Home » Tirupati
జనాభా ప్రాతిపదికన స్థానిక సంస్థల పునర్విభజనకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో డివిజన్ల సంఖ్య పెరగనుంది.
ఎర్రచందనం అక్రమ రవాణాకు ముకుతాడు వేయాల్సిన యంత్రాంగంలోనే కొందరు కోవర్టులున్నారని ఆ శాఖ అధికారులు అనుమానిస్తున్నారు.
ఆటోమొబైల్ రంగంలో నూనత ఆవిష్కరణలకు వేదికగా నిలిచే ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఆటో ఎక్స్పో నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. శని, ఆదివారాల్లో తిరుపతిలోని ఇందిరామైదానం వేదికగా నిర్వహించనున్న ఎక్స్పోను శనివారం ఉదయం 10 గంటలకు జిల్లా రవాణాశాఖ అధికారి కె.మురళీమోహన్ ప్రారంభించనున్నారు.
తిరుపతి జిల్లా నాయుడుపేట మండల పరిధి పండ్లూరు ఫంక్షన్ హాల్లో గత నెల 20న నిశ్చితార్థ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన మహిళ వడ్డానం చోరీకి గురైంది. అయితే 21 రోజుల తర్వాత షాకింగ్ ఘటన చోటు చేసుకుంది..
కాలుష్య నివారణ చర్యల్లో భాగంగా జిల్లాకు 350ఎలక్ట్రిక్ బస్సులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించాయి.
దాదాపు మూడు దశాబ్దాలుగా ప్రయాణికులకు సేవలందిస్తూ వచ్చిన ఎనిమిది పసుపురైళ్ల స్థానంలో సరికొత్త ‘ఎర్రరైళ్లు’ ఈ నెల్లోనే పట్టాలెక్కనున్నాయి.
మంద నుంచి వేరుపడిన రెండు ఏనుగులు.. పంట పొలాలవైపు అడుగులేశాయి. మామిడితోటలో అంతరపంటగా సాగు చేసిన వేరుశనగ పంటలోకి వెళ్లే క్రమంలో, పొలంచుట్టూ లాగిన విద్యుత్తు తీగలు తగిలి మృతిచెందాయి.
విద్యాబోధనలో వస్తున్న విప్లవాత్మకమైన మార్పులను విద్యార్థులకు అందించేందుకు టీటీడీ చర్యలు చేపట్టింది. విద్యాసంస్థల్లో ప్రస్తుతం ఉన్న తరగతి గదులను డిజిటల్ తరగతి గదులుగా మార్చేందుకు సిద్ధమవుతోంది. ఇందుకోసం రానున్న బడ్జెట్లో రూ.118.89 కోట్లు పొందుపర్చింది.
తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరాకు సంబంధించిన కీలకమైన డిజిటల్ రికార్డులను ధ్వంసం చేశారని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇతర రికార్డులను తారుమారు చేశారని కూడా తెలిపింది.
పాతికేళ్ల కిందట వరకు అప్పటి రద్దీకి తగ్గట్టుగా తిరుపతి మీదుగా 20 రైళ్లు రాకపోకలు సాగించేవి. తర్వాత తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులు సామాన్య ప్రయాణికుల సంఖ్య అమాంతంగా పెరిగింది. ఈ రద్దీకి అనుగుణంగా రైళ్ల సంఖ్య పెంచాల్సి వచ్చింది.