Home » Mancherial
మంచిర్యాలలో సింగరేణి డిపెండెంట్ కార్మికులకు నియామక పత్రాల పంపిణీ కార్యక్రమం జరిగింది. 335 మంది డిపెండెంట్ కార్మికులకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నియామక పత్రాలను అందజేశారు.
సింగరేణిలో చిట్టాపద్దులపై చిచ్చు రేగుతోంది. 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైందన్న బీఆర్ఎస్ ఆరోపణలు ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
వేసవి రద్దీ నేపథ్యంలో ఎలహంక -బిలాస్పూర్ మార్గంలో 10 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది.
మద్యం తాగారని ఆరోపిస్తూ పలువురు ఆర్టీసీ డ్రైవర్లను అధికారులు విధుల్లోకి తీసుకోలేదు. అందుకు నిరసనగా సోమవారం మంచిర్యాల ఆర్టీసీ డిపో ఎదుట కుటుంబ సభ్యులతో కలిసి డ్రైవర్లు ధర్నాకు దిగారు.
అప్పు ఇవ్వలేదన్న కోపంతో ఓ వ్యక్తి ఘాతుకానికి ఒడిగట్టాడు. దంపతులపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో భర్త చనిపోగా.. భార్య పరిస్థితి విషమంగా ఉంది.
ఉమ్మడి రాష్ట్రంలో సీఎంలు అయిన వారిలో ఎంతోమంది జైలుకు వెళ్లారని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ఒకరిద్దరు జైలుకు వెళ్లొచ్చి సీఎంలు అయినంత మాత్రాన... మళ్లీ అలా జరుగుతుందని అనుకోవడం పొరపాటని చెప్పారు.
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ ఆదిలాబాద్ జైలు నుంచి విడుదలయ్యారు. క్యాతనపల్లి మున్సిపాలిటీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికల సందర్భంగా జరిగిన ఘర్షణ కేసులో ఫిబ్రవరి 18న సుమన్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.
వివాహ బంధంతో ఓ అమెరికా అమ్మాయి, తెలంగాణ అబ్బాయి ఒక్కటయ్యారు. మంచిర్యాల జిల్లా నస్పూర్ కి చెందిన ప్రణీత్.. అమెరికాకు చెందిన లవినశ్రీతో వివాహం జరిగింది.
మంత్రి వివేక్పై మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సంఖ్యాబలం లేకున్నా క్యాతనపల్లి మున్సిపల్ చైర్మన్ పదవిని కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ యత్నిస్తోందని మండిపడ్డారు.
మేడారం మహాజాతరకు వెళ్లే భక్తుల కోసం రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లను ఏర్పాటుచేసింది. ఈమేరకు దక్షిణమధ్య రైల్వే ఓ ప్రకటనను విడుదల చేసింది. సికింద్రాబాద్, మంచిర్యాల్, సిరిపూర్కాగజ్నగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం నుంచి వరంగల్, కాజీపేటల వరకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటుచేశారు.