Home » Tirupathi News
శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ పరిసరాల్లో చిరుతపులి సంచరిచినట్లు గుర్తించారు. యూనివర్సిటీలోని యూనియన్ బ్యాంక్ వద్ద గత ఐదురోజులక్రితం చిరుత సంచరించిన విషయం అక్కడి సీసీ కెమెరాల్లో నమోదైంది. అంతేగాక అక్కడి పరిసరాల్లో ఓ జింకను కూడా వేటాడినట్లు గుర్తించారు.
విద్యుత్ ఛార్జీలపై ఏపీ ఈఆర్సీ చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణకు ప్రజల భాగస్వామ్యం లేకుండా పోయింది. వినియోగదారులు, రైతులు, వ్యాపార వర్గాలు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో సమావేశం వెలవెలపోయింది.
కొందరికి మాట పెగలడం కష్టమైపోతోంది. సైగలతో సరిపెడుతున్నారు. ఇంకొందరు మళ్లీ మాట్లాడతామంటూ వెళ్లిపోతున్నారు. సెల్ఫోన్లలో చాటింగ్కు ప్రాధాన్యమిస్తున్నారు. ఇదంతా ఎందుకంటే.. వాళ్ల గొంతులన్నీ బొంగురుపోయాయి.
ప్రభుత్వ రాయితీలతో (వైద్య విద్య) పీజీ పూర్తిచేసిన వారు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజాసేవ చేయాలని సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ చైర్మన్ తోట త్రిమూర్తులు స్పష్టంచేశారు.
రాష్ట్రం, దేశంలో హిందుత్వాన్ని అణగతొక్కాలని జగన్ కుట్ర చేస్తున్నారని కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ షాకింగ్ కామెంట్స్ చేశారు. జగన్ అండ్ కో.. హిందూ ధార్మిక సంస్థలపై దాడికి కుట్ర చేస్తూ అలజడికి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు..
మూడు రోజులపాటు నిర్వహించే పక్షుల పండుగ శనివారం సూళ్లూరుపేటలో అట్టహాసంగా ప్రారంభమైంది.
చట్టపరమైన మార్గాల్లో పౌరహక్కుల పోరాటం కొనసాగిస్తామని తిరుపతిలో శనివారం మొదలైన పౌరహక్కుల సంఘం 20 రాష్ట్ర మహాసభల్లో వక్తలు ప్రకటించారు.
ఏర్పేడు మండల పరిధిలోని స్వర్ణముఖి నది నుంచి యథేచ్ఛగా ఇసుక తరలిపోతోంది. ఫలితంగా భూగర్భ జలాలు అడుగంటడంతోపాటు నదిలో పెద్దపెద్ద గుంతలు ఏర్పడుతున్నాయి.
తిరుమల తిరుపతి దేవస్థానం శుక్రవారం వేకువ జామున శ్రీవారి ఆలయంలోని పవిత్రమైన వైకుంఠ ద్వారాలను అధికారికంగా మూసేసింది. ప్రతి ఏడాది వైకుంఠ ఏకాదశి సందర్భంగా మాత్రమే ఈ ద్వారాలు తెరుచుకుంటాయి. ఈ దర్శనం భక్తులకు అత్యంత విశిష్టమైన ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తుంది. ఈ ఏడాది కూడా లక్షలాది మంది భక్తులు ఈ అపూర్వ దర్శనానికి తరలివచ్చారు.
తిరుపతి కొర్లగుంట మారుతీనగర్ ప్రాంతంలో చోటుచేసుకున్న విషాదకర ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఓ మహిళని హత్య చేసిన అనంతరం నిందితుడు కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.