Home » Tirupathi News
వైసీపీ పాలనలో ఆడుదాం ఆంధ్రా పోటీలకు రూ.119 కోట్లు కేటాయించి, దుర్వినియోగం చేశారని శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు ఆరోపించారు. నిధులు పూర్తిగా పక్కదారి పట్టినట్లు విచారణలో తేలిందని అన్నారు. అమరావతి చాంపియన్షిప్ రాష్ట్రస్థాయి పోటీలలో భాగంగా సోమవారం ఉదయం ఎస్వీక్యాంపస్ హైస్కూల్ మైదానంలో విలువిద్య పోటీలను ఆయన ప్రారంభించారు.
రాజకీయ ఫ్యామిలీ నుంచే తాను వచ్చానని.. సమయం వచ్చినప్పుడు పొలిటికల్ ఎంట్రీ ఉంటుందని యువ కథానాయకుడు నారా రోహిత్ ఉద్ఘాటించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందిస్తోందని నొక్కిచెప్పారు.కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తుందని చెప్పుకొచ్చారు.
ఇంట్లోని టీవీ వెనుక కప్బోర్డులో 80 గ్రాముల బంగారు నగలు ఉంచారు. 20వ తేదీ చూస్తే ఉన్నాయి. శుక్రవారం ఉదయం చూస్తే లేవు. 20వ తేదీన మధ్యాహ్నం షాపునకు వెళ్లొచ్చిన అరగంట వ్యవధిలోనే దొంగతనం చేసుంటారని భావించారు.
జాతీయ స్థాయి నీట్ పీజీ ప్రవేశ పరీక్షా ఫలితాల్లో తిరుచానూరు వీవీ లేఅవుట్కి చెందిన డాక్టర్ గండికోట సాయినితేష్ అత్యుత్తమ ప్రతిభ చాటి ఆలిండియా136వ ర్యాంకుని కైవసం చేసుకున్నాడు. ఈనెల 3న నిర్వహించిన ప్రవేశపరీక్షా ఫలితాలను ఇదే నెల 19న విడుదల చేశారు. ఈ ఫలితాల్లో సాయినితేష్ 136వ ర్యాంకు సాధించి సత్తాచాటాడు.
తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను కాపాడేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉద్ఘాటించారు. తిరుమలలోమత విశ్వాసాల గౌరవించి సంతకం పెట్టమంటే వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎందుకు పెట్టలేదని నిలదీశారు. టీటీడీపైన బురదజల్లే ప్రయత్నం మానుకోవాలని హితవు పలికారు.
నగరి నియోజకవర్గంలోని నగరి, విజయపురం, నిండ్ర మండలాలను తిరుపతి జిల్లాలో కలపాలని ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. గురువారం అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రిని ఆయన కలిశారు.
గత ఐదు రోజులుగా తిరుమల తిరుపతి దేవస్థానంపై వైసీపీ బురద జల్లుతోందని టీటీడీ బోర్డు సభ్యుడు జ్యోతుల నెహ్రూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీపై వైసీపీ ఆరోపణలు అన్ని అవాస్తావాలని చెప్పుకొచ్చారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఒక్క ప్రోటోకాల్ తప్పా ఎలాంటి సదుపాయాలు ఉపయోగించుకోవడం లేదని క్లారిటీ ఇచ్చారు.
రేణిగుంట సమీపంలోని విమానాశ్రయం దగ్గరున్న ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ డిజిటల్ టెక్నాలజీస్ భవనంలో ఏర్పాటు చేసిన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సోక్స్ కేంద్రం అందుబాటులోకి వచ్చింది.
చిన్నగొట్టిగల్లు మండలం చిట్టేచర్ల పంచాయతీ నగరి సిరిగలవారిపల్లె గ్రామ పరిసరాల్లో ఒంటరి ఏనుగు పంటలను ధ్వంసం చేస్తున్నది.
ఏడు బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవడం ద్వారా తిరుపతి నగరపాలక సంస్థ కమిషనరు ఎన్.మౌర్య ‘మార్గదర్శి’గా మారారు.