Home » TG Politics
బీసీలపై బీజేపీ, బీఆర్ఎస్లకు చిత్తశుద్ధి ఉంటే.. 42శాతం పార్టీ పరంగా ఇస్తామని ప్రకటించాలని కాంగ్రెస్ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఛాలెంజ్ చేశారు. రేవంత్రెడ్డిని బీజేపీ ఎంపీలు కాపాడితే.. తెలంగాణ నంబర్ వన్ అయ్యేదని.. మెట్రో ఫేజ్- 2 వచ్చేదని చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.
పెద్ద మోదీ, చిన్న మోదీ ఒకే రకంగా ప్రజలను మోసం చేస్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఇద్దరూ కలిసి రాహుల్కు పెద్ద షాక్ ఇవ్వటం ఖాయమని కేటీఆర్ హెచ్చరించారు.
కడియం శ్రీహరికి ఘన్పూర్ అభివృద్ది ఇప్పుడు గుర్తొచ్చిందా అని మాజీ మంత్రి తాటికొండ రాజయ్య ప్రశ్నించారు. కడియంకు తన అభివృద్ధి తప్పా.. ఘన్పూర్ అభివృద్ధితో పనిలేదని విమర్శించారు. ఘన్పూర్లో కడియం మార్క్ ఎక్కడా కనిపించదని తాటికొండ రాజయ్య ఆరోపించారు.
కేంద్రమంత్రి బండి సంజయ్ బీసీ కాదని.. దేశ్ముఖ్ అని టీపీసీసీ చీఫ్ మహేష్కుమార్గౌడ్ ఆరోపించారు. బీసీల గురించి బండి సంజయ్ ఎప్పుడైనా మాట్లాడారా? అని ప్రశ్నించారు. బీజేపీ నేతలు దేవుడి పేరుతో ఓట్లు అడిగే బిచ్చగాళ్లు అని ఆక్షేపించారు.
కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంతో యూరియా కొరత నెలకొంటే రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లడం కిషన్ రెడ్డి స్థాయికి తగదని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా దిగుమతులు లేక దేశీయంగా ఉత్పత్తి డిమాండ్కు తగ్గ స్థాయిలో లేక నెలకొన్న కొరతపై వాస్తవాలు దాచిపెడుతున్నారని ఫైర్ అయ్యారు.
తనని నమ్ముకున్న ప్రజల అభివృద్ధి ధ్యేయంగా తన అడుగుటు ఉంటాయని ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎం రేవంత్ రెడ్డిని కలిశానని వివరించారు. చట్టాలను గౌరవించే వ్యక్తిని.. చట్టానికి లోబడి నిర్ణయం తీసుకుంటానని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కోర్ట్ తీర్పు నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై, ఎన్నికలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసే విషయంలో చర్చలు జరగనున్నాయి. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలలో అనుసరించాల్సిన వ్యూహాలు, ఏఐసీసీ పిలుపు మేరకు ఓట్ చోరీ, గద్దె చోడ్ ఉద్యమాన్ని రాష్ట్రంలో విస్తృతంగా చేపట్టే అంశాలపై చర్చలు కొనసాగానున్నాయి
అర్హులైన ప్రతి ఒక్కరికి నూతన రేషన్ కార్డులు మంజూరు చేస్తున్నామని మంత్రి సీతక్క తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సన్నబియ్యం పథకాన్ని ఇందిరమ్మ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని మంత్రి సీతక్క ఉద్ఘాటించారు.
మాజీ మంత్రి కేటీఆర్ చేసిన కాంగ్రెస్ థార్థ్ క్లాస్ పార్టీ అన్న వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ స్పందించారు. పదేళ్లు అధికారంలో ఉండి... ఇప్పుడు అధికారం పోయేసరికి కేటీఆర్ మతి భ్రమించి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ముందు కేసీఆర్ను అసెంబ్లీకి రప్పించి తర్వాత కేటీఆర్ మాట్లాడితే బాగుంటుందని మంత్రి కొండా సురేఖ హితవు పలికారు.
జర్నలిస్టులకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ భరోసా ఇచ్చారు. జర్నలిస్టులారా.... బాధపడకండి.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల వైఫల్యాలవల్లే మీకు ఇళ్ల స్థలాలు రావడం లేదని ఆందోళన వ్యక్త చేశారు. న్యాయ నిపుణులతో చర్చించకుండా తూతూ మంత్రంగా జీవో ఇవ్వడంవల్లే ఈ దుస్థితి వచ్చిందని వాపోయారు. ఓట్ల కోసం ఆ రెండు పార్టీలు అడ్డగోలు హామీలిస్తూ అధికారంలోకి వచ్చాక గాలికొదిలేస్తున్నాయని బండి సంజయ్ ధ్వజమెత్తారు.