Home » UAE
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్రరూపం దాల్చాయి. నిర్మాణంలో ఉన్న తమ అణు విద్యుత్ కేంద్రంపై అమెరికా వైమానిక దాడులు నిర్వహించిందని ఇరాన్ ఆరోపించింది.
అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం మరింత ఉద్ధృతమవుతోంది. తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం విఫలమవడంతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి.
ఇరాన్, అమెరికా దేశాల మధ్య జూన్ నెలలో జరిగిన కాల్పుల విరమణ ఒప్పందానికి ఇరాన్ తూట్లు పొడిచింది. తమ అనుమతి లేకుండా హోర్ముజ్ జలసంధిలో ప్రయాణిస్తున్న నౌకలపై దాడులు చేస్తోంది. తాజాగా, హోర్ముజ్ జలసంధిలోని ఒమన్ ప్రాంతీయ జలాల్లో ప్రయాణిస్తున్న రెండు యూఏఈ ఆయిల్ ట్యాంకర్లపై ఇరాన్ దాడులు చేసింది.
హోర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకపై ఇరాన్ దాడికి పాల్పడటంతో ఓ భారతీయుడు గల్లంతయ్యారు. ఆ వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు కేంద్ర విదేశాంగ శాఖ తెలిపింది.
అబుదాబిలో ఓ భారత మహిళను అదృష్టం వరించింది. ప్రతి ఏటా నిర్వహించే బిగ్ టికెట్ లక్కీ డ్రాలో పాల్గొన్న ఆమె ఏకంగా రూ.65 కోట్లు గెలుచుకున్నారు. ఢిల్లీకి చెందిన 42 ఏళ్ల గృహిణి కనికా అరోరా బిగ్టికెట్ డ్రాలో పాల్గొని 25 మిలియన్ దిర్హామ్స్ గెలుచుకుని ఒక్కసారిగా కోటీశ్వరురాలయ్యారు.
ఇరాన్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యతిరేక నినాదాలు హోరెత్తాయి. టెహ్రాన్లోని గ్రాండ్ మొసల్లా ప్రాంతంలో అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల సందర్భంగా ఓ కళాకారుడు ట్రంప్నకు మరణశిక్ష విధించాలని పిలుపునివ్వడంతో అక్కడి జనం ఆయనకు మద్దతుగా నిలిచారు.
అమెరికా మీడియాలో ప్రచురితమైన ఓ కథనంపై ఇజ్రాయెల్ కౌంటర్ ఇచ్చింది. అవన్నీ ఫేక్ వార్తలని స్పష్టం చేస్తూ ఎక్స్ వేదికగా ఖండించింది.
హోర్ముజ్లో మరోసారి ఉద్రిక్తతలు పెరగడంతో ఆర్టికల్-5 అంశం తెరమీదకు వచ్చింది. ఈ నేపథ్యంలో అసలేంటీ ఆర్టికల్-5? అందులో ఏముంది?
మిసైల్ దాడులు జరిగే అవకాశం ఉందంటూ దుబాయ్ ప్రజల మొబైల్ ఫోన్స్లో శుక్రవారం అకస్మాత్తుగా మెసేజీలు రావడంతో కలకలం రేగింది.
ఇజ్రాయెల్-హెజ్బొల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన కొద్ది గంటల్లోనే దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులకు పాల్పడటం కలకలం రేపుతోంది. పశ్చిమాసియాలో శాంతి వాతావరణం నెలకొనాల్సిన నేపథ్యంలో తాజా ఘటనతో మరోసారి ఉద్రిక్తతలకు దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి.