Home » TMC
టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ఎవరికీ గౌరవం ఇవ్వడం లేదని, ఆయన కావాలో, తాను కావాలో తేల్చుకోండంటూ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి అల్టిమేటం ఇచ్చిన ఆ పార్టీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ శనివారంనాడు యూటర్న్ తీసుకున్నారు. అభిషేక్ను తన కొడుకుతో సమానమని అన్నారు.
టీఎంసీలో రాజకీయ సంక్షోభం మరింత ముదురుతోంది. ఆ పార్టీకి చెందిన రెబల్ ఎంపీలంతా తమనే అసలైన టీఎంసీగా పరిగణించాలని కోరుతూ స్పీకర్ను కోరేందుకు సిద్ధమౌతున్నారు. దీనిపై పార్టీ అధిష్ఠానం ఆగ్రహం వ్యక్తం చేస్తూ చర్యలకు ఉపక్రమించే దిశగా చర్యలు చేపడుతున్నట్టు తెలుస్తోంది.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం తర్వాత తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర అంతర్గత సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. పార్టీ ఉనికికే ముప్పు వాటిల్లుతున్న తరుణంలో, అసన్సోల్ టీఎమ్సీ ఎంపీ, సీనియర్ నటుడు శత్రుఘ్న సిన్హా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.
తృణమూల్ కాంగ్రెస్లో తలెత్తిన సంక్షోభం పతాక స్థాయికి చేరుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. పార్టీ అధినాయకత్వంపై అసంతృప్తితో రగులుతున్న తిరుగుబాటు ఎంపీలు తమదే 'నిజమైన టీఎంసీ' పార్లమెంటరీ గ్రూప్ అని క్లెయిమ్ చేసుకునేందుకు సన్నద్ధమవుతున్నారు.
టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి వ్యతిరేకంగా పార్టీకి చెందిన 19 మంది లోక్సభ ఎంపీలు తిరుగుబాటు బావుటా ఎగరేసినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
టీఎంసీ తిరుగుబాటు ఎంపీల జాబితాలో తన పేరుందన్న వార్తలను శత్రుఘ్న సిన్హా ఖండించారు. తమ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి వ్యతిరేకంగా తాను తిరుగుబాటు చేయబోనని ఆయన స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పార్టీలో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) విలీనం కానుందంటూ ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ స్పందించారు.
తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. సీనియర్ నేతలు పార్టీని వీడుతున్నారు. రాజీనామాల పరంపర కొనసాగుతోంది.
టీఎంసీలో చెలరేగిన కల్లోలం పార్లమెంటుకు చేరడం, టీఎంసీ తిరుగుబాటు ఎంపీలు ఇటీవల లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ ఇవ్వడం సంచలనమైంది. ఈ లేఖపై 19 మందికి పైగా సంతకాలు చేశారని, వారిలో యూసఫ్ పఠాన్, సయోని ఘోష్, శత్రుఘ్నసిన్హా తదితరులు ఉన్నారని పార్టీ వర్గాల సమాచారం.
తృణమూల్ కాంగ్రెస్లో తలెత్తిన సంక్షోభం మరింత ముదురుతోంది. జాదవ్పూర్ లోక్సభ ఎంపీ సాయోని ఘోష్, కోల్కతా దక్షిణ్ ఎంపీ మాలా రాయ్లు కకోలి ఘోష్ దస్తిదార్ సారథ్యంలోని తిరుగుబాటు ఎంపీల గ్రూపులో చేరనున్నట్టు తెలుస్తోంది.