Home » Trains
జార్ఖండ్ సాహిబ్గంజ్ జిల్లాలోని పాట్నా ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. లాల్మాటియా-ఫరక్కా ఎంజీఆర్ రైల్వే లైన్లో గూడ్స్ రైలు వెళ్తుండగా 13, 14 ఏళ్ల లోపు ఉన్న దొంగలంతా అందులోకి ఎక్కేశారు. చివరికి ఏం జరిగిందో మీరే చూడండి..
ప్రయాణికుల రద్దీ, దసరా, దీపావళి పండుగలను పురస్కరించుకుని ప్రత్యేక వీక్లీ రైళ్లను నడపనున్నట్టు రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. చర్లపల్లి-తిరుపతి (07011) ప్రత్యేక వీక్లీ రైలు సెప్టెంబరు 5 నుంచి 26 వరకూ శుక్రవారాలలో, దీని తిరుగు ప్రయాణపు రైలు (07012) సెప్టెంబరు 6 నుంచి 27 వరకూ శనివారాలలో నడపనున్నట్లు తెలియజేశారు.
దక్షిణమధ్యరైల్వే పరిధిలోని వివిధ మార్గాల్లో నడుస్తున్న ప్యాసింజర్ రైళ్ల నంబర్లలో మార్పులు చోటుచేసుకోనున్నాయి. అలాగే, కొన్ని ప్యాసింజర్ రైళ్లకు ప్రస్తుతం ఉన్న ఐసీఎ్ఫ(ఇండియన్ కోచ్ ఫ్యాక్టరీ) కోచ్ల స్థానంలో డెమో, మెమూ కోచ్లను ఏర్పాటు చేయాలని రైల్వే ఉన్నతాధికారులు నిర్ణయించారు.
అయోధ్య-కాశీ పుణ్యక్షేత్ర యాత్ర కోసం ఐఆర్సీటీసీ ఆధ్వర్యంలో భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలును నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ రైలు సెప్టెంబరు 9న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఉదయం 11 గంటలకు ప్రారంభం అవుతుందని సీపీఆర్ఓ శ్రీధర్ తెలిపారు.
మహారాష్ట్రలో కురుస్తోన్న భారీ వర్షాల ప్రభావం హైదరాబాద్ నుంచి బయల్దేరే పలు రైళ్ల రాకపోకలపై పడింది. ముంబై నుంచి హైదరాబాద్కు రావాల్సిన హుస్సేన్సాగర్ ఎక్స్ప్రెస్ 10 గంటలు ఆలస్యంగా వచ్చింది.
నగరం నుంచి హిందూపూర్ వెళ్లే ప్రయాణికులకు శుభావార్త చెప్పారు కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి వి.సోమన్న. కాచిగూడ రైల్వేస్టేషన్ నుంచి యశ్వంత్పూర్కు వెళ్లే వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు (20703) హిందూపూర్లో ఆగుతుందని(హాల్టింగ్) ట్విట్టర్లో పేర్కొన్నారు.
దీపావళి పండుగ రద్దీని నివారించే నిమిత్తం నడిపే ప్రత్యేక రైళ్లలో ప్రయాణించేందుకు ముందస్తు రిజర్వేషన్ టిక్కెట్లు బుకింగ్స్ సోమవారం ప్రారంభమైంది. ఆన్లైన్లో బుకింగ్ విండో ప్రారంభించగానే కేవలం ఐదు నిమిషాల్లోనే ఆ టిక్కెట్లన్నీ హాట్ కేకుల్లా ఫుల్ అయ్యాయి.
చర్లపల్లి నుంచి చెన్నై వెళ్లే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్(12604)కు నాయుడుపేట్లో అదనపు స్టాపేజీ కల్పించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈరోజు నుంచి నాయుడుపేట్ రైల్వే స్టేషన్లో రెండు నిమిషాల పాటు రైలు ఆగుతుందని (హాల్టింగ్) దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.
ఓ మెట్రో రైల్లోప్రయాణికులు రద్దీగా ఉంటారు. ఈ సమయంలో వారి మధ్యలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. నిలబడి ఉన్న ఓ యువకుడు పొరపాటున అదుపుతప్పి తూలి పక్కన ఉన్న యువతిపై పడ్డాడు. దీంతో ఆమె అతడి చెంప చెల్లుమనిపిస్తుంది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
హైదరాబాద్ నగరవాసులకు చల్లని కబురు వినిపించారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ట్రాఫిక్ సమస్యలతో సతమతమవుతున్న ప్రజలకు ఊరటనిచ్చే వార్త వెల్లడించారు. మెట్రోలో ప్రయాణికుల సంఖ్య నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో.. సిటీలో నడిచే ఎంఎంటీఎస్ రైళ్లను పూర్తి ఏసీ కోచ్లుగా మార్చనున్నట్లు ప్రకటించారు.