Home » TTD
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'శ్రీవారికి చేసిన మహాపాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి మహాపరాధం చేశావు' జగన్ అని ధ్వజమెత్తారు.
శ్రీవారి ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి శ్రీ సుభుదేంద్ర తీర్థ శ్రీపాద స్పందించారు. తిరుమల లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి వినియోగంపై శ్రీ సుభుదేంద్ర స్వామి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
శ్రీవారి ప్రసాదాల నాణ్యతను, పవిత్రతను కాపాడేందుకు టీటీడీ బోర్డు కట్టుబడి ఉందని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయుడు స్పష్టం చేశారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం కోసం నెయ్యి కొనుగోలులో పారదర్శకత, నాణ్యతకు పెద్దపీట వేశామని ఉద్ఘాటించారు.
శాసనమండలిలో వైసీపీ సభ్యుల ఆందోళనపై ఏపీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ మాత్రం సంబంధం లేని అంశాలని సభ దృష్టికి తీసుకొచ్చి.. సభలో పెద్ద డ్రామా సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు..
జగన్ హయాంలో హిందువుల మనోభావాలను దెబ్బతీశారని ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షుడు స్వామి శ్రీనివాసనంద సరస్వతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో స్వామి వారికి 20 కోట్ల కల్తీ లడ్డూలను ప్రసాదంగా సమర్పించారని.. ఇది మహా అపచారమని ఆందోళన వ్యక్తం చేశారు.
తిరుపతిలో శ్రీవారి లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం చేసి వైసీపీ అధినేత వైఎస్ జగన్ మహా పాపానికి ఒడిగట్టాడని ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు.
తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ నెయ్యి వ్యవహారంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసింది. వందలాది కోట్ల రూపాయలు చేతులు మారడంపై ఈడీ విచారణ చేపట్టనుంది..
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు స్వామి శ్రీనివాసానంద సరస్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ హయాంలో లడ్డూని కల్తీ చేశారని ధ్వజమెత్తారు..
అలిపిరి గరుడ సర్కిల్ వద్ద హిందూ ధార్మిక సంఘాలు సోమవారం నిరసనకు దిగాయి. వైసీపీ హయాంలో తిరుమలలో చేసిన పాపాలు ఒప్పుకోవాలంటూ నినాదాలు చేశాయి. టెంకాయలు కొట్టి క్షమించు దేవుడా అంటూ వేడుకున్నాయి..
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల వేంకటేశ్వర స్వామి కల్తీ లడ్డూ విషయంలో మాజీ సీఎం జగన్నే బాధ్యుడిని చేయాలని డిమాండ్ చేశారు.