Share News

South Central Railway: వేర్వేరు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు

ABN , Publish Date - Oct 24 , 2025 | 07:50 AM

పండగల సందర్భంగా ప్రయాణికుల డిమాండ్‌ మేరకు వేర్వేరు ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లను నడుపడానికి ఏర్పాట్లు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. అక్టోబరు 25న చర్లపల్లి- బరౌని (07093), 27న బరౌని- చర్లపల్లి (07094) ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు అధికారులు పేర్కొన్నారు.

South Central Railway: వేర్వేరు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు

- దక్షిణ మధ్య రైల్వే

హైదరాబాద్‌: పండగల సందర్భంగా ప్రయాణికుల డిమాండ్‌ మేరకు వేర్వేరు ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లను నడుపడానికి ఏర్పాట్లు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) అధికారులు తెలిపారు. అక్టోబరు 25న చర్లపల్లి- బరౌని(Cherlapalli- Barauni) (07093), 27న బరౌని- చర్లపల్లి (07094) ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు అధికారులు పేర్కొన్నారు. ఈ రైళ్లు వచ్చి వెళ్లేప్పుడు జనగామ, కాజీపేట్‌, పెద్దపల్లి, మంచిర్యాల్‌, సిర్పూర్‌ కాగజ్‌నగర్‌(Jangaon, Kazipet, Peddapalli, Mancherial, Sirpur Kagaznagar),


city3.2.jpg

బల్లార్షా, చందాపోస్ట్‌, గోండియా, దుర్గ్‌, రాయ్‌పూర్‌, బిలాస్‏పూర్‌(Raipur, Bilaspur), ఝర్సుగూడ, రూర్కెలా, రాంచీ, మూరి, బొకారో స్టీల్‌ సిటీ, ధన్‌బాద్‌, చిత్తరంజన్‌, మధుపూర్‌ స్టేషన్‌లలో ఆగుతాయని తెలిపారు. అలాగే అక్టోబరు 24న పోదనూర్‌ జంక్షన్‌- బరౌని జంక్షన్‌ (06187), 25న పోదనూర్‌ జంక్షన్‌- బరౌని జంక్షన్‌ (06193), 26న బరౌని- ఎర్నాకులం జంక్షన్‌( దక్షిణం)(06184), 27న బరౌని జంక్షన్‌ - పోదనూర్‌ జంక్షన్‌ (06188), 28న బరౌని జంక్షన్‌ - పోదనూర్‌ జంక్షన్‌(06194)ల మధ్య ప్రత్యేక రైళ్లు నడుస్తాయని రైల్వే అధికారులు మరో ప్రకటనలో పేర్కొన్నారు.


city3,3.jpg

ఈ వార్తలు కూడా చదవండి..

మద్యం దరఖాస్తులతో 2,863 కోట్ల ఆదాయం

విమానాల్లో పవర్‌ బ్యాంకులపై నిషేధం

Read Latest Telangana News and National News

Updated Date - Oct 24 , 2025 | 07:50 AM