Home » Thummala Nageswara Rao
కేంద్రప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితోనే దేశవ్యాప్తంగా యూరియా కొరత నెలకొందని రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు. ఎరువుల ఉత్పత్తిని పెంచకపోవటం వల్ల సమస్య పెరిగిపోయిందన్నారు.
యూరియా కోసం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేసిన ఆందోళన ఓ కపట నాటకమంటూ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ధ్వజమెత్తారు.
బీఆర్ఎస్ నేతలపై మంత్రి తుమ్మల ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా సరఫరాలో కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం ప్రశ్నించకుండా రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు ఎందుకంటూ మండిపడ్డారు.
యూరియా కోసం రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రెండ్రోజుల్లో రాష్ట్రానికి 21,325 టన్నుల యూరియా వస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.
పోర్టుల నుండి ఆదిలాబాద్, జడ్చర్ల, గద్వాల, వరంగల్, మిర్యాలగూడ, పందిళ్లపల్లి, సనత్ నగర్, గజ్వెల్ ప్రాంతాలకు యూరియా చేరుకోనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు చెప్పుకొచ్చారు. అక్కడి నుంచి డిమాండ్ పరంగా జిల్లాలకు పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు.
ఆలస్యంగా విధులకు హాజరైతే ఉపేక్షించబోమని వ్యవసాయశాఖ, అనుబంధ కార్పొరేషన్ల అధికారులు, ఉద్యోగులను రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు స్పష్టం చేశారు.
వినాయక చవితి పండుగ పనులు మానుకొని మరీ యూరియా కోసం క్యూలైన్లలో ఓపిగ్గా నిల్చున్నారు రైతులు! ఎప్పటిలాగే తమ వంతు వచ్చేసరికి సరుకు నిండుకోవడం వారిని ఆగ్రహం తెప్పించింది.
రైతులకు రుణమాఫీ చేసినట్లే నేత కార్మికుల రుణాలను క్యాబినెట్లో చర్చించి త్వరలోనే మాఫీ చేస్తామని చేనేత జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.
రాష్ట్రంలో యూరియా కొరతపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలు సరికావని, వాస్తవాలను దాచి ఉల్టా రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంతో యూరియా కొరత నెలకొంటే రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లడం కిషన్ రెడ్డి స్థాయికి తగదని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా దిగుమతులు లేక దేశీయంగా ఉత్పత్తి డిమాండ్కు తగ్గ స్థాయిలో లేక నెలకొన్న కొరతపై వాస్తవాలు దాచిపెడుతున్నారని ఫైర్ అయ్యారు.