TTD Responds to Bhoomana: భూమన వ్యాఖ్యలు సరికాదు
ABN , Publish Date - Aug 25 , 2025 | 03:36 AM
తిరుమల తిరుపతి దేవస్థానంపై వైసీపీ నేత భూమన కరుణాకరరెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు సరికాదని టీటీడీ ఆక్షేపించింది.
తిరుమల, ఆగస్టు 24(ఆంధ్రజ్యోతి): తిరుమల తిరుపతి దేవస్థానంపై వైసీపీ నేత భూమన కరుణాకరరెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు సరికాదని టీటీడీ ఆక్షేపించింది. ‘అలిపిరికి 4 కిమీ దూరంలోని టూరిజం భూమిని తీసుకుని 2.5 కిమీ దూరంలోని భూమిని ఏపీ టూరిజానికి బదలాయించడం సరైన పద్ధతి కాదు. అత్యంత విలువైన ఈ స్థలాన్ని టూరిజం శాఖకు ఎందుకు కేటాయించారు?’ అంటూ భూమన ఆదివారం విమర్శలు చేయడంపై టీటీడీ స్పందించింది. ‘గత ప్రభుత్వంలో అలిపిరిలోని పవిత్రమైన భూమిలో 20 ఎకరాలు ఒబెరాయ్ హోటల్కు టూరిజం శాఖ కేటాయించింది. దీనిపై అభ్యంతరాలొచ్చాయి. ఈ నేపథ్యంలో అలిపిరిలో స్వామి పాదాల వద్ద ఉన్న టూరిజం భూమిని టీటీడీకి, అలాగే రోడ్డుకు దక్షిణంగా ఉన్న టీటీడీ భూమిని టూరిజం శాఖకు బదలాయించేందుకు జూలై 22న బోర్డు సమావేశంలో ఆమోదం లభించింది.’ అని టీటీడీ వివరించింది.
ఇవి కూడా చదవండి..
మరాఠా రిజర్వేషన్పై ఆఖరి పోరాటం.. మనోజ్ జారంగే పిలుపు
రాహుల్ ఓటర్ అధికార్ యాత్రలో జోష్.. హాజరుకానున్న ప్రియాంక
For More National News And Telugu News