Home » Tirupati
వైసీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి తిరుపతి ఎస్వీ వర్సిటీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 23న ఉదయం 11 గంటలకు విచారణ హాజరుకావాలని అందులో పేర్కొన్నారు.
చిరుతలను పట్టేందుకు అటవీ శాఖ అధికారులు ఇప్పటికే ఐదు బోన్లు ఏర్పాటు చేశారు. రాత్రి పూట విద్యార్థులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
షెడ్యూల్ ప్రకారం జరగని కౌన్సెలింగ్తో గంటలకొద్దీ నిరీక్షిస్తూ కొత్త టీచర్లు ఇబ్బంది పడ్డారు. ఇందులో విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యమూ కనిపిస్తోంది.
ద్విచక్ర వాహనంపై అతివేగంతో వచ్చిన ఇద్దరు యువకులు.. అదుపు తప్పి తిరుపతిలోని గరుడ వారధిపై నుంచి పడి దుర్మరణం చెందారు.
తిరుపతి నుంచి చెన్నై సెంట్రల్కు బయల్దేరే రైలు, తిరుపతికి బదులు తిరుచానూరు నుంచి బయల్దేరనుంది. ఈ మేరకు దక్షిణ రైల్వే విడుదల చేసిన ప్రకటనలో... మరమ్మతు పనుల కారణంగా చెన్నై సెంట్రల్ నుంచి తిరుపతికి వెళ్లే అన్ రిజర్వ్డ్ రైళ్ల సేవలో మార్పులు చోటుచేసుకున్నాయని తెలిపింది.
తిరుపతి జిల్లా రేణిగుంలో చైనా దేశస్థుడి ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. స్థానికంగా ఉంటున్న డ్యూయాంగన్ అనే చైనా దేశస్థుడి ఇంట్లో ఈడీ అధికారులు బుధవారం సోదాలు చేశారు. ఇతడిపై గతంలో వీసా ఉల్లంఘన కేసు నమోదైందని, ప్రస్తుతం ఇతను బెయిల్పై ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
మానవత్వమే సిగ్గుపడే దృశ్యం ఇది. తిరుపతి రుయా ఆసుపత్రికి ఎదురుగా ఇస్కాన్ రోడ్డులోని బస్టా్పలో బతికున్న శవాల్లా పడివున్నారు వీరంతా. ఎవరో తెలీదు. ఎక్కడి నుంచి ఎలా వచ్చారో తెలీదు. ఎప్పుడొచ్చి ఈ నీడకు చేరారో ఏమో.. మూలుగుతూ ముక్కుతూ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు.
తిరుపతిలో ఇటీవల చైన్ స్నాచింగ్లు, దొంగతనాలకు పాల్పడేది కర్ణాటక గ్యాంగ్ అని పోలీసులు గుర్తించారు. వీరు నగరాన్ని షెల్టర్ జోన్గా చేసుకుని చైన్ స్నాచింగ్ల నుంచి ద్విచక్ర వాహనాలు చోరీ చేయడం, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో మహిళలు, వృద్ధుల బ్యాగులు ఎత్తుకెళ్లి ఆభరణాలు, నగదు కొట్టేస్తున్నారని తెలిసింది.
తిరుపతిలో రౌడీ కల్చర్ కోరలు చాచింది. ఓ రౌడీ మద్యం మత్తులో కత్తితో వీరంగం చేస్తూ నడిరోడ్డుపై సోమవారం జనాలను భయభ్రాంతులకు గురిచేశాడు. ఇతడితోపాటు ప్రత్యర్థినీ పోలీసులు అదుపులోకి తీసుకుని వీధిలో నడిపించుకుంటూ తీసుకెళ్లారు.
అప్రమత్తమైన పోలీసులు తిరుపతిలో ఆర్టీసీ బస్టాండ్, శ్రీనివాసం, విష్ణు నివాసం, కపిలతీర్థం, గోవిందరాజుల స్వామి ఆలయం ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. జడ్జిల నివాస సముదాయం, కోర్టు ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు.