Home » Trains
అనుకోని విధంగా కొన్ని సందర్భాల్లో ప్రయాణికులు రైలు టికెట్లను క్యాన్సిల్ చేస్తుంటారు. కానీ, రద్దు చేసే ముందు ప్రతిఒక్కరూ రీఫండ్ రూల్స్ గురించి తెలుసుకుంటే మంచిది. ఏసీ, స్లీపర్, తత్కాల్ ఇలా ఒక్కో రకం టికెట్ పై ఒక్కో విధంగా క్యానిలేషన్ ఛార్జీలు, రీఫండ్ లభిస్తాయి.
మెట్రో రైల్లో ఓ యువకుడు డోరు వద్ద నిలబడి ఉన్నాడు. ఎక్కి, దిగే వారికి అడ్డుగా నిలబడుతూ ఇబ్బంది పెడుతున్నాడు. స్టేషన్ రాగానే ఓ వ్యక్తి దిగేందుకు ప్రయత్నించగా.. చేయి అడ్డుపెట్టి అతన్ని దిగకండా చేశాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
నగరాల్లో ట్రాఫిక్ సమస్య తెలిసిందే. రోడ్లు ఎంత విస్తరించినా ట్రాఫిక్ కష్టాలు మాత్రం తీరడం లేదు. అందుకే కొన్ని నగరాల్లో మెట్రో రైలు సర్వీసులు ప్రారంభించారు. అయితే 125 ఏళ్ల క్రితమే జర్మనీలో భిన్నమైన రైలు సర్వీసును ప్రారంభించారు.
ప్రయాణికుల రద్దీ దృష్ట్యా చర్లపల్లి-కాకినాడ నాందేడ్-తిరుపతి మధ్య వీక్లీ స్పెషల్ రైళ్లను పొడిగించినట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.
రాబోయే పండుగ సీజన్కు ముందే మీరు ఇంటికి వెళ్లాలని ఆలోచిస్తున్నారా? భారత రైల్వే మీ కోసం అద్భుతమైన ప్లాన్ తీసుకొచ్చింది. మీ ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా, చౌకగా మారుస్తూ, రైల్వే ప్రత్యేకంగా రౌండ్ ట్రిప్ ప్యాకేజీ స్కీమ్ను ప్రకటించింది.
భారత రైల్వే శాఖ సరికొత్త చరిత్ర సృష్టించింది.తూర్పు మధ్య రైల్వేకు చెందిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ డివిజన్ (DDU డివిజన్) నుంచి దేశంలోనే అతి పొడవైన సరుకు రవాణా రైలు ‘రుద్రాస్త్ర’ను విజయవంతంగా నడిపి కొత్త రికార్డు నెలకొల్పింది. 354 వ్యాగన్లు.. 7 ఇంజిన్లు ఉన్న ఈ గూడ్స్ రైలు పొడువు ఏకంగా 4.5 కి.మీ. ఆసియాలోనే అత్యంత పొడవైన ఈ రైలు గురించి మరిన్ని విశేషాలు..
భారతీయ రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్ ప్రకటించింది. రైల్వేల కొత్త నియమం ప్రకారం, ఇకపై ఎవరూ టికెట్ బుకింగ్ కాలేదని చింతించాల్సిన పనిలేదు. ఇకపై ప్రయాణికులు రైల్వే స్టేషన్ చేరుకోవడానికి 15 నిమిషాల ముందే టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు.
ప్రయాణికుల రద్దీని నియంత్రించడానికి సికింద్రాబాదు- మైసూర్-సికింద్రాబాద్ (వయా గుంతకల్లు) ప్రత్యేక బైవీక్లీ ఎక్స్ప్రెస్ను నడపనున్నట్లు రైల్వే అధికారులు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. సికింద్రాబాదు-మైసూర్ బైవీక్లీ ప్రత్యేక రైలు (07033) ఈ నెల 8 నుంచి 29 వరకూ సోమ, శుక్రవారాలలో నడపనున్నారు.
ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి గుంతకల్లు రైల్వే డివిజన్ మీదుగా రెండు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. బెంగళూరు-బీదర్ (06519) ప్రత్యేకరైలు ఈ నెల 14న బెంగళూరులో రాత్రి 9-15 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం పదకొండున్నరకు బీదర్కు చేరుకుంటుందన్నారు.
తమిళనాడులోని నాగపట్టణంలో వెలసిన వెలంకని ఆరోగ్యమాత ఉత్సవాలను పురస్కరించుకుని గుంతకల్లు మీదుగా ప్రత్యేక రైలును నడపనున్నట్లు రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. బాంద్రా టెర్మిన్స-వెలంకని ప్రత్యేక రైలు (09093) ఈ నెల 27, సెప్టెంబరు ఆరో తేదీల్లో రాత్రి 9-40 గంటలకు బాంద్రా టెర్మిన్సలో బయలుదేరి రెండో రోజు ఉదయం 7-40 గంటలకు వెలంకనికి చేరుకుంటుందన్నారు.