Home » Tirupati
మానవత్వమే సిగ్గుపడే దృశ్యం ఇది. తిరుపతి రుయా ఆసుపత్రికి ఎదురుగా ఇస్కాన్ రోడ్డులోని బస్టా్పలో బతికున్న శవాల్లా పడివున్నారు వీరంతా. ఎవరో తెలీదు. ఎక్కడి నుంచి ఎలా వచ్చారో తెలీదు. ఎప్పుడొచ్చి ఈ నీడకు చేరారో ఏమో.. మూలుగుతూ ముక్కుతూ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు.
తిరుపతిలో ఇటీవల చైన్ స్నాచింగ్లు, దొంగతనాలకు పాల్పడేది కర్ణాటక గ్యాంగ్ అని పోలీసులు గుర్తించారు. వీరు నగరాన్ని షెల్టర్ జోన్గా చేసుకుని చైన్ స్నాచింగ్ల నుంచి ద్విచక్ర వాహనాలు చోరీ చేయడం, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో మహిళలు, వృద్ధుల బ్యాగులు ఎత్తుకెళ్లి ఆభరణాలు, నగదు కొట్టేస్తున్నారని తెలిసింది.
తిరుపతిలో రౌడీ కల్చర్ కోరలు చాచింది. ఓ రౌడీ మద్యం మత్తులో కత్తితో వీరంగం చేస్తూ నడిరోడ్డుపై సోమవారం జనాలను భయభ్రాంతులకు గురిచేశాడు. ఇతడితోపాటు ప్రత్యర్థినీ పోలీసులు అదుపులోకి తీసుకుని వీధిలో నడిపించుకుంటూ తీసుకెళ్లారు.
అప్రమత్తమైన పోలీసులు తిరుపతిలో ఆర్టీసీ బస్టాండ్, శ్రీనివాసం, విష్ణు నివాసం, కపిలతీర్థం, గోవిందరాజుల స్వామి ఆలయం ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. జడ్జిల నివాస సముదాయం, కోర్టు ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు.
తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 24 నుంచి కొనసాగుతూ, ఈరోజు ముగింపు దశకు చేరుకున్నాయి. తొమ్మిది రోజులుగా అంగరంగ వైభవోపేతంగా సాగుతున్న ఉత్సవాల్లో లక్షలాది భక్తులు..
దూకేస్తా.. ఆత్మహత్య చేసుకుంటా.. అంటూ విద్యుత్ టవర్ ఎక్కి హల్చల్ చేసిన కర్ణాటక యువకుడి ఉదంతం విషాదంగా మారింది.
అర్ధరాత్రి రెండు గంటల నుంచి టవర్ పైనే ఉంటూ హల్చల్ చేస్తున్నాడు. వెంటనే గుర్తించిన గ్రామస్తులు అతడిని కిందకు దిగాల్సిందిగా కోరారు. వారి ప్రయత్నాలు ఫలించలేదు.
మొత్తం ఆరుగురు సీనియర్ విద్యార్థులు ఈ దారుణానికి పాల్పడ్డారు. దాడి చేయడంతో పాటు ఈ విషయాన్ని బయటకు చెప్తే చంపేస్తాం అంటూ బెదిరింపులకు దిగారు.
తిరుమల బ్రహ్మోత్సవాలకు తమిళనాడు రాష్ట్రం నుంచి వెళ్లే భక్తుల సౌకర్యార్ధం పలు నగరాల నుంచి ప్రత్యేక బస్సులు నడుపనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎక్స్ప్రెస్ రవాణా సంస్థ (ఎస్ఈటీసీ) విడుదల చేసిన ప్రకటనలో... తిరుమల బ్రహ్మోత్సవాలు అక్టోబరు 2వ తేది వరకు జరుగనున్నాయి.
మహాలయ అమావాస్య నేపథ్యంలో తిరుపతి సమీపంలోని కపిల తీర్థానికి భక్తులు భారీగా పోటెత్తారు.