Home » TTD
Andhrapradesh: జూన్ నెలకు సంబంధించి శ్రీవారి ఆర్జితసేవా టికెట్లు, ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. మార్చి 18వ తేదీ ఉదయం 10 గంటల నుండి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు ఆన్లైన్లో నమోదు చేసుకునే అవకాశాన్ని టీటీడీ కల్పించింది.
Andhrapradesh: తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సోమవారం ఉదయం సమావేశమైంది. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో టీటీడీ పలు నిర్ణయాలు తీసుకుంది. స్విమ్స్ ఆస్పత్రిలో 479 నర్స్ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయం తీసుకుంది.
టీటీడీ గౌరవ మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు (Ramana Deekshitulu) టీటీడీపై అభియోగాలు మోపారనే కారణంతో ఏపీ పోలీసులు నోటీసులు పంపించిన విషయం తెలిసిందే. అయితే నోటిసులపై ఏపీ హైకోర్టు (AP High Court) ను ఆయన ఆశ్రయించారు. తనకు పోలీసులు సీఆర్పీసీ 160 కింద ఇచ్చిన నోటీసులను హైకోర్టులో రమణ దీక్షితులు సవాల్ చేశారు. కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను హైకోర్ట్ ఆదేశించింది.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. ఇవాళ (గురువారం) శ్రీవారి దర్శనం కోసం 6 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. నిన్న (బుధవారం) స్వామివారిని 65,887 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు సమర్పించుకున్నారు.
Andhrapradesh: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. వారాంతంలో అయితే ఆ సంఖ్య మరింత పెరుగుతుంది. శ్రీవారిని దర్శించుకున్న భక్తులు కానుకలను హుండీలో వేసి మొక్కలు చెల్లించుకుంటారు. ఇదిలా ఉండగా ఫిబ్రవరి మాసంలో శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్యను టీటీడీ శనివారం వెల్లడించింది.
Andhrapradesh: తిరుమల ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులుపై టీటీడీ వేటు వేయడంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. నియంత పాలనలో నోరువిప్పడం నేరమే అంటూ విరుచుకుపడ్డారు. తిరుమల ప్రతిష్ఠను దెబ్బతీసే విధంగా వైసీపీ నాయకులు చేస్తున్న అకృత్యాలను బయటపెట్టిన ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులుపై వేటు వేయడం దారుణమన్నారు.
Andhrapradesh: టీటీడీ ఉద్యోగులకు పాలకమండలి శుభవార్త చెప్పింది. టీటీడీలోని వివిధ విభాగాల్లో పని చేస్తున్న 9 వేల అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు సిబ్బంది జీతాలు పెంచుతూ టీటీడీ పాలకమండలి నిర్ణయం తీసుకుంది. సోమవారం ఉదయం టీటీడీ పాలకమండలి సమావేశం జరిగింది. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
Andhrapradesh: తిరుమల ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులుపై టీటీడీ వేటు వేసింది. టీటీడీతో పాటు ఈవో ధర్మారెడ్డిపై రమణ దీక్షితులు సంచలన వ్యాఖ్యలు చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన విషయం తెలిసిందే. దీనిపై టీటీడీ స్పందిస్తూ.. ఆయనపై చర్యలు తీసుకుంది. ఈరోజు (సోమవారం) జరిగిన టీటీడీ పాలకమండలి సమావేశంలో రమణ దీక్షులుపై కీలక నిర్ణయం తీసుకుంది...
Andhrapradesh: టీటీడీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారిన విషయం తెలిసిందే. టీటీడీతో పాటు ఈవో ధర్మారెడ్డిపై రమణ దీక్షితులు సంచలన వ్యాఖ్యలు చేసినట్లు వీడియోలో ఉంది. అయితే ఆ వీడియోపై తాజాగా రమణ దీక్షితులు స్పందించారు. టీటీడీ ఈవోకు లేఖ రాశారు. ఆ వీడియోలో ఉన్నది తన గొంతు కాదని చెప్పుకొచ్చారు.
Andhrapradesh: శ్రీవారి ఆలయంలో మార్పులు చేస్తున్నారంటూ రమణ దీక్షితులు చేసిన వ్యాఖ్యలు బాధాకరమని ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. రమణదీక్షితులు పూర్తి అవాస్తవాలు మాట్లాడారన్నారు. శ్రీవారి ఆలయంలో మార్పులు చేస్తున్నారంటూ అబద్దాలు చెప్పారన్నారు.