Home » Udayanidhi Stalin
రాష్ట్రంలో.. ల్యాప్లాప్లు పంపిణీ చేయడాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ... ఫిబ్రవరిలోగా 10లక్షల మంది విద్యార్థులకు పంపిణీ చేయాలన్నదే రాష్ట్రప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు. ఓట్ల కోసమే ల్యాప్లాప్లు పంపిణీ చేస్తున్నారని వస్తున్న విమర్శలను ఆయన కొట్టిపారేశారు.
ఈ రోజుల్లో ప్రేమపెళ్లి బహుకష్టం.. అన్నారు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్. కార్తిక అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆయనే ఈ వ్యాఖ్యలు చేయడంతో అక్కడున్న వారు ఒకింత నవ్వుకోవడం కనిపించింది. చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఉదయనిధి పాల్గొన్నారు.
నలుపు, ఎరుపు రంగులు కలిగిన డీఎంకే పతాకం రూపొందించి 75 యేళ్లు పూర్తయిన సందర్భంగా శనివారం వళ్లువర్కోట్టం లో రెండు రోజుల సదస్సు నిర్వహించనున్నారు. పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగనున్నాయి.
రాష్ట్రంలో రెండో విడతగా అర్హులైన గృహిణులకు కలైంజర్ మహిళా సాధికార పధకం కింద ప్రతినెలా రూ.1000 చెల్లించనున్నట్లు ప్రత్యేక పథకాల అమలు మంత్రిత్వ శాఖను నిర్వర్తిస్తున్న ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి ప్రకటించారు.
డీఎంకే కూటమి నుంచి హస్తం గుర్తు (కాంగ్రెస్) జారిపోదని ఉపముఖ్యమంత్రి ఉదయనిధి నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. దిండుగల్ సమీపంలోని వేడచెందూర్లో శుక్రవారం ఉదయం జరిగిన డీఎంకే ప్రముఖుడు స్వామినాధన్ ఇంటి వివాహ వేడుకల్లో ఉదయనిధి పాల్గొని వధూవరులకు పుష్పగుచ్ఛం సమర్పించి శుభాకాంక్షలు తెలిపారు.
నాలుగేళ్లుగా గవర్నర్తో రాష్ట్ర ప్రభుత్వం పోరాడుతూనే ఉందని ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి పేర్కొన్నారు. ఇక్కడ జరిగిన తిరుచ్చి శ్రీరంగం శాసనసభ నియోజకవర్గ పార్టీ సమావేశంలో పాల్గొన్న ఉదయనిధి మాట్లాడుతూ.. రాష్ట్రంలో అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారం ప్రారంభించాయన్నారు.
అంబులెన్స్లు వెళ్లే ప్రధాన రహదారులను ఆక్రమించి రోడ్షోలు చేస్తున్న అన్నాడీఎంకే నేత ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్)కి ప్రజలు తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని, త్వరలోనే ఆ పార్టీ ఐసీయూలో చేరటం ఖాయమని ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి(Udayanidhi) జోస్యం చెప్పారు. సైదాపేటలో రూ.28.75 కోట్లతో నిర్మించిన ఆరంతస్థుల ఆస్పత్రిని సోమవారం ఆయన ప్రారంభించారు.
విద్వేష ప్రసంగాలతో సమాజంలోని మైనారిటీ వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి(Dy CM Udayanidhi) ఆవేదన వ్యక్తం చేశారు. ట్రిప్లికేన్లోని కలైవానర్ అరంగంలో రాష్ట్ర యువజన సర్వీసులు, క్రీడామంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రసంగించారు.
రాష్ట్రంలో మతచిచ్చు రగిల్చేందుకు ప్రయత్నిస్తున్న కాషాయ పార్టీలను, నేతలను అడ్డుకుంటామని డీఎంకే యువజన విభాగం కార్యదర్శి, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి పేర్కొన్నారు. నగరంలో శుక్రవారం జరిగిన బూత్కమిటీ సభ్యుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
బాధ్యతాయుతమైన 12వేల మందితో కూడిన యువజన విభాగం డీఎంకే సైన్యంగా ఉందని ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి(Deputy Chief Minister Udayanidhi) పేర్కొన్నారు..