Home » TG News
శ్రీశైలం మహాక్షేత్రానికి ఆదివారం భక్తులు భారీగా తరలి వచ్చారు. తెలుగు రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో తరలి రావడంతో ఆలయ ప్రధాన వీధులన్నీ రద్దీగా మారాయి. క్షేత్ర పరిధిలోని సత్ర సముదాయాలు కిక్కిరిసి కనిపించాయి. భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లను దర్శించుకునేందుకు ఆదివారం ఉదయం నుంచే భక్తులు బారులు దీరారు.
పోలీస్ స్టేషన్ల మాదిరిగా అటవీ శాఖ పరిధిలో ఫారెస్ట్ స్టేషన్లు ఏర్పాటు చేయాలన్న అంశం అటకెక్కింది. తొలి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 30 ఫారెస్ట్ స్టేషన్లను ఏర్పాటు చేసేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో అటవీశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందికి ఆయుధాలు అందజేయాలని కోరింది. ఈ ప్రతిపాదనలన్నీ కాగితాలకే పరిమితమయ్యాయి.
ఈ నెల 9న వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం పాపయ్యపేట గ్రామానికి చెందిన అల్లంనేని పాపారావు (65) తన చేలో మొక్కజొన్న కొయ్యల దహనానికి అగ్గిపుల్ల గీయగా మంటలు చెలరేగాయి. ఎండల తీవ్రతతో మరింత పెట్రేగాయి. వాటి ధాటికి పాపారావు సజీవ దహనమయ్యాడు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రం పరిసరాల్లో ఆదివారం ఎక్కడ చూసినా వాహనాలే కనిపించాయి. వారాంతపు సెలవు రోజు, వేసవి సెలవులు కావడంతో రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు స్వామి వారి దర్శనానికి పోటెత్తారు. చాలా మంది భక్తులు తమ సొంతవాహనాల్లో తరలివచ్చారు. దీంతో యాదగిరిగుట్ట కొండ మీద, కొండ కింద పార్కింగ్ ప్రదేశాలు వాహనాలతో కిటకిటలాడాయి.
రైల్వేలో ఉద్యోగాలిప్పిస్తామని నిరుద్యోగులను మోసం చేసే ముఠాలకు దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయం రైల్ నిలయం అడ్డాగా మారిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మోసగాళ్ల వలలో చిక్కుకుని పలువురు నిరుద్యోగులు లక్షలాది రూపాయలు పోగొట్టుకొని లబోదిబోమంటున్నారు.
మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న కూతురు వల్ల ఎదురవుతున్న ఇబ్బందులను తట్టుకోలేక కన్నవాళ్లే ఆమెను హత్య చేశారు. ఆ తప్పు బయటపడకుండా ఉండాలని తమ ఒక్కగానొక్క బిడ్డ అనారోగ్యంతో మరణించిందని కూతురి అత్తింటి వారిని నమ్మించి అంత్యక్రియలు పూర్తి చేశారు. కానీ, నిజం బయటకు రావడంతో కటకటాలపాలయ్యారు.
రాష్ట్రంలో సోమవారం కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మంగళవారానికి సంబంధించి ఎటువంటి వాతావరణ హెచ్చరికలు జారీ చేయలేదు. ఈనెల 22, 23 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. శనివారంతో పోలిస్తే ఆదివారం పగటి ఉష్ణోగ్రతలు కొన్ని జిల్లాల్లో 2 డిగ్రీల మేరకు పెరిగాయి.
పర్యావరణాన్ని కాపాడేలా భవన నిర్మాణాలు చేపట్టి తెలంగాణలో జీవన విధానం మార్చాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క సూచించారు. భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా 50 శాతం నీరు, 40 శాతం విద్యుత్ ఆదా చేసే హరిత నిర్మాణాలకు సర్కారు ప్రోత్సాహం ఉంటుందని తెలిపారు.
రాష్ట్రంలో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు తడిచిన పంటలను, ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని తెలంగాణ రైతు సంక్షేమ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు జస్టిస్ బి. చంద్రకుమార్ డిమాండ్ చేశారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో వివిధ సంఘాల ప్రతినిధులు డాక్టర్ పృథ్వీరాజ్ యాదవ్, సీనియర్ జర్నలిస్ట్ విఠల్ తదితరులతో కలిసి చంద్రకుమార్ విలేకరులతో మాట్లాడారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi Liquor scam Case) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) జ్యుడీషియల్ కస్టడీ రేపటితో(సోమవారం) ముగియనున్నది. ఈడీ, సీబీఐ రెండు కేసుల్లోనూ రేపు విచారణ జరగనున్నది. ఈ మేరకు రేపు మధ్యాహ్నం 2గంటలకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగించే విషయంపై రౌస్ అవెన్యూ కోర్టు విచారించనున్నది. జ్యుడీషియల్ కస్టడీ ముగియడంతో కవితను కోర్టు ముందు ఈడీ, సీబీఐ హాజరు పరిచే అవకాశం ఉంది.