Home » Uddhav Thackeray
ఎంఎన్ఎస్ వర్గాల సమాచారం ప్రకారం.. వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా పొత్తుపై నిర్ణయం తీసుకోవాల్సిందిగా స్థానిక నేతలను రాజ్ ఠాక్రే సూచించారు. దీంతో కల్యాణ్-డోంబివిలి ప్రాంత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని షిండే శివసేనకు మద్దతివ్వాలని స్థానిక నాయకత్వం నిర్ణయం తీసుకుంది.
బీఎంసీ ఎన్నికల్లో పాతికేళ్ల తర్వాత శివసేన ఆధిపత్యానికి బీజేపీ-షిండే శివసేన కూటమి గండికొట్టింది. అయితే.. మహారాష్ట్రలో రాజకీయ యుద్ధం ఇంతటితో ముగిసినట్టు కాదని.. మరాఠా ప్రజలకు సముచిత గౌరవం దక్కేంత వరకూ ఈ పోరాటం కొనసాగుతుందని ఉద్ధవ్ సారథ్యంలోని శివసేన(యూబీటీ) తెలిపింది.
ఠాక్రే సోదరుల మధ్య భిన్న సైద్ధాంతిక విభేదాలున్నా దేశానికి ప్రాధాన్యతనిచ్చి ఐక్యంగా నిలిచారని సంజయ్ రౌత్ అన్నారు. ఠాక్రేలు అంటేనే ఒక బ్రాండ్ అని, ఠాక్రేలు ఉన్నంత కాలం మరాఠా ప్రజలకు రక్షణ ఉంటుందని చెప్పారు.
అసెంబ్లీ చైర్మన్గా ఉన్న రాహుల్ నార్వేకర్ బహిరంగంగానే అభ్యర్థులను, ఓటర్లను బెదిరించడం దిగ్భ్రాంతికి కలిగించినట్టు ఉద్ధమ్ థాకరే తెలిపారు. స్వీకర్పై వెంటనే చర్చలు తీసుకోవాలని, ఆయనను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
శివసేన యూబీటీ, ఎంఎన్ఎస్ కలిసికట్టుగా మరాఠా ప్రజల ప్రయోజనాల కోసం బీఎంసీ ఎన్నికలకు వెళ్తున్నట్టు ఉద్ధవ్ ఠాక్రే ప్రకటించారు
మరాఠా ప్రజలకు కంచుకోటగా దాదర్, శివడి, వోర్లి, ములుంద్ ప్రాంతాలు ఉన్నాయి. ఇక్కడ సీట్ల పంపకాలపై ఇంతకుముందు రెండు పార్టీల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయి. అయితే దాదాపు అన్నిచోట్ల ఆమోదయోగ్యమైన రీతిలో తాజాగా పరిష్కారం కుదిరినట్టు చెబుతున్నారు.
ఎంఎంఆర్డీఏ వివరణపై ఆదిత్య ఠాక్రే మండిపడ్డారు. ఇళ్ల లోపల ఏరియల్ గూఢచర్యం జరపమని ఏ సర్వే చెప్పిందని నిలదీశారు. ముందుగా ఆయా ప్రాంతాల్లోని నివాసం ఉంటున్న వారికి సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదా అని అధికారులను ప్రశ్నించారు.
మహారాష్ట్ర విజయ్ ర్యాలీ గత జూలైలో జరిగినప్పుడు ఠాక్రే సోదరులిద్దరూ ఒకే వేదికపైకి వచ్చారు. అప్పటి నుంచి కూడా ఇద్దరు నేతలూ పలుమార్లు సమావేశమయ్యారు. గత నెలలో రాజ్ నివాసమైన శివ్తీర్ధ్కు ఉద్ధవ్ వెళ్లి కలుసున్నారు.
సమాచారం తెలిసిన వెంటనే అధికారులు హుటాహుటిన శివాజీ పార్క్ వద్దకు చేరుకుని విగ్రహాన్ని శుభ్రం చేసేందుకు చర్యలు చేపట్టినట్టు పార్టీ సీనియర్ నేతలు తెలిపారు. శివాజీ పార్క్ చుట్టుపక్కల ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా ముంబై పోలీసులు అదనపు బలగాలను మోహరించారు.
కేంద్రంలోని అధికార ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్ను ఎంపిక చేయగా, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బి.సుదర్శన్ రెడ్డిని విపక్ష కూటమి ఎంపిక చేసింది. సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగనుంది.