Home » Trending
అమెరికాలో ఎమ్ఎస్ చేసి వచ్చిన ఓ టెకీ భారత్లో పడుతున్న ఇబ్బందుల తాలూకు పోస్టు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. సదరు టెకీ పరిస్థితిపై అనేక మంది ఆవేదన వ్యక్తం చేశారు. తమకు తోచిన సలహాలు ఇచ్చారు.
మహిళలకు రైల్లో కింది బెర్తు ఇవ్వనందుకు తాను విమర్శల పాలయ్యానంటూ ఓ యువకుడు నెట్టింట పెట్టిన పోస్టు ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. జనాలు మాత్రం అతడికి మద్దతు తెలిపారు. అనవసర త్యాగాలు వద్దని కామెంట్ చేశారు.
ఆస్ట్రేలియాలోని ఓ రెస్టారెంట్ లడ్డూ రూపురేఖలను సమూలంగా మార్చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. గుర్తుపట్టలేనంతగా మారిపోయిన లడ్డూను చూసి జనాలు షాకయిపోతున్నారు. కొందరు ప్రశంసలు కురిపిస్తుంటే మరికొందరు మాత్రం ఇది కరెక్ట్ కాదంటూ పెదవి విరుస్తున్నారు.
హెచ్ఆర్ విభాగంలో జరిగిన ఓ పొరపాటు.. సీఈఓ సహా కంపెనీలోని ఉద్యోగులందరూ వణికిపోయేలా చేసింది. దిక్కుతోచని స్థితిలో పడేలా చేసింది. జరిగిందేంటో తెలిశాక అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఈ ఉదంతం నెట్టింట ట్రెండింగ్లో కొనసాగుతోంది. అసలేం జరిగిందంటే..
ఢిల్లీలో వాయు కాలుష్యం ఏ స్థాయిలో ఉందో కళ్లకు కట్టినట్టు చూపించే ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. విమానంలో వెళుతూ ఢిల్లీ గగనతలాన్ని ఓ ప్రయాణికుడు ఫోన్ కెమెరాతో రికార్డు చేసి నెట్టింట పెట్టాడు. దీన్ని చూసి జనాలు షాకయిపోతున్నారు.
కాలుష్యమయంగా మారిన ఢిల్లీకి వెళ్లేందుకు జనాలు భయపడుతుండటంతో ప్రయాణికులు లేక వెలవెలబోయిన ఢిల్లీ విమానం తాలూకు చిత్రాలు నెట్టింట వైరల్గా మారింది. ఓ మహిళ ఈ ఫొటోలను నెట్టింట పోస్టు చేసింది. ఇది చూసి జనాలు షాకయిపోతున్నారు.
గోవాలో క్యాబ్ ద్వారా ట్యాక్సీ బుక్ చేసుకునే ప్రయత్నంలో ఇద్దరు జర్మనీ టూరిస్టులు ఇక్కట్లు పాలయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఈ ఉదంతంపై జనాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే గోవా టూరిజంపై తీవ్ర ప్రభావం పడుతుందని హెచ్చరించారు.
అమెరికా టెక్ రంగంలో భారతీయులు అకారణంగా జనాగ్రహానికి టార్గెట్ అవుతున్నారంటూ ఓ ఎన్నారై మేనేజర్ పెట్టిన పోస్టు ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఆయన పరిస్థితిపై అనేక మంది సంఘీభావం తెలిపారు.
అమెరికాలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. గంట ఆలస్యంగా కాఫీ సర్వ్ చేశారంటూ రెచ్చిపోయిన ఓ కస్టమర్ మెక్డోనల్డ్స్ మేనేజర్పై వేడి వేడి కాఫీని విసిరికొట్టింది. నిందితురాలిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది.
రాజస్థాన్కు చెందిన ఓ వీధి వ్యాపారికి అదృష్టం ఊహించని విధంగా వరించింది. అప్పు చేసి లాటరీ టిక్కెట్ కొంటే ఏకంగా రూ.11 కోట్లు దక్కాయి.