Home » Tirupathi News
టీటీడీ చేపట్టిన వేదపారాయణ పోస్టుల ఇంటర్వ్యూల్లో తొలిరోజే వివాదం మొదలైంది. 700 పోస్టులకుగాను తిరుపతిలోని శ్వేతలో సోమవారం మొదలైన ఇంటర్వ్యూలు 16వ తేదీ వరకు జరగనున్నాయి.
ఒడిశా నుంచి తిరుపతి మీదుగా తమిళనాడుకు తరలిస్తున్న 32 కిలోల గంజాయిని చంద్రగిరి పోలీసులు పట్టుకున్నారు. నిందితుడు పొన్నుస్వామి సెల్వరాజ్ను అరెస్టు చేశారు.
తిరుమలలో కొంతమంది ప్రజాప్రతినిధుల పీఆర్వోలు అధిక ధరలకు వీఐపీ బ్రేక్ దర్శనాలను అమ్ముకుంటున్నారని ఈశ్వర్(అనంతపురం) అనే భక్తుడు ఈవో అనిల్కుమార్ సింఘాల్కు ఫిర్యాదు చేశారు. డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో శుక్రవారం పలువురు భక్తులు ఈవోతో ఫోన్లో సంభాషించారు.
తిరుపతి లో గురువారం అర్ధరాత్రి గంజాయి బ్యాచ్ వీరంగం చేసింది. సింగాలగుంటలో దాదాపు ఐదారు గంటల పాటు ఆరుగురు యువకులు, విద్యార్థులు హల్చల్ చేశారు. కనకభూషణ లేఅవుట్లో ఆరు కార్లు అద్దాలు ధ్వంసం చేశారు. పక్కనే వున్న విద్యుత్ శాఖ సబ్స్టేషన్ కార్యాలయ కిటికీ అద్దాలు, తలుపులు ధ్వంసం చేశారు.
శ్రీవారి ఖజానాను దోచుకున్న కరుణాకర్ రెడ్డి అండ్ కోని కచ్చితంగా శిక్షిస్తారని టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి హెచ్చరించారు. పరకామణి విషయంలో దొంగలను తీసుకెళ్లి లోకాయుక్తలో వారెలా రాజీ చేస్తారని ప్రశ్నించారు భానుప్రకాష్ రెడ్డి.
తిరుమల వేంకటేశ్వరస్వామి ప్రతిష్ట పెంచేలా చర్యలు తీసుకుంటున్నామని తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి చైర్మన్ బీఆర్ నాయుడు వ్యాఖ్యానించారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం గతం కంటే చాలా బావుందని భక్తులు చెబుతున్నారని పేర్కొన్నారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు.
తిరుపతి విశ్వవిద్యాలయంలోని సైకాలజీ విభాగంలో సీనియర్ విద్యార్థులు జూనియర్లను ర్యాగింగ్కు గురిచేసినట్లుగా ఫిర్యాదులు వచ్చాయి.
తిరుపతిలో మహిళపై ర్యాపిడో బైక్ డ్రైవర్ అసభ్యకరంగా ప్రవర్తించాడు. శనివారం అర్ధరాత్రి ఈ సంఘటన జరిగింది. ఈ సంఘటనపై అలిపిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తిరుపతి గరుడ వారధిపై ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు కొనసాగుతున్నాయని తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్ స్పష్టం చేశారు. తిరుపతిలో ప్రతి మలుపు వద్ద బ్లీకింగ్ లైట్లు, రేడియం ఏరో మార్క్స్, సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకున్నామని ఎస్పీ సుబ్బరాయుడు వెల్లడించారు.
శ్రీనివాసమంగాపురం నుంచి తిరుమలకు కాలినడకన వెళ్లే శ్రీవారిమెట్టు మార్గంలో చిరుత సంచారంతో కలకలం రేగింది. శుక్రవారం ఉదయం 150వ మెట్టు వద్ద అటవీ ప్రాంతంలోకి చిరుత దాటుతుండగా భక్తులు చూసి భయాందోళనకు గురై కేకలు వేయడంతో పారిపోయింది.