Home » TG Govt
మాజీ మంత్రి కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు శుక్రవారం హాజరైన విషయం తెలిసిందే. ఈ విచారణ అనంతరం సిట్ చీఫ్ సజ్జనార్ స్పందించారు. ఆధారాలు, రికార్డులు ముందుంచి కేటీఆర్ను విచారణ జరిపామని స్పష్టం చేశారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావును సిట్ అధికారులు శుక్రవారం విచారణ జరిపారు. ఈ కేసులో కేటీఆర్ను అధికారులు పలు ప్రశ్నలు అడిగారు. కేటీఆర్ను సుమారుగా 7 గంటలకు పైగా ప్రశ్నించారు.
సింగరేణిలో 2014 నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని టెండర్లపై సమగ్ర విచారణ జరిపించాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డికి కాంగ్రెస్ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి లేఖ రాశారు. ఈ లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు.
వికారాబాద్ మాజీ శాసనసభ్యులు, బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ అధ్యక్షుడు మెతుకు ఆనంద్కు తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ లీగల్ నోటీసులు పంపారు. తన న్యాయవాది ద్వారా ఈ నోటీసులు పంపించారు స్పీకర్.
గిరిజన కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ మేడారం జాతరకు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవతో కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ, గిరిజన మంత్రిత్వ శాఖలు రూ.3.70 కోట్ల నిధులు విడుదల చేసింది.
స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో కలిసి మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. సీఎం పర్యటన అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది.
గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు హబ్గా హైదరాబాద్ ఉంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ రైజింగ్-2047తో 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వృద్ధి లక్ష్యమని పేర్కొన్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దగ్గర ఒక్క ఆధారమూ లేదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు తెలిపారు. అన్నీ నిరాధారమైన ఆరోపణలు.. సొల్లు పురాణమేనని ఎద్దేవా చేశారు. ఈ కేసులో అడిగిన ప్రశ్నలే అడిగారు తప్ప.. మరేమీ లేదని స్పష్టం చేశారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో యూఏఈ మంత్రి దావోస్లో మంగళవారం భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. భారత్ ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి తెలంగాణతో కలిసి పని చేస్తామని యూఏఈ మంత్రి తెలిపారు.
తెలంగాణలోని మేడారం జాతరకు రాష్ట్రంలోని 51 సెంటర్ల నుంచి 4వేల బస్సులు నడిపేలా ఏర్పాట్లు చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. మేడారానికి వెళ్లే మహిళలకు ఉచిత ప్రయాణం ఉంటుందని స్పష్టం చేశారు.