Home » Udayanidhi Stalin
తమిళనాడు మాజీ ఉప ముఖ్యమంత్రి, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ మరోసారి సనాతన ధర్మంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. మూడేళ్ల క్రితం ఉదయనిధి సనాతన ధర్మంపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియాతో పోల్చుతూ దానిని నిర్మూలించాలని వ్యాఖ్యానించారు.
సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలతో గతంలో విమర్శలు ఎదుర్కొన్న మాజీ ఉప ముఖ్యమంత్రి, తమిళనాడు అసెంబ్లీలో డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ మంగళవారంనాడు కూడా అదే తరహాలో వ్యాఖ్యలు చేశారు. ప్రజలను విడదీసే సనాతన ధర్మాన్ని రూపుమాపాలని అసెంబ్లీలో మాట్లాడుతూ అన్నారు.
ప్రచారానికి వెళ్తున్న ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి కారును ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు తనిఖీ చేశారు.
ప్రధాని నరేంద్రమోదీకి, కేంద్రంలో పెత్తనంచెలాయిస్తున్న బీజేపీ మంత్రులకు అన్నాడీఎంకే నాయకుడు ఎడప్పాడి పళనిస్వామి కట్టుబానిసలా వ్యవహరిస్తున్నారని ఉపముఖ్యమంత్రి ఉదయనిధి ఎద్దేవా చేశారు.
అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే చీఫ్ ఎడప్పాడి పళనిస్వామికి ఉద్వాసన పలకాలని, తద్వారా బీజేపీ మాయమాటలకు తమిళనాడు లొంగదని బలంగా చాటిచెప్పాలని డీఎంకే నేత, తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ అన్నారు.
తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ గతంలో సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా పెద్ద దుమారం రేపాయి. పలు రాష్ట్రాల్లో ఆయనపై కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఉదయనిధికి హైకోర్ట్ షాక్ ఇచ్చింది. వివరాల్లోకి వెళితే..
మరికొద్దిరోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్నాడీఎంకే పార్టీ బలహీనంగా ఉన్నా ఆ పార్టీనే తమ ప్రత్యర్ధి అని ఆయన అన్నారు.
రాష్ట్రంలో.. ల్యాప్లాప్లు పంపిణీ చేయడాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ... ఫిబ్రవరిలోగా 10లక్షల మంది విద్యార్థులకు పంపిణీ చేయాలన్నదే రాష్ట్రప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు. ఓట్ల కోసమే ల్యాప్లాప్లు పంపిణీ చేస్తున్నారని వస్తున్న విమర్శలను ఆయన కొట్టిపారేశారు.
ఈ రోజుల్లో ప్రేమపెళ్లి బహుకష్టం.. అన్నారు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్. కార్తిక అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆయనే ఈ వ్యాఖ్యలు చేయడంతో అక్కడున్న వారు ఒకింత నవ్వుకోవడం కనిపించింది. చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఉదయనిధి పాల్గొన్నారు.
నలుపు, ఎరుపు రంగులు కలిగిన డీఎంకే పతాకం రూపొందించి 75 యేళ్లు పూర్తయిన సందర్భంగా శనివారం వళ్లువర్కోట్టం లో రెండు రోజుల సదస్సు నిర్వహించనున్నారు. పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగనున్నాయి.