Home » Tirupati
టీటీడీలో ఇటీవల వెలుగుచూసిన పట్టువస్త్రం స్కామ్పై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. నకిలీ పట్టు దుపట్టాకు సంబంధించి రూ.54 కోట్ల మోసం బయటపడిందని మీడియా వేదికగా వెల్లడించారాయన.
ఓ అంధ విద్యార్థి స్కేటింగ్లో అత్యంత ప్రతిభ కనబరిచి పలువురి చేత ప్రశంసలందుకుంటున్నాడు. 20.30 గంటల్లో 203 కిలోమీటర్లు స్కేటింగ్ చేశాడు. కంటి చూపు లేకపోయినా అత్యంత ప్రతిభ కనబరిచిన అతడిని పలువురు అభినందిస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి.
తిరుపతి నుంచి సాయినగర్ షిర్డీకి వీక్లీ రైలును రైల్వేశాఖ ఏర్పాటు చేసింది. ఈ రెండు ఆధ్యాత్మిక క్షేత్రాల మధ్య వీక్లీ రైలు ఏర్పాటుచేయడం వల్ల భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈరైలు మంగళవారం నుంచి ప్రారంభమైంది.
తిరుపతిలోని ఓ ప్రైవేటు కాలేజ్ భవనంపై నుంచి పడి విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విద్యార్థికి చికిత్స కొనసాగుతోంది.
తిరుపతి జాతీయ సంస్కృత యూనివర్సిటీలో ఓ విద్యార్థినిపై జరిగిన లైంగిక దాడి కేసులో ఇద్దరు ప్రొఫెసర్లను అరెస్ట్ చేశారు పోలీసులు. అంతకముందు.. ఒడిశాలో బాధితురాలిని విచారించిన అనంతరం ఈ చర్యలు చేపట్టారు.
తిరుపతిలో ఫుడ్ కోర్ట్కు ఏర్పాటుకు మార్గం సుగుమం అయింది. మొత్తం ఈ ఫుడ్ కోర్ట్లో 40 నుంచి 50 స్టాళ్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. దీన్ని వీలైనంత తొందరగా నిర్మింపజేసి భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఏర్పట్లు చేస్తున్నారు. నిత్యం వేల సంఖ్యలో భక్తలు తిరుపతికి విచ్చేస్తుంటారు.
తిరుపతిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తిరుచానూరు అమ్మవారి ఆలయ పోటు వర్కర్లు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొనడంతో ప్రమాదం జరిగింది.
మత్తు మహమ్మారి నియంత్రణ, నిర్మూలనను కూటమి ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. దీంతో వైసీపీ పాలనలో బీజం పడిన గంజాయి సరఫరా, విక్రయాలు, వినియోగంపై పోలీసులు నిఘా పెంచారు. ఇందులో భాగంగా ఇటీవల మదనపల్లె ఏరియాలో దాడులు నిర్వహించి, సుమారు వంద మందిని పట్టుకోవడంతో చర్చనీయాంశమైంది. విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచే కాకుండా సరిహద్దు ప్రాంతమైన ఒరిస్సా నుంచి గంజాయి దిగుమతి అవుతోంది. తిరుపతి కేంద్రంగా మదనపల్లెకు సరఫరా చేస్తుండగా, ఇక్కడి నుంచి తంబళ్లపల్లె, పీలేరు, పుంగనూరు ఏరియాలకు ఈ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
చర్లపల్లి రైల్వేస్టేషన్ నుంచి తిరుపతి, నర్సాపూర్కు ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే ఏర్పాటు చేసింది. ఈ నెల 6వ తేదీ రాత్రి 9.35 గంటలకు, అలాగే 26వ తేదీ రాత్రి 10.40 గంటలకు ఈ ప్రత్యేక రైళ్లు బయలుదేరతాయని రైల్వేశాఖ తెలిపింది.
దిత్వా తుఫాను వానలతో తిరుమలలోని జలాశయాలు పొంగి పొర్లుతున్నాయి. అక్టోబరులో కురిసిన వర్షాలకే తిరుమలలోని పాపవినాశనం, గోగర్భం, ఆకాశగంగ, కుమారధార, పుసుపుధార డ్యాములు 98 శాతం నిండిపోయాయి.