Home » Tirumala
హైదరాబాద్కు చెందిన జక్కారెడ్డి శ్రీనివాసులు రెడ్డి అనే భక్తుడు ఈరోజు (మంగళవారం) ఉదయం స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం స్వామి వారికి రూ.30 లక్షలు విలువ చేసే 22 కేజీల వెండి గంగాళాన్ని విరాళంగా అందించారు.
తిరుమల శ్రీవారి వైద్య సేవలు ఇక నుంచి మరింత విస్తరించబోతున్నాయి. దేవస్థాన పరిధిలోని అన్ని హాస్పిటల్స్లో వాలంటర్ల మాదిరి డాక్టర్లు, నర్సులు, హాస్పిటల్ సిబ్బందికి కూడా అవకాశం ఇవ్వనున్నారు.
శ్రీనివాసమంగాపురం నుంచి తిరుమలకు కాలినడకన వెళ్లే శ్రీవారిమెట్టు మార్గంలో చిరుత సంచారంతో కలకలం రేగింది. శుక్రవారం ఉదయం 150వ మెట్టు వద్ద అటవీ ప్రాంతంలోకి చిరుత దాటుతుండగా భక్తులు చూసి భయాందోళనకు గురై కేకలు వేయడంతో పారిపోయింది.
వెంగమాంబ అన్నప్రసాద ట్రస్టుకు భక్తుల నుంచి ఆరు నెలల కాలంలో రూ. 180 కోట్లు విరాళంగా అందాయి. అంటే సగటున రోజుకు కోటి రూపాయలు ఈ ఒక్క ట్రస్టుకే భక్తులు సమర్పిస్తున్నారు. శ్రీనివాసుడి సమక్షంలో అన్నదానం అన్నది గొప్ప పుణ్యకార్యక్రమం కావడంతో విశేషంగా స్పందిస్తున్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ముందుచూపుతో మొంథా తుఫాను నుంచి చాలా తక్కువ నష్టంతో బయటపడ్డామని ఎంపీ సీఎం రమేష్ అన్నారు. మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, కుటుంబ సభ్యులతో కలిసి ఆయన గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
నందమూరి బాలకృష్ణ ‘అఖండ2’ సినిమాకు సంబంధించి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కొంతమేరకు పూర్తయిందని డ్రమ్స్ కళాకారుడు శివమణి తెలిపారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు.
అరుదైన బల్లిజాతిని గుర్తించారు.
మొంథా తుఫాన్ ప్రభావంతో సోమవారం తిరుమలలో వేకువజాము నుంచే ముసురు వాతావరణం కనిపించింది. చిరుజల్లులే కావడంతో భక్తులకు పెద్దగా అసౌకర్యం కలుగలేదు. ఉండిఉండీ దట్టమైన పొగమంచు తిరుమలను కప్పేస్తోంది.
అలిపిరి కాలిబాటలోని ఎన్ఎస్ టెంపుల్ వద్ద సుమారు తొమ్మిది అడుగుల పొడవైన నాగుపాము శుక్రవారం ఓ దుకాణంలోకి ప్రవేశించింది. దీనిని గుర్తించిన స్థానికులు వెంటనే పాములు పట్టే టీటీడీ కాంట్రాక్ట్ ఉద్యోగి భాస్కర్నాయుడికి సమాచారమిచ్చారు.
శ్రీవారి సేవా టిక్కెట్లు ఏర్పాటు చేస్తామని ఓ దళారీ భక్తులను మోసం చేశాడు. ఏకంగా హోంమంత్రి, టీటీడీ ఉద్యోగుల పేరు చెప్పి భక్తులను బురిడీ కొట్టించాడు దళారి అశోక్. ఇతడి మాటలు నమ్మిన భక్తులు బాగానే సమర్పించారు.