Home » TG News
42 శాతం బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ను వెంటాడుతాం.. అని రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. ఆయన మాట్లాడుతూ... పంచాయతీ ఎన్నికల్లో జీఓ46ను తీసుకొచ్చి బీసీలను ప్రభుత్వం దగా చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నగరంలోని అంబర్పేట ఎస్ఐ భానుప్రకాష్ రెడ్డి తన సర్వీస్ రివాల్వర్ను ఏం చేశారన్న దానిపై పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. ఆ అటు ఈస్ట్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులతోపాటు సిటీ పోలీసులు లోతుగా దర్యాప్తు ప్రారంభించారు. ఈ రివాల్వర్కు సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి.
హైదరాబాద్ నగరంలో రాబోయే రోజుల్లో మరిన్ని ఇందిరమ్మ క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని నగర ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఈ క్యాంటీన్లను నిరుపేద ప్రజలు అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
పోలీసులు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి.. విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తే వేటు తప్పదు.. అంటూ సిబ్బందికి సిటీ పొలీస్ కమిషనర్ విశ్వనాథ్ చెన్నప్ప సజ్జనార్ హెచ్చరికలు జారీ చేశారు. పోలీస్ వ్యవస్థ సరిగా లేకపోతే అసాంఘిక శక్తులు పెరిగిపోతాయని, పోలీసులు ప్రతిక్షణం అలెర్ట్గా ఉండాలని ఆయన సూచించారు.
ఏకగ్రీవాలు ఆగడం లేదు. సరికదా.. జోరందుకుంటున్నాయి నామినేషన్ల హడావుడి, గ్రూపు రాజకీయాలు, విజయం కోసం ఎత్తులు పైఎత్తులతో కూడిన రాజకీయాలతో వేడెక్కే గ్రామాలు కూడా చిత్రంగా ఐక్యతా రాగం వినిపిస్తున్నాయ్. వీరో.. వారో ఎవరైతే నేమీ.. వేలంపాటలో పోటీపడండి.
నగరంలోని కూకట్పల్లి రైతుబజార్లో కూరగాయల ధరల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మొన్నటి వరకు టమోటా కేజీ రూ. 50కి పైగానే ఉన్న ధర కొంచెం తగ్గింది. ప్రస్తుతం రూ. 35కి విక్రయిస్తున్నారు. అయితే.. బెండకాయకు ధర పెరిగింది. కిలో రూ. 45 నుంచి రూ. 55 వరకు విక్రయస్తున్నారు. మొత్తంగా కూరగాయల ధరలు ఎలా ఉన్నాయో ఓసారి పరిశీలిస్తే...
నగరంలో ఆయా ఏరియాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. విద్యుత్ లైన్ల మరమ్మతుల కారణంగా విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్ల తెలిపారు. వినియోగదాలు సహకరించాలని అధికారులు తెలిపారు.
విశాఖపట్నం-లింగంపల్లి జన్మభూమి ఎక్స్ప్రెస్ సహా ప్రధాన రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వేశాఖ వాల్తేరు సీనియర్ డీసీఎం కె.పవన్కుమార్ తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో గోదావరి-రాజమండ్రి, రాజమండ్రి-కడియం సెక్షన్లలో ఆధునికీకరణ నిర్మాణ పనులు చేపట్టనున్న నేపథ్యంలో జనవరిలో పలు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నామని
పంట నష్ట పరిహారం విషయంలో విత్తన ముసాయిదా బిల్లులో స్పష్టత లేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రభుత్వ పక్షాన కేంద్ర ముసాయిదా విత్తన బిల్లుపై అభ్యంతరాలు, సవరణలు గట్టిగానే తెలుపుతామని హెచ్చరించారు.
పంచాయతీ ఎన్నికల నిర్వహణపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ దశలో ఎన్నికలపై స్టే విధించలేమని స్పష్టం చేసింది.