం చేసిందని ధ్వజమెత్తారు..
పోలవరం - నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరుగుతోంది. ఈ విచారణకు తెలంగాణ నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా సుప్రీంలో తెలంగాణ రిట్ పిటీషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
పోలవరం- నల్లమల్ల ప్రాజెక్టును మహారాష్ట్ర, కర్ణాటక కూడా వ్యతిరేకిస్తుందని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సుప్రీంకోర్టులో వాదనలు బలంగా వినిపించాలని న్యాయవాది అభిషేక్ సింఘ్వీకి సూచించామని పేర్కొన్నారు.